Political News

ఏపీలో తొలి ‘గులియన్’ డెత్… వర్రీ అక్కర్లేదన్న వైద్యులు

ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) పేరిట ఓ కొత్త వ్యాధి అంతకంతకూ ప్రబలుతోంది. ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండగా… వారంతా గుంటూరులోని జీజీహెచ్ కు వస్తున్నారు. ఈ వ్యాధికి చికిత్స రాష్ట్రంలోని ఒక్క గుంటూరు జీజీహెచ్ లోనే అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈ వ్యాధిగ్రస్తుంతా గుంటూరుకే తరలివస్తున్నారు.

ఈ క్రమంలో ఈ నెల ఈ వ్యాధి బారిన పడిన ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం అలసందపల్లికి చెందిన కమలమ్మ గుంటూరు జిజీహెచ్ లో చేరారు. చికిత్స పొందుతూనే ఆమె ఆదివారం సాయంత్రం మరణించారు.

తీవ్రమైన జ్వరం, కాళ్లు చచ్చుబడిపోయినట్లుగా అనిపించడమే ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. ఈ నెల 3న జ్వరంతో పాటు కాళ్లు చచ్చుబడిపోయిన కమలమ్మను ఆమె కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.

ఆమెను అడ్మిట్ చేసుకున్న వైద్యులు పరీక్షలు చేసి… కమలమ్మ జీబీఎస్ వ్యాదితో బాధపడుతున్నట్లుగా తేల్చారు. అందుకనుగుణంగా చికిత్స మొదలుపెట్టారు. మొన్నటిదాకా ఆమె కోలుకున్నట్లుగానే కనిపించినా… గడచిన రెండు రోజులుగా ఆమె పరిస్థితి ఉన్నట్టుండి క్షీణించింది.

ఈ క్రమంలో కమలమ్మను వెంటిలేటర్ పై ఉంచిన వైద్యులు… ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆమె కోలుకోలేక ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఇదిలా ఉంటే… ఈ వ్యాది కొత్తదే అయినప్పటికీ… అంతగా భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇదేమీ అంటు వ్యాధి కూడా కాదని వారు చెబుతున్నారు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఈ వ్యాధి వల్ల మరణాలు సంభవిస్తాయని చెబుతున్నారు.

This post was last modified on February 16, 2025 9:43 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

26 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago