టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో రాటుదేలి పోతున్నారు. ఇటు రాజకీయాల్లోనే కాకుండా అటు ప్రజా పాలనలోనూ లోకేశ్ దూసుకుపోతున్నారు. 23 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లకు పరిమితమైపోయిన టీడీపీ యువగళం పేరిట చేపట్టిన తన పాదయాత్రతో ఏకంగా 135 ఎమ్మెల్యే, 18 ఎంపీ సీట్లు కలిగిన పార్టీగా లోకేశ్ మార్చడంలో సఫలీకృతం అయ్యారు.
లోకేశ్ లో కనిపించిన ఈ ట్రాన్స్ ఫార్మేషన్ ను చూసిన వారు ఎవరైనా ఆయనను మెచ్చుకోకుండా ఉండలేరు. దగ్గరగా కనిపిస్తే లోకేశ్ భుజం తట్టకుండా ఉండలేరు. రాజకీయాల్లో తలపండిన వారైతే శభాష్ లోకేశ్ అని ప్రశంసించకుండా కూడా ఉండలేరు. ఆ తలపండిన నేతలు వైరి వర్గాలకు చెందిన వారైనా కూడా లోకేశ ను కీర్తించకుండా ఉండలేరు.
ఈ మాట నిజమేనన్నట్లుగా ఆదివారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైసీపీకి చెందిన సీనియర్ మోస్ట్ నేత, నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి… లోకేశ్ కనిపించినంతనే లేచి నిలబడి మరీ… లోకేశ్ భుజం తడుతూ.. శభాష్ లోకేశ్ అంటూ ప్రశంసించారు. అది కూడా అందరూ చూస్తుండగానే.. లోకేశ్ ను మేకపాటి మెచ్చుకున్నారు.
ఈ ఘటన ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలోని స్వర్ణభారతి ట్రస్టు ఆవరణలో చోటు చేసుకుంది. ట్రస్ట్ ఆవరణలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మనవడి వివాహ రిసెప్షన్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి లోకేశ్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా తనకు ఎధురేగి స్వాగతం పలికిన దాదాపుగా అన్ని పార్టీల నేతలను పలకరిస్తూ లోకేశ్ సాగారు.
ఈ క్రమంలో మేకపాటి కనిపించగానే… ఆయనకు లోకేశ్ నమస్కరించారు. లోకేశ్ ను చూసినంతనే తాను కూర్చున్న సోఫాలో నుంచి లేచి నిలబడ్డ మేకపాటి… లోకేశ్ భుజాన్ని తట్టి… శబాష్ లోకేశ్ అంటూ ప్రశంసించారు. అటు పార్టీ వ్యవహారాల్లోనే కాకుండా ఇటు పాలనలోనూ సత్తా చాటుతున్నారంటూ ఆయన లోకేశ్ ను ఆకాశానికెత్తేశారు. ఈ వీడియో కాస్తంత ఆలస్యంగా సోమవారం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి వైరల్ గా మారింది.
This post was last modified on February 17, 2025 4:04 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…