Political News

స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా.. !

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ ఎమ్మెల్యే రేఖా గుప్తా చేయనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న చంద్రబాబు… రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్నివాయిదా వేసుకుని మరీ హస్తిన వెళ్లారు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక సంఖ్యలో ఎంపీలున్న పార్టీగా టీడీపీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్ఠానం నుంచి చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం అందింది.

ఇదిలా ఉంటే… పని ఏదైనా. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా… చంద్రబాబు దృష్టి మొత్తం రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉంటుంది. అసలే రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఎలాగోలా రాష్ట్రాన్ని గడ్డన పడేయాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. అందుకోసం అందుబాటులో ఉన్న ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆయన కదులుతున్నారు. అందులో భాగంగా అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఆయన వదులుకోవడం లేదు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లింది… అక్కడి సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకే అయినా… రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా ఓ ప్రణాళికలను సిద్దం చేసుకుని మరీ చంద్రబాబు ఢిల్లీ ఫ్లైటెక్కారు.

ఈ ప్రణాళిక ప్రకారం ఢిల్లీ సీఎం పదవీ ప్రమాణ కార్యక్రమం ముగిసినంతనే చంద్రబాబు తన పని ప్రారంభించనున్నారు. అందుబాటులో ఉండే పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. అందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై అమిత్ షాతో చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. ఇక మిర్చి రైతులకు మద్దతు ధర విషయంపై చర్చించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే మిర్చి రైతుల సమస్యలపై ఆయన కేంద్ర మంత్రికి బుధవారం లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే సమస్యపై చర్చించేందుకే చంద్రబాబు ఆయనతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి.

Kumar

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

41 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

1 hour ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

3 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

9 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

9 hours ago