Political News

భారత విమానయాన రంగంలో ఇన్ని వేల ఉద్యోగాలా…

భారత పౌర విమానయాన రంగం ఓ రేంజిలో వృద్ధి చెందుతోంది. గడచిన పదేళ్లలో అనూహ్య వృద్ధిని నమోదు చేసిన భారత ఏవియేషన్ రంగం.. సమీప భవిష్యత్తులో మరింతగా విస్తరించనుంది. ప్రస్తుతం దేశంలో 157 విమానాశ్రయాలు ఉంటే… రానున్న ఐధేళ్లో వీటి సంఖ్య ఏకంగా 200 మార్కును దాటనుంది. రానున్న ఐదేళ్లలో కొత్తగా 50 ఎయిర్ పోర్టులు అందుబాటులోకి రానున్నాయని టీడీపీ యువనేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. గురువారం ఢిల్లీలోని డైరెక్టర్ జనరల్ ఆప్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కార్యాయంలో పైలట్ల నమోదుకు సంబంధించిన నూతన వ్యవస్థ ఎలక్ట్రానిక్ పర్సనెల్ లైసెన్స్ ను ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేసిన రామ్మోహన్ నాయుడు.. సమీప భవిష్యత్తులో భారత్ లో 20 వేల మంది కొత్త పైలట్లు అవసరమవుతారని పేర్కొన్నారు. పౌర విమానయానంలో కొనసాగుతున్న వృద్ధే ఇందుకు కారణమని ఆయన అన్నారు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ విమానయాన ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పిన మంత్రి… అందుకు అనుగుణంగానే నూతన ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి నుంచి విమానాల రాకపోకలు కూడా భారీ ఎత్తున పెరగనున్నాయని చెప్పిన మంత్రి… అందుకు అవసరమైన మేర పైలట్లను కూడా సమకూర్చుకోవాల్సి ఉందన్నారు.

దేశీయ విమానయాన రంగంలో కొనసాగుతున్న వృద్ధికి అనుగుణంగా కొత్తగా 1,700 విమానాలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి చెప్పారు. సివిల్ ఏవియేషన్ లో ఈ రీతిన కొనసాగుతున్న వృద్ధితో అంతర్జాతీయంగా కనెక్టివిటీ పెరగనుందన్నారు. కొత్తగా అందుబాటులోకి రానున్న విమానాలు, ఎయిర్ పోర్టుల నేపథ్యంలో కొత్తగా ఈ రంగంలో పైలట్ల సంఖ్య గణనీయంగా పెరగనుందని తెలిపారు. ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని పైలట్ల నమోదు కోసం ఆన్ లైన్ సేవలు అందిస్తున్నామని… అందులో భాగంగానే 24 గంటలు అందుబాటులో ఉండే ఎలక్ట్రానిక్ పర్సనెల్ లైసెన్స్ ను ప్రారంభించామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సేవల్లో భాగంగా ఈ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

This post was last modified on February 20, 2025 3:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

40 minutes ago

చరణ్ యష్ అనుకుంటే సత్యదేవ్ వస్తున్నాడు

వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…

1 hour ago

సాయిపల్లవికి ‘ఒక రోజు’ షాక్ ఇస్తుందా

చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…

4 hours ago

టీడీపీ మహిళా ఎమ్మెల్యే పీఏగా ట్రాన్స్ జెండర్..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…

5 hours ago

జేడీ వదులుకున్న కల్ట్ బ్లాక్‌బస్టర్

ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…

6 hours ago

దేవి 2… రాజుగారికి పెద్ద ఛాలెంజ్

ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…

6 hours ago