Political News

మ‌హిళ‌పై దాడి.. కోర్టులో లొంగిపోయిన వైసీపీ మాజీ ఎంపీ

వైసీపీ కీల‌క నాయ‌కుల‌ను కేసులు వెంటాడుతున్నాయి. ఒక కేసు నుంచి బ‌య‌ట ప‌డ్డామ‌ని అనుకుంటే… వారు చేసిన త‌ప్పు లు మ‌రిన్ని కేసుల రూపంలో నాయ‌కుల‌ను వెంటాడుతున్నాయి. ఇటీవ‌లి వ‌ర‌కు జైల్లో ఉండి.. కొన్నాళ్ల కింద‌టే బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన బాప‌ట్ల మాజీ ఎంపీ.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నందిగం సురేష్ తాజాగా మ‌రో కేసులో చిక్కుకున్నారు. ఈ నేప‌థ్యంలో తానే స్వ‌యంగా గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలోని జూనియ‌ర్ సివిల్ జ‌డ్జి ఎదుట సోమ‌వారం సాయంత్రం లొంగిపోయారు. అనంత‌రం.. ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఏం జ‌రిగింది?

వైసీపీ హ‌యాంలో రాజ‌ధాని అమ‌రావ‌తిని కాద‌ని.. మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. దీనికి వ్య‌తిరేకంగా రాజ‌ధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్య‌మించారు. వీరిలో మ‌హిళా రైతులు కూడా ఉన్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి జ‌రిగిన ఈ ఉద్య‌మం దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం రేకెత్తించింది. రాజ‌ధాని కోసం ఉద్య‌మించిన రైతులుగా వారు రికార్డు సృష్టించారు. అయితే.. ఈ స‌మ‌యంలో మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా అప్ప‌టి ఎంపీ నందిగం సురేష్ మ‌రో ఉద్య‌మానికి శ్రీకారం చుట్టారు. అమ‌రావ‌తి కంటే మూడురాజ‌ధానులే కావాలంటూ.. వారంతా ఉద్య‌మించారు.

ఈ క్ర‌మంలో అటు రాజ‌ధాని రైతుల శిబిరాల‌కు స‌మీపంలోనే మూడు రాజ‌ధానులు కావాలంటూ ఆందోళ‌న చేప‌ట్టిన వారు కూడా శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇది రైతుల‌కు-రైతుల‌కు మ‌ధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్ర‌మంలో జోక్యం చేసుకు న్న అప్ప‌టి ఎంపీ నందిగం.. రాజ‌ధాని రైతుల‌ను దూషించారు. ముఖ్యంగా మండ‌వ మ‌హాల‌క్ష్మి అనే మ‌హిళ‌పై బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. అప్ప‌ట్లో ఆమెను కొట్ట‌బోయిన‌ట్టు కూడా ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న‌పై మ‌హాల‌క్ష్మి 2020లోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కానీ, వైసీపీ హ‌యాంలో ఈ కేసు ముందుకు సాగ‌లేదు.

ఇటీవ‌ల మ‌రోసారి మ‌హాల‌క్ష్మి.. పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతోపాటు.. టీడీపీ మంగ‌ళ‌గిరి కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన గ్రీవెన్స్‌లోనూ ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి నారా లోకేష్ సూచ‌న‌ల మేర‌కు స‌త్తెన‌ప‌ల్లి పోలీసులు.. ఈ కేసు ఫైలు దుమ్ము దులిపారు. దీనిపై ఎఫ్ ఐఆర్ న‌మోదు చేశారు. ఈ విష‌యం తెలియ‌డంతో అరెస్టు క‌న్నాముందే.. నందిగం సురేష్ సోమ‌వారం.. కోర్టులో లొంగిపోయారు. బెయిల్ పిటిష‌న్‌పై వాద‌న‌లు ముగియ‌డంతో ఆయ‌న‌కు బెయిల్ ఇస్తూ.. న్యాయాధికారి.. ఆదేశాలు జారీ చేశారు.

This post was last modified on February 17, 2025 9:27 pm

Share

Recent Posts

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

4 hours ago

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

11 hours ago

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

12 hours ago

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

13 hours ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

18 hours ago