“గన్నవరం నియోజకవర్గం నన్ను కాదనే వారు ఉన్నారా? నా పేరు చెబితే.. గ్రామాలకు గ్రామాలే తరలి వస్తాయి. ఏమనుకుంటున్నాడు వాడు(ప్రత్యర్థి నేత). ఒక్కసారి గన్నవరం గ్రౌండ్లోకి దిగితే.. తెలుస్తుంది. నోటికి వచ్చింది మాట్లాడడం కాదు. గన్నవరంలో ఏ పిల్లినడిడినా.. ఏ పిట్టనడిగినా.. వంశీ గురించి చెబుతారు. నాకు ఏమైనా జరిగితే.. గన్నవరం గన్నవరం మొత్తం నిలబడుతుంది“- ఖచ్చితంగా రెండేళ్ల కిందట అప్పటిఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఇవి.
ప్రత్యర్థి పార్టీలోకి చేరిన.. అప్పటి వైసీపీ నేత, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును ఉద్దేశించి వంశీ చేసుకున్న నోరు అది!! కట్ చేస్తే.. ఆయన గత ఎన్నికల్లో ఇదేగన్నవరం ప్రజల చేతిలో ఓడిపోయారు. ఏదో కాకతాళీయంగా ఈ ఓటమి చేరువైందని అనుకునేందుకు అవకాశం లేదు. ఎందుకంటే.. ఓడిన తర్వాత.. వంశీని పట్టించుకున్న వారు కరువయ్యారు. సో.. వంశీ ప్రగల్భం కేవలం మాటలేనని తేలిపో యింది. పోనీ.. ఇప్పుడు టీడీపీ నాయకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టు అయిన తర్వాతైనా వంశీ కి సానుభూతి వచ్చిందా? అనేది ప్రశ్న.
ఏ కోణంలో చూసుకున్నా.. వంశీకి సానుభూతి కరువైంది. ఆయన అరెస్టు.. 14 రోజుల రిమాండ్పై గన్నవరంలో ఒక్కరంటే ఒక్కరు కూడా “అయ్యో“ అన్న వారే లేకుండా పోయారు. మరీ ముఖ్యంగా తన అనుకున్న వైసీపీ నాయకులు కూడా ఎవరూ స్పందించలేదు. దీంతో నేరుగా జగనే స్పందించాల్సి వచ్చింది. వాస్తవానికి.. గతంలో వైసీపీ నాయకులు కొందరు అరెస్టయినప్పుడు.. చాలా మంది వారి వారి నియోజకవ ర్గాల్లో స్పందించారు. ప్రజల నుంచి కూడా అంతో ఇంతో సానుభూతి వ్యక్తమైంది.
కానీ, వంశీ విషయంలో ఎక్కడా ఎవరూ స్పందించలేదు. వంశీ అరెస్టుకు నిరసనగా ఎక్కడ ధర్నాకు పిలుపునివ్వలేదు. బంద్ కూడా పాటించలేదు. కనీసం మీడియా ముందుకు కూడా రాలేదు. ఇక, ఆయన సతీమణి పంకజ శ్రీ బయటకు వచ్చి.. మీడియ ముందు ఆవేదన వ్యక్తం చేసినా.. ఆమె పట్ల సానుభూతి ఉన్నప్పటికీ.. వంశీ విషయంలో ఎవరూ సానుభూతి కురిపించలేకపోయారు.
సో.. అధికారంలో ఉన్నప్పుడు.. ఏదో అనుకోవడం, నాఅంత వాడు లేడనిచెప్పడం కామనే. కానీ, ఇలాంటి సమయంలో అసలు ప్రజలనాడి తెలుస్తుంది. కాబట్టి.. వంశీ బలం .. అంతా టీడీపీదేనని.. ఆ పార్టీ అండతోనే ఆయన ఇన్నిసార్లుగా గెలిచారని ఆ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.
This post was last modified on February 17, 2025 5:37 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…