Political News

ఏపీలో తొలి ‘గులియన్’ డెత్… వర్రీ అక్కర్లేదన్న వైద్యులు

ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) పేరిట ఓ కొత్త వ్యాధి అంతకంతకూ ప్రబలుతోంది. ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండగా… వారంతా గుంటూరులోని జీజీహెచ్ కు వస్తున్నారు. ఈ వ్యాధికి చికిత్స రాష్ట్రంలోని ఒక్క గుంటూరు జీజీహెచ్ లోనే అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈ వ్యాధిగ్రస్తుంతా గుంటూరుకే తరలివస్తున్నారు.

ఈ క్రమంలో ఈ నెల ఈ వ్యాధి బారిన పడిన ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం అలసందపల్లికి చెందిన కమలమ్మ గుంటూరు జిజీహెచ్ లో చేరారు. చికిత్స పొందుతూనే ఆమె ఆదివారం సాయంత్రం మరణించారు.

తీవ్రమైన జ్వరం, కాళ్లు చచ్చుబడిపోయినట్లుగా అనిపించడమే ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. ఈ నెల 3న జ్వరంతో పాటు కాళ్లు చచ్చుబడిపోయిన కమలమ్మను ఆమె కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.

ఆమెను అడ్మిట్ చేసుకున్న వైద్యులు పరీక్షలు చేసి… కమలమ్మ జీబీఎస్ వ్యాదితో బాధపడుతున్నట్లుగా తేల్చారు. అందుకనుగుణంగా చికిత్స మొదలుపెట్టారు. మొన్నటిదాకా ఆమె కోలుకున్నట్లుగానే కనిపించినా… గడచిన రెండు రోజులుగా ఆమె పరిస్థితి ఉన్నట్టుండి క్షీణించింది.

ఈ క్రమంలో కమలమ్మను వెంటిలేటర్ పై ఉంచిన వైద్యులు… ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆమె కోలుకోలేక ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఇదిలా ఉంటే… ఈ వ్యాది కొత్తదే అయినప్పటికీ… అంతగా భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇదేమీ అంటు వ్యాధి కూడా కాదని వారు చెబుతున్నారు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఈ వ్యాధి వల్ల మరణాలు సంభవిస్తాయని చెబుతున్నారు.

Kumar

Recent Posts

‘అప్పుడు కేజీఎఫ్‌… ఇప్పుడు జొన్న‌గిరి’

ఒక‌ప్పుడు బంగారం నిల్వ‌ల విష‌యంలో కేజీఎఫ్ గురించి చ‌ర్చ జ‌రిగేద‌ని.. కానీ, ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలోని జొన్న‌గిరి గురించి దేశ‌వ్యాప్తంగా…

43 minutes ago

రోజా అరెస్టు త‌ప్ప‌దా? ఏపీలో హాట్ టాపిక్‌!

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు త‌ప్ప‌దా? ఆమెపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…

2 hours ago

డైరెక్టర్ల మార్పుపై ఓపెన్ అయిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…

3 hours ago

సాయికృష్ణది లాకప్ డెత్… తేల్చిన సిట్

విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…

4 hours ago

అనంత శ్రీరామ్… ఇదేం లాజిక్?

ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…

5 hours ago

‘దారులున్నాయి’ మాటలో అంత అర్థముందా

పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…

6 hours ago