Political News

పులివెందుల‌కు ఉప ఎన్నిక రావాల‌ని మొక్కుకో!: ర‌ఘురామ‌

“ఏం ర‌వి.. ఏం కోరుకుంటున్నావ్‌.. పులివెందుల‌కు ఉప ఎన్నిక రావాల‌ని మొక్కుకో!“ – ఇదీ.. ఉత్త‌ర‌ప్ర‌దే శ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హాకుంభ‌మేళాకు వెళ్లిన‌.. ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ రాజు చేసిన వ్యాఖ్య‌. అది కూడా.. టీడీపీ పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ బీటెక్ ర‌విని ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు! దీనిపై ర‌వి కూడా హ్యాపీగా ఫీల‌య్యారు. అంతేకాదు.. అదే ప‌రిస్థితి వ‌స్తే.. ర‌ఘురామే నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఇంచార్జ్‌గా రావాల‌ని ఆకాంక్షించ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది..?

మహాకుంభ‌మేళాకు.. ర‌ఘురామ‌కృష్ణ‌రావు, బీటెక్ ర‌వి, మంత్రి నారా లోకేష్ దంప‌తులు అదేవిధంగా సీఎం ర‌మేష్ స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా.. నారా లోకేష్ దంప‌తులు వేరుగా.. యాత్ర‌ను కొన‌సాగించారు. ర‌ఘురామ‌, బీటెక్ ర‌వి ఒక బృందంగా ఏర్ప‌డ్డారు. వీరిరువు క‌లిసి ప్ర‌యాగ్ రాజ్‌లో ఈ రోజు ఉద‌యం స్నానం చేసి.. అక్క‌డే ఉన్న పురాత‌న మ‌ర్రి వృక్షానికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంద‌ర్భంగానే ర‌ఘురామ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు.

పులివెందులకు ఉప ఎన్నిక రావాలని మొక్కుకో.. అని రఘురామకృష్ణ‌రాజు అన్నారు. దీనికి ప్ర‌తిగా.. స్పందించిన బీటెక్ ర‌వి.. `ఉప ఎన్నిక వస్తే మీరు ఇన్ఛార్జ్ గా రావాలి“ అని రఘురామను ఉద్దేశించి చెప్పారు. దీనికి అంగీక‌రించిన ర‌ఘురామ‌.. సాధ్య‌మైనంత వ‌ర‌కు పులివెందుల ఉప ఎన్నిక వ‌స్తుంద‌న్న ఉద్దేశం త‌న‌కు ఉంద‌న్నారు. కాగా.. ఈ వ్యాఖ్య‌లపై నెటిజ‌న్ల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. పులివెందుల ఇంచార్జ్‌గా ఉన్న బీటెక్ ర‌వికి విజ‌యాన్ని అందించే ప్ర‌య‌త్నం స‌క్సెస్ కావాల‌ని.. కొంద‌రు వ్యాఖ్యా నించారు.

కానీ, మ‌రికొంద‌రు మాత్రం ప్ర‌యాగ్‌రాజ్‌లో పుణ్య‌స్నానానికి వెళ్లినా.. అక్క‌డా రాజ‌కీయాలేనా? అని పెద‌వి విరుస్తున్నారు. ఇదిలావుంటే.. పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట‌. సుదీర్ఘ కాలంగా ఇక్క‌డ వైఎస్ కుటుంబ‌మే విజ‌యం ద‌క్కించుకుంటోంది. ఈ క్ర‌మంలో టీడీపీ ఈ ద‌ఫా అయినా విజయం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.

Kumar

Recent Posts

కొత్త శుక్రవారం… కావాలి శుభప్రదం

టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…

2 hours ago

ఎక్కడ చూసినా GV ప్రకాష్ సంగీతమే

టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…

2 hours ago

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

4 hours ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

5 hours ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ?

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

8 hours ago

రిష‌బ్ శెట్టి మీద 500 కోట్లా?

నాలుగేళ్ల‌ ముందు వ‌ర‌కు రిష‌బ్ శెట్టి అంటే.. క‌న్న‌డ‌కే ప‌రిమిత‌మైన ఒక న‌టుడు, ద‌ర్శ‌కుడు. త‌న మార్కెట్ ప‌రిధి చాలా…

10 hours ago