టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినంతనే… వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తొలగిస్తారంటూ ప్రచారం సాగింది. సచివాలయాలకు అనుబంధంగా పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థను తొలగించినట్లుగానే సచివాలయ ఉద్యోగులను కూడా ఇంటికి పంపుతారంటూ జోరుగా ప్రచారం సాగింది.
ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. వాలంటీర్ల మాదిరిగా తామేమీ వైసీపీ నేతలు ఎంపిక చేసిన వారం కాదని, ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్షల్లో అర్హత సాధించి మరీ కొలువుల్లో చేరామని వారు వాదిస్తున్నారు.
ఈ విషయాలపై కూటమి సర్కారు కూలంకషంగానే పరిశీలన చేసింది. వాలంటీర్ వ్యవస్థను వైసీపీ తనకు అనుకూలంగా ఏర్పాటు చేసుకుందని తీర్మానించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… ఆ వ్యవస్థ ఏర్పాటు కూడా ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు జరగలేదని భావించారు.
ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే… వైసీపీ చేసిన తప్పులను కొనసాగించినట్టు అవుతుందని కూడా ఆయన గ్రహించారు. ఈ కారణంగానే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే అంశాన్ని చంద్రబాబు పక్కనపెట్టేశారు. ఇక సచివాలయ వ్యవస్థపై దృష్టి సారించిన చంద్రబాబు.. దాని కొనసాగింపునకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.
చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి… దఫదఫాలుగా అధికార యంత్రాంగంతో చర్చించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తేనే మంచిదని ఆయన ఇటీవలే చంద్రబాబుకు ఓ నివేదిక సమర్పించారు. ఈ నివేదికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సోమవారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు చెందిన సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని ఆయన సంచలన ప్రకటన చేశారు. అయితే ఉద్యోగుల విద్యార్హత, సీనియారిటీ ఆధారంగా రేషనలైజేషన్ చేస్తామని వెల్లడించారు. ఇందుకు ఉద్యోగుల సంఘాలు కూడా సమ్మతమేనని ప్రకటించి.. తమ ఉద్యోగాలపై గుడ్ న్యూస్ చెెప్పిన చంద్రబాబు సర్కారుకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.
This post was last modified on February 17, 2025 3:24 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…