Political News

ఢిల్లీ వేదికగా జగన్ తీరుపై చంద్రబాబు ధ్వజం

వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అది కూడా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జగన్ తీరుపై చంద్రబాబు ధ్వజమెత్తడం గమనార్హం. ఇల్లీగల్ పనులు చేస్తాం.,..మాకు భద్రత ఇవ్వండి అంటే… ప్రభుత్వాలు వారికి భద్రత కల్పించాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రేపు రౌడీయిజం కూడా చేస్తాం,…మాకు భద్రత కల్పించండి అని అడుగుతారు?… అప్పుడు కూడా వారికి భద్రత కల్పిద్దామా? అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా జగన్ వ్యవహారం తన పరిధి కాదని చెప్పిన చంద్రబాబు.. జగన్ చేసిన పనిని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తుందని తెలిపారు. మీరు అడిగారు కాబట్టి నేను స్పందిస్తున్నానని తెలిపారు.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం తాను గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను పరామర్శిస్తానని జగన్ అంటే… ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ పర్యటనకు అనుమతి ఇవ్వబోమని ఎన్నికల సంఘం చెప్పిన సంగతి తెలిసిందే. అయినా కూడా జగన్ ఎన్నికల సంఘం ఆదేశాలను లెక్కచేయకుండా గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ కు ప్రభుత్వం భద్రత కల్పించలేదు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న జగన్ కు కనీస భద్రత కల్పించరా అంటూ వైసీపీ ఆరోపించింది. దీనిపై గవర్నర్ కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు.

ఈ అంశంపై గురువారం చంద్రబాబును స్పందన కోరగా…ఆయన వైసీపీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేసే వారికి ప్రభుత్వ భద్రత ఎలా లభిస్తుందని చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. అంతేకాకుండా రౌడీయిజం చేస్తామంటే కుదరదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఓ రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించడం వైసీపీ బాధ్యత అని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం అంటే… టీడీపీనో, బీజేపీనో, ఎన్డీఏనో పెట్టిన సంస్థ కాదని.. అదో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని చంద్రబాబు అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లుతుందంటే… అందుకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా జరుగుతున్న ఎన్నికలేనని గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు. ఏ పార్టీ అయినా ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించి తీరాల్సిందేనని కూడా చంద్రబాబు అన్నారు.

This post was last modified on February 20, 2025 8:51 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…

13 minutes ago

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

35 minutes ago

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

2 hours ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

2 hours ago

ధైర్యం అనుమానం మధ్య ‘పెద్ది’ సందిగ్ధం

రేపు ప్రారంభం కావాల్సిన పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8కి వాయిదా వేయడం అభిమానుల్లో ఖంగారు పుట్టిస్తోంది.…

2 hours ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

4 hours ago