Political News

ఏపీలో తొలి ‘గులియన్’ డెత్… వర్రీ అక్కర్లేదన్న వైద్యులు

ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) పేరిట ఓ కొత్త వ్యాధి అంతకంతకూ ప్రబలుతోంది. ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండగా… వారంతా గుంటూరులోని జీజీహెచ్ కు వస్తున్నారు. ఈ వ్యాధికి చికిత్స రాష్ట్రంలోని ఒక్క గుంటూరు జీజీహెచ్ లోనే అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈ వ్యాధిగ్రస్తుంతా గుంటూరుకే తరలివస్తున్నారు.

ఈ క్రమంలో ఈ నెల ఈ వ్యాధి బారిన పడిన ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం అలసందపల్లికి చెందిన కమలమ్మ గుంటూరు జిజీహెచ్ లో చేరారు. చికిత్స పొందుతూనే ఆమె ఆదివారం సాయంత్రం మరణించారు.

తీవ్రమైన జ్వరం, కాళ్లు చచ్చుబడిపోయినట్లుగా అనిపించడమే ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. ఈ నెల 3న జ్వరంతో పాటు కాళ్లు చచ్చుబడిపోయిన కమలమ్మను ఆమె కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.

ఆమెను అడ్మిట్ చేసుకున్న వైద్యులు పరీక్షలు చేసి… కమలమ్మ జీబీఎస్ వ్యాదితో బాధపడుతున్నట్లుగా తేల్చారు. అందుకనుగుణంగా చికిత్స మొదలుపెట్టారు. మొన్నటిదాకా ఆమె కోలుకున్నట్లుగానే కనిపించినా… గడచిన రెండు రోజులుగా ఆమె పరిస్థితి ఉన్నట్టుండి క్షీణించింది.

ఈ క్రమంలో కమలమ్మను వెంటిలేటర్ పై ఉంచిన వైద్యులు… ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆమె కోలుకోలేక ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఇదిలా ఉంటే… ఈ వ్యాది కొత్తదే అయినప్పటికీ… అంతగా భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇదేమీ అంటు వ్యాధి కూడా కాదని వారు చెబుతున్నారు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఈ వ్యాధి వల్ల మరణాలు సంభవిస్తాయని చెబుతున్నారు.

This post was last modified on February 16, 2025 9:43 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

28 minutes ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

2 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

6 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

7 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

7 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

7 hours ago