ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రపంచ దేశాల్లో భారీ ఎత్తున ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. ఆయనను అనేక దేశాలు మెచ్చుకోవడం.. అనేక దేశాలు ఫాలో అవడం కూడా ఇటీవల కాలంలో తెరమీదికి వస్తున్నాయి. అలాంటి మోడీకి ఇప్పుడు పరువు ప్రశ్నగా మారింది. ప్రపంచ దేశాల నుంచే ఈ సెగ ఉత్ప న్నం కావడం గమనార్హం. రెండు కీలక విషయాల్లో ప్రధాని ప్రధానంగా ఇబ్బందుల పాలవుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మిత్రుడేనని మోడీ చెబుతారు.
ఇటీవల అమెరికాలోనూ పర్యటించి వచ్చారు. ట్రంప్ ఇచ్చిన విందును కూడా తీసుకున్నారు. కానుకలూ అందుకున్నారు. అయితే.. ఇదేసమయంలో భారత అక్రమ వలసదారుల విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం మారలేదు. తాజాగా పంపించిన రెండు, మూడో విమానాల్లోనూ భారతీయులకు సంకెళ్లు వేసే పంపించారు. ఈ పరిణామాలు.. రాజకీయంగా ఇంటా బయటా కూడా.. మోడీ కి సెగపెడుతు న్నాయి. చిన్న చిన్న దేశాలే.. తమ పౌరులను అవమానిస్తుంటే.. చూస్తూ ఊరుకోలేక పోతున్నాయి.
ఇటీవల కెన్యా దేశం.. తమ పౌరులను(వీరు కూడా అక్రమ వలసదారులే) అమెరికా యుద్ధ విమానంలో పంపడాన్ని తిరస్కరించింది. అంతేకాదు.. తమ గగనతలంలో అమెరికా విమానాలు ప్రయాణించేందుకు అనుమతి కూడా నిరాకరించింది. కెన్యాపౌరులు దొంగలు కారని స్పష్టం చేసిన ఆ దేశం.. గౌరవంగానే పంపించాలని ట్రంక్కు తేల్చి చెప్పింది. ఇదిలావుంటే.. తాజాగా తమపై సుంకాలు విధించడాన్ని తప్పు బడుతూ.. దక్షిణాఫ్రికా ఏకంగా అమెరికాతో వాణిజ్య సంబంధాన్ని కట్ చేసుకుంది.
This post was last modified on February 17, 2025 6:05 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే మూడు తరాల హీరోలు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…