ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) పేరిట ఓ కొత్త వ్యాధి అంతకంతకూ ప్రబలుతోంది. ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండగా… వారంతా గుంటూరులోని జీజీహెచ్ కు వస్తున్నారు. ఈ వ్యాధికి చికిత్స రాష్ట్రంలోని ఒక్క గుంటూరు జీజీహెచ్ లోనే అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈ వ్యాధిగ్రస్తుంతా గుంటూరుకే తరలివస్తున్నారు.
ఈ క్రమంలో ఈ నెల ఈ వ్యాధి బారిన పడిన ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం అలసందపల్లికి చెందిన కమలమ్మ గుంటూరు జిజీహెచ్ లో చేరారు. చికిత్స పొందుతూనే ఆమె ఆదివారం సాయంత్రం మరణించారు.
తీవ్రమైన జ్వరం, కాళ్లు చచ్చుబడిపోయినట్లుగా అనిపించడమే ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. ఈ నెల 3న జ్వరంతో పాటు కాళ్లు చచ్చుబడిపోయిన కమలమ్మను ఆమె కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.
ఆమెను అడ్మిట్ చేసుకున్న వైద్యులు పరీక్షలు చేసి… కమలమ్మ జీబీఎస్ వ్యాదితో బాధపడుతున్నట్లుగా తేల్చారు. అందుకనుగుణంగా చికిత్స మొదలుపెట్టారు. మొన్నటిదాకా ఆమె కోలుకున్నట్లుగానే కనిపించినా… గడచిన రెండు రోజులుగా ఆమె పరిస్థితి ఉన్నట్టుండి క్షీణించింది.
ఈ క్రమంలో కమలమ్మను వెంటిలేటర్ పై ఉంచిన వైద్యులు… ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆమె కోలుకోలేక ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఇదిలా ఉంటే… ఈ వ్యాది కొత్తదే అయినప్పటికీ… అంతగా భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.
ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇదేమీ అంటు వ్యాధి కూడా కాదని వారు చెబుతున్నారు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఈ వ్యాధి వల్ల మరణాలు సంభవిస్తాయని చెబుతున్నారు.
This post was last modified on February 16, 2025 9:43 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…