“గన్నవరం నియోజకవర్గం నన్ను కాదనే వారు ఉన్నారా? నా పేరు చెబితే.. గ్రామాలకు గ్రామాలే తరలి వస్తాయి. ఏమనుకుంటున్నాడు వాడు(ప్రత్యర్థి నేత). ఒక్కసారి గన్నవరం గ్రౌండ్లోకి దిగితే.. తెలుస్తుంది. నోటికి వచ్చింది మాట్లాడడం కాదు. గన్నవరంలో ఏ పిల్లినడిడినా.. ఏ పిట్టనడిగినా.. వంశీ గురించి చెబుతారు. నాకు ఏమైనా జరిగితే.. గన్నవరం గన్నవరం మొత్తం నిలబడుతుంది“- ఖచ్చితంగా రెండేళ్ల కిందట అప్పటిఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఇవి.
ప్రత్యర్థి పార్టీలోకి చేరిన.. అప్పటి వైసీపీ నేత, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును ఉద్దేశించి వంశీ చేసుకున్న నోరు అది!! కట్ చేస్తే.. ఆయన గత ఎన్నికల్లో ఇదేగన్నవరం ప్రజల చేతిలో ఓడిపోయారు. ఏదో కాకతాళీయంగా ఈ ఓటమి చేరువైందని అనుకునేందుకు అవకాశం లేదు. ఎందుకంటే.. ఓడిన తర్వాత.. వంశీని పట్టించుకున్న వారు కరువయ్యారు. సో.. వంశీ ప్రగల్భం కేవలం మాటలేనని తేలిపో యింది. పోనీ.. ఇప్పుడు టీడీపీ నాయకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టు అయిన తర్వాతైనా వంశీ కి సానుభూతి వచ్చిందా? అనేది ప్రశ్న.
ఏ కోణంలో చూసుకున్నా.. వంశీకి సానుభూతి కరువైంది. ఆయన అరెస్టు.. 14 రోజుల రిమాండ్పై గన్నవరంలో ఒక్కరంటే ఒక్కరు కూడా “అయ్యో“ అన్న వారే లేకుండా పోయారు. మరీ ముఖ్యంగా తన అనుకున్న వైసీపీ నాయకులు కూడా ఎవరూ స్పందించలేదు. దీంతో నేరుగా జగనే స్పందించాల్సి వచ్చింది. వాస్తవానికి.. గతంలో వైసీపీ నాయకులు కొందరు అరెస్టయినప్పుడు.. చాలా మంది వారి వారి నియోజకవ ర్గాల్లో స్పందించారు. ప్రజల నుంచి కూడా అంతో ఇంతో సానుభూతి వ్యక్తమైంది.
కానీ, వంశీ విషయంలో ఎక్కడా ఎవరూ స్పందించలేదు. వంశీ అరెస్టుకు నిరసనగా ఎక్కడ ధర్నాకు పిలుపునివ్వలేదు. బంద్ కూడా పాటించలేదు. కనీసం మీడియా ముందుకు కూడా రాలేదు. ఇక, ఆయన సతీమణి పంకజ శ్రీ బయటకు వచ్చి.. మీడియ ముందు ఆవేదన వ్యక్తం చేసినా.. ఆమె పట్ల సానుభూతి ఉన్నప్పటికీ.. వంశీ విషయంలో ఎవరూ సానుభూతి కురిపించలేకపోయారు.
సో.. అధికారంలో ఉన్నప్పుడు.. ఏదో అనుకోవడం, నాఅంత వాడు లేడనిచెప్పడం కామనే. కానీ, ఇలాంటి సమయంలో అసలు ప్రజలనాడి తెలుస్తుంది. కాబట్టి.. వంశీ బలం .. అంతా టీడీపీదేనని.. ఆ పార్టీ అండతోనే ఆయన ఇన్నిసార్లుగా గెలిచారని ఆ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.
This post was last modified on February 17, 2025 5:37 pm
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…