Political News

బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం విజయవాడ జైలుకు వెళ్లారు. ఇటీవలే అరెస్టై జైల్లో ఉన్న తన పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మె్ల్యే వల్లభనేని వంశీ మోహన్ తో ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన జగన్… అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంతో పాటుగా అధికార యంత్రాంగానికి కూడా భారీ హెచ్చరికలు జారీ చేశారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని చెప్పిన జగన్… అప్పుడు తప్పులు చేసిన అధికారులతో పాటుగా వారిని ప్రోత్సహించిన టీడీపీ నేతలను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా జగన్ నోట నుంచి బట్టలూడదీసి నిలబెడతాం అంటూ ఓ రేర్ కామెంట్ వినిపించింది. అంతేకాకుండా రిటైర్ అయిపోయి తప్పించుకుందామనుకునే వారిని కూడా వదిలిపెట్టబోమన్న జగన్… రిటైర్ అయిన వారు సప్త సముద్రాల ఆవల ఉన్నా రప్పిస్తామని… చట్టం ముందు వారిని నిలబెట్టి చట్టబద్ధంగానే శిక్షలు పడేలా చేస్తామని చెప్పారు.

ఈ సందర్బంగా వంశీపై టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకించి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు. టీడీపీ నేత పట్టాభిరాం స్వయంగా రంగంలోకి దిగి వంశీని అనరాని మాటలు అన్నారని… వంశీని రెచ్చగొట్టేలా గన్నవరం వెళ్లి వైసీపీ కార్యాలయం మీదకు దాడికి యత్నించారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు ప్రతిస్పందించి… టీడీపీ కార్యాలయంపైకి దాడికి యత్నించాయన్నారు. అయితే ఈ దాడిలో వంశీ పాల్గొన్నట్టుగా ఎక్కడా లేదని జగన్ తెలిపారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల్లో గానీ… టీడీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదులో గానీ… సత్యవర్థన్ నుంచి పోలీసులు సేకరించిన స్టేట్ మెంట్ లో గానీ… ఎక్కడా వంశీ పేరే లేదని జగన్ తెలిపారు. అయినా కూడా వంశీపై కక్షగట్టిన చంద్రబాబు… ఈ కేసులో వంశీని 71వ నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేయించారని ఆరోపించారు. వంశీ తప్పు చేయకున్నా కూడా అరెస్ట్ అయ్యారని.. అసలు ఈ వ్యవహారంలో వంశీ తప్పే లేదని కూడా జగన్ చెప్పారు.

రాష్ట్రంలో కూటమి సర్కారు దుర్మార్గ పాలన సాగిస్తోందని చెప్పిన జగన్… ప్రస్తుతం రాష్ట్రంలోని పలు మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో జరుగుతున్న ఎన్నికలే నిదర్శనమన్నారు. పిడుగురాళ్ల, తుని, తిరుపతి, పాలకొండ పురపాలికల ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని ఆయన ఆరోపించారు. పిడుగురాళ్లలో ఒక్కటంటే ఒక్క కౌన్సిలర్ సీటును గెలవని టీడీపీ… అందులో వైస్ చైర్మన్ పోస్టును ఎలా దక్కించుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడూ టీడీపీనే అధికారంలో ఉండదన్ జగన్… వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని చెప్పారు. ఈ విషయాన్ని చట్టాన్ని కాపాడే అధికారులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పోలీసులు తమ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయాలన్న జగన్… అందుకు విరుద్దంగా టీడీపీ నేతలకు సెల్యూట్ చేసే అధికారులను మాత్రం వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. జగన్ వెంట పార్టీ నేతలు పేర్ని నాని, కొడాలి నాని, వంశీ సతీమణి పంకజ శ్రీ తదితరులున్నారు.

This post was last modified on February 18, 2025 3:57 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

32 minutes ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

2 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

2 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

2 hours ago

సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…

3 hours ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

3 hours ago