Political News

పులివెందుల‌కు ఉప ఎన్నిక రావాల‌ని మొక్కుకో!: ర‌ఘురామ‌

“ఏం ర‌వి.. ఏం కోరుకుంటున్నావ్‌.. పులివెందుల‌కు ఉప ఎన్నిక రావాల‌ని మొక్కుకో!“ – ఇదీ.. ఉత్త‌ర‌ప్ర‌దే శ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హాకుంభ‌మేళాకు వెళ్లిన‌.. ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ రాజు చేసిన వ్యాఖ్య‌. అది కూడా.. టీడీపీ పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ బీటెక్ ర‌విని ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు! దీనిపై ర‌వి కూడా హ్యాపీగా ఫీల‌య్యారు. అంతేకాదు.. అదే ప‌రిస్థితి వ‌స్తే.. ర‌ఘురామే నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఇంచార్జ్‌గా రావాల‌ని ఆకాంక్షించ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది..?

మహాకుంభ‌మేళాకు.. ర‌ఘురామ‌కృష్ణ‌రావు, బీటెక్ ర‌వి, మంత్రి నారా లోకేష్ దంప‌తులు అదేవిధంగా సీఎం ర‌మేష్ స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా.. నారా లోకేష్ దంప‌తులు వేరుగా.. యాత్ర‌ను కొన‌సాగించారు. ర‌ఘురామ‌, బీటెక్ ర‌వి ఒక బృందంగా ఏర్ప‌డ్డారు. వీరిరువు క‌లిసి ప్ర‌యాగ్ రాజ్‌లో ఈ రోజు ఉద‌యం స్నానం చేసి.. అక్క‌డే ఉన్న పురాత‌న మ‌ర్రి వృక్షానికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంద‌ర్భంగానే ర‌ఘురామ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు.

పులివెందులకు ఉప ఎన్నిక రావాలని మొక్కుకో.. అని రఘురామకృష్ణ‌రాజు అన్నారు. దీనికి ప్ర‌తిగా.. స్పందించిన బీటెక్ ర‌వి.. `ఉప ఎన్నిక వస్తే మీరు ఇన్ఛార్జ్ గా రావాలి“ అని రఘురామను ఉద్దేశించి చెప్పారు. దీనికి అంగీక‌రించిన ర‌ఘురామ‌.. సాధ్య‌మైనంత వ‌ర‌కు పులివెందుల ఉప ఎన్నిక వ‌స్తుంద‌న్న ఉద్దేశం త‌న‌కు ఉంద‌న్నారు. కాగా.. ఈ వ్యాఖ్య‌లపై నెటిజ‌న్ల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. పులివెందుల ఇంచార్జ్‌గా ఉన్న బీటెక్ ర‌వికి విజ‌యాన్ని అందించే ప్ర‌య‌త్నం స‌క్సెస్ కావాల‌ని.. కొంద‌రు వ్యాఖ్యా నించారు.

కానీ, మ‌రికొంద‌రు మాత్రం ప్ర‌యాగ్‌రాజ్‌లో పుణ్య‌స్నానానికి వెళ్లినా.. అక్క‌డా రాజ‌కీయాలేనా? అని పెద‌వి విరుస్తున్నారు. ఇదిలావుంటే.. పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట‌. సుదీర్ఘ కాలంగా ఇక్క‌డ వైఎస్ కుటుంబ‌మే విజ‌యం ద‌క్కించుకుంటోంది. ఈ క్ర‌మంలో టీడీపీ ఈ ద‌ఫా అయినా విజయం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.

This post was last modified on February 19, 2025 9:02 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

1 hour ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

2 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

4 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

6 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

11 hours ago

మోడీపై సీనియర్ నటుడి ఊహించ‌ని ఎలివేషన్

సినిమా వాళ్ల‌కు రాజ‌కీయ ఆస‌క్తులు, అభిమానాలు ఉండ‌డం కొత్త కాదు. అందులో త‌ప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజ‌కీయాల…

11 hours ago