ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రపంచ దేశాల్లో భారీ ఎత్తున ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. ఆయనను అనేక దేశాలు మెచ్చుకోవడం.. అనేక దేశాలు ఫాలో అవడం కూడా ఇటీవల కాలంలో తెరమీదికి వస్తున్నాయి. అలాంటి మోడీకి ఇప్పుడు పరువు ప్రశ్నగా మారింది. ప్రపంచ దేశాల నుంచే ఈ సెగ ఉత్ప న్నం కావడం గమనార్హం. రెండు కీలక విషయాల్లో ప్రధాని ప్రధానంగా ఇబ్బందుల పాలవుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మిత్రుడేనని మోడీ చెబుతారు.
ఇటీవల అమెరికాలోనూ పర్యటించి వచ్చారు. ట్రంప్ ఇచ్చిన విందును కూడా తీసుకున్నారు. కానుకలూ అందుకున్నారు. అయితే.. ఇదేసమయంలో భారత అక్రమ వలసదారుల విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం మారలేదు. తాజాగా పంపించిన రెండు, మూడో విమానాల్లోనూ భారతీయులకు సంకెళ్లు వేసే పంపించారు. ఈ పరిణామాలు.. రాజకీయంగా ఇంటా బయటా కూడా.. మోడీ కి సెగపెడుతు న్నాయి. చిన్న చిన్న దేశాలే.. తమ పౌరులను అవమానిస్తుంటే.. చూస్తూ ఊరుకోలేక పోతున్నాయి.
ఇటీవల కెన్యా దేశం.. తమ పౌరులను(వీరు కూడా అక్రమ వలసదారులే) అమెరికా యుద్ధ విమానంలో పంపడాన్ని తిరస్కరించింది. అంతేకాదు.. తమ గగనతలంలో అమెరికా విమానాలు ప్రయాణించేందుకు అనుమతి కూడా నిరాకరించింది. కెన్యాపౌరులు దొంగలు కారని స్పష్టం చేసిన ఆ దేశం.. గౌరవంగానే పంపించాలని ట్రంక్కు తేల్చి చెప్పింది. ఇదిలావుంటే.. తాజాగా తమపై సుంకాలు విధించడాన్ని తప్పు బడుతూ.. దక్షిణాఫ్రికా ఏకంగా అమెరికాతో వాణిజ్య సంబంధాన్ని కట్ చేసుకుంది.
This post was last modified on February 17, 2025 6:05 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…