ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి.. 8 నెలలు పూర్తయింది. వాస్తవానికి ఎనిమిది నెలలు పెద్ద ఎక్కువ కాలం కాకపోయినా.. సీనియర్ సీఎం, 14 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు కావడంతో సహజంగానే చంద్రబాబుపై ఆసక్తి ఉంటుంది. అదే ప్రజల్లోనూ నెలకొంది. అభివృద్ది బాటలో నడిపించాలని ఏపీని తిరిగి గాడిలో పెట్టాలని భావించిన ప్రజలు.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన టెలీకాన్ఫరెన్స్లో ఆయా విషయాలను చంద్రబాబు ప్రస్తావించారు.
ప్రజలకు కూటమి సర్కారుపై ఎనలేని విశ్వాసం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అనేక రూపాల్లో ప్రజలు ప్రభుత్వం నుంచి కూడా ఆశిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఈ ఎనిమిది నెలల కాలంలో కూటమి పరంగా సాధించిన విజయాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లి వివరించాలని చంద్రబాబు సూచించారు. ఒకవైపు ఆర్థిక భారం ఉన్నప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సర్కారు కట్టుబడి ఉందన్న సంకేతాలను ప్రజలకు వివరించాలన్నారు.
ప్రధానంగా చంద్రబాబు చెప్పిన ఎనిమిది విజయాల్లో.. పింఛన్ల పెంపు, ప్రతి లబ్ధిదారుడికి వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అన్నా క్యాంటీన్లు, రహదారుల నిర్మాణం, అమరావతిని పుంజుకునేలా చేయడం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాల కల్పనకు పెద్ద పీట వేయడం వంటివి ఉన్నాయి. ఆయా కార్యక్రమాలను సక్సెస్ చేయడం ద్వారా.. ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు.
This post was last modified on February 17, 2025 8:36 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…