Political News

మ‌హిళ‌పై దాడి.. కోర్టులో లొంగిపోయిన వైసీపీ మాజీ ఎంపీ

వైసీపీ కీల‌క నాయ‌కుల‌ను కేసులు వెంటాడుతున్నాయి. ఒక కేసు నుంచి బ‌య‌ట ప‌డ్డామ‌ని అనుకుంటే… వారు చేసిన త‌ప్పు లు మ‌రిన్ని కేసుల రూపంలో నాయ‌కుల‌ను వెంటాడుతున్నాయి. ఇటీవ‌లి వ‌ర‌కు జైల్లో ఉండి.. కొన్నాళ్ల కింద‌టే బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన బాప‌ట్ల మాజీ ఎంపీ.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నందిగం సురేష్ తాజాగా మ‌రో కేసులో చిక్కుకున్నారు. ఈ నేప‌థ్యంలో తానే స్వ‌యంగా గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలోని జూనియ‌ర్ సివిల్ జ‌డ్జి ఎదుట సోమ‌వారం సాయంత్రం లొంగిపోయారు. అనంత‌రం.. ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఏం జ‌రిగింది?

వైసీపీ హ‌యాంలో రాజ‌ధాని అమ‌రావ‌తిని కాద‌ని.. మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. దీనికి వ్య‌తిరేకంగా రాజ‌ధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్య‌మించారు. వీరిలో మ‌హిళా రైతులు కూడా ఉన్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి జ‌రిగిన ఈ ఉద్య‌మం దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం రేకెత్తించింది. రాజ‌ధాని కోసం ఉద్య‌మించిన రైతులుగా వారు రికార్డు సృష్టించారు. అయితే.. ఈ స‌మ‌యంలో మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా అప్ప‌టి ఎంపీ నందిగం సురేష్ మ‌రో ఉద్య‌మానికి శ్రీకారం చుట్టారు. అమ‌రావ‌తి కంటే మూడురాజ‌ధానులే కావాలంటూ.. వారంతా ఉద్య‌మించారు.

ఈ క్ర‌మంలో అటు రాజ‌ధాని రైతుల శిబిరాల‌కు స‌మీపంలోనే మూడు రాజ‌ధానులు కావాలంటూ ఆందోళ‌న చేప‌ట్టిన వారు కూడా శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇది రైతుల‌కు-రైతుల‌కు మ‌ధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్ర‌మంలో జోక్యం చేసుకు న్న అప్ప‌టి ఎంపీ నందిగం.. రాజ‌ధాని రైతుల‌ను దూషించారు. ముఖ్యంగా మండ‌వ మ‌హాల‌క్ష్మి అనే మ‌హిళ‌పై బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. అప్ప‌ట్లో ఆమెను కొట్ట‌బోయిన‌ట్టు కూడా ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న‌పై మ‌హాల‌క్ష్మి 2020లోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కానీ, వైసీపీ హ‌యాంలో ఈ కేసు ముందుకు సాగ‌లేదు.

ఇటీవ‌ల మ‌రోసారి మ‌హాల‌క్ష్మి.. పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతోపాటు.. టీడీపీ మంగ‌ళ‌గిరి కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన గ్రీవెన్స్‌లోనూ ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి నారా లోకేష్ సూచ‌న‌ల మేర‌కు స‌త్తెన‌ప‌ల్లి పోలీసులు.. ఈ కేసు ఫైలు దుమ్ము దులిపారు. దీనిపై ఎఫ్ ఐఆర్ న‌మోదు చేశారు. ఈ విష‌యం తెలియ‌డంతో అరెస్టు క‌న్నాముందే.. నందిగం సురేష్ సోమ‌వారం.. కోర్టులో లొంగిపోయారు. బెయిల్ పిటిష‌న్‌పై వాద‌న‌లు ముగియ‌డంతో ఆయ‌న‌కు బెయిల్ ఇస్తూ.. న్యాయాధికారి.. ఆదేశాలు జారీ చేశారు.

This post was last modified on February 17, 2025 9:27 pm

Share

Recent Posts

చెన్నై లవ్ స్టోరీ… ‘సమ్’తృప్తేనా?

డివైడ్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమాలు థియేటర్లలో బలంగా నిలబడ్డం అంటే చిన్న విషయం కాదు. చెన్నై లవ్ స్టోరీ…

2 hours ago

భయపెడుతున్న అమెరికా బాక్సాఫీస్

ఒకప్పుడు యుఎస్‌లో తెలుగు సినిమాలు విడుదల కావడాన్నే గొప్పగా భావించేవాళ్లం. అలాంటిది అది తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్‌గా తయారైంది. మన…

3 hours ago

క్రైమ్ సినిమాలు ఇంకెన్ని తీస్తారయ్యా

మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…

5 hours ago

పీవీఆర్‌లో 175 రూపాయల సినిమా

టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…

5 hours ago

పోలీసు దెబ్బ: వైసీపీలో `ర‌ప్పా-ర‌ప్పా` పోయిందే

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా ఇటీవల కాలంలో `ర‌ప్పా-ర‌ప్పా` డైలాగులు త‌ర‌చుగా వినిపించేవి. రప్పా-ర‌ప్పా అని రాసున్న బ్యాన‌ర్లు,…

5 hours ago

కనకరాజు కొట్టులో బోణీ బాగుంది

వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…

5 hours ago