Political News

మ‌హిళ‌పై దాడి.. కోర్టులో లొంగిపోయిన వైసీపీ మాజీ ఎంపీ

వైసీపీ కీల‌క నాయ‌కుల‌ను కేసులు వెంటాడుతున్నాయి. ఒక కేసు నుంచి బ‌య‌ట ప‌డ్డామ‌ని అనుకుంటే… వారు చేసిన త‌ప్పు లు మ‌రిన్ని కేసుల రూపంలో నాయ‌కుల‌ను వెంటాడుతున్నాయి. ఇటీవ‌లి వ‌ర‌కు జైల్లో ఉండి.. కొన్నాళ్ల కింద‌టే బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన బాప‌ట్ల మాజీ ఎంపీ.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నందిగం సురేష్ తాజాగా మ‌రో కేసులో చిక్కుకున్నారు. ఈ నేప‌థ్యంలో తానే స్వ‌యంగా గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలోని జూనియ‌ర్ సివిల్ జ‌డ్జి ఎదుట సోమ‌వారం సాయంత్రం లొంగిపోయారు. అనంత‌రం.. ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఏం జ‌రిగింది?

వైసీపీ హ‌యాంలో రాజ‌ధాని అమ‌రావ‌తిని కాద‌ని.. మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. దీనికి వ్య‌తిరేకంగా రాజ‌ధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్య‌మించారు. వీరిలో మ‌హిళా రైతులు కూడా ఉన్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి జ‌రిగిన ఈ ఉద్య‌మం దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం రేకెత్తించింది. రాజ‌ధాని కోసం ఉద్య‌మించిన రైతులుగా వారు రికార్డు సృష్టించారు. అయితే.. ఈ స‌మ‌యంలో మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా అప్ప‌టి ఎంపీ నందిగం సురేష్ మ‌రో ఉద్య‌మానికి శ్రీకారం చుట్టారు. అమ‌రావ‌తి కంటే మూడురాజ‌ధానులే కావాలంటూ.. వారంతా ఉద్య‌మించారు.

ఈ క్ర‌మంలో అటు రాజ‌ధాని రైతుల శిబిరాల‌కు స‌మీపంలోనే మూడు రాజ‌ధానులు కావాలంటూ ఆందోళ‌న చేప‌ట్టిన వారు కూడా శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇది రైతుల‌కు-రైతుల‌కు మ‌ధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్ర‌మంలో జోక్యం చేసుకు న్న అప్ప‌టి ఎంపీ నందిగం.. రాజ‌ధాని రైతుల‌ను దూషించారు. ముఖ్యంగా మండ‌వ మ‌హాల‌క్ష్మి అనే మ‌హిళ‌పై బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. అప్ప‌ట్లో ఆమెను కొట్ట‌బోయిన‌ట్టు కూడా ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న‌పై మ‌హాల‌క్ష్మి 2020లోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కానీ, వైసీపీ హ‌యాంలో ఈ కేసు ముందుకు సాగ‌లేదు.

ఇటీవ‌ల మ‌రోసారి మ‌హాల‌క్ష్మి.. పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతోపాటు.. టీడీపీ మంగ‌ళ‌గిరి కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన గ్రీవెన్స్‌లోనూ ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి నారా లోకేష్ సూచ‌న‌ల మేర‌కు స‌త్తెన‌ప‌ల్లి పోలీసులు.. ఈ కేసు ఫైలు దుమ్ము దులిపారు. దీనిపై ఎఫ్ ఐఆర్ న‌మోదు చేశారు. ఈ విష‌యం తెలియ‌డంతో అరెస్టు క‌న్నాముందే.. నందిగం సురేష్ సోమ‌వారం.. కోర్టులో లొంగిపోయారు. బెయిల్ పిటిష‌న్‌పై వాద‌న‌లు ముగియ‌డంతో ఆయ‌న‌కు బెయిల్ ఇస్తూ.. న్యాయాధికారి.. ఆదేశాలు జారీ చేశారు.

This post was last modified on February 17, 2025 9:27 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మండలి చైర్మన్ పై అవివేశ్వాస తీర్మానం?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుతం శాస‌న మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టే అంశంపై…

2 hours ago

బీఆర్ ఎస్‌కు అవ‌కాశం ఇస్తే ఎలా?

తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియ‌ర్లు గుర్రుగా ఉన్న నేప‌థ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…

2 hours ago

కనకరాజు కాస్త త్వరగా రావొచ్చుగా

2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…

3 hours ago

శ్రీవిష్ణు అస్సలు తగ్గడం లేదు

ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…

4 hours ago

వైసీపీకి కొత్త పేరు పెట్టిన బాబు

టీడీపీ శ్రేణుల‌కు ఆ పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ప‌లు జాగ్ర‌త్త‌లు చెప్పారు. వైసీపీని గొడ్డ‌లి పార్టీగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌..…

5 hours ago

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ?

ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…

5 hours ago