ప్రమెుఖ సినీ గాయని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేస్తూ శనివారం ఓ బహిరంగ ప్రకటనను విడుదల చేసింది. తన పాటకు రాజకీయ ముద్ర ఆపాదిప్తున్నారని ఆరోపించిన మంగ్లీ… ఆ కారణంగా తనకు అవకాశాలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
అయినా తాను రాజకీయంగా ఏ ఒక్క పార్టీకో అనుకూలంగా, మరో పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తానని కూడా ఆమె వాపోయింది. తన వృత్తి పాటలు పాడటమే గానీ… రాజకీయాలు చేయడం కాదని, రాజకీయాలతో తనకు సంబంధమే లేదని ఆమె గుర్తు చేసింది.
ఇటీవల శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి ఆలయ రథ సప్తమి వేడుకల్లో మంగ్లీ పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ యువ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆహ్వానంతో ఈ వేడకలకు తాను హాజరయ్యానని మంగ్లీ తెలిపింది.
ఈ వేడుకల్లో మంగ్లీ పాల్గొనడం, ఆమెను మంత్రి వెంటబెట్టుకుని వెళ్లిన తీరుపై టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. టీడీపీకి పాటలు పాడనంటూ వ్యాఖ్యలు చేసిన మంగ్లీకి… పార్టీకి చెందిన కీలక నేతగా అంత ప్రాధాన్యం ఇవ్వడం అవసరమా? అంటూ పార్టీ శ్రేణులు మంత్రిని ప్రశ్నించాయి.
అసరవిల్లి రథ సప్తమి వేడుకలు ముగిసిన తర్వాత అటు కేంద్ర మంత్రి, ఇటు పార్టీ శ్రేణులు అందరూ ఈ విషయాన్ని మరిచిపోయారు. మంగ్లీ కూడా ఈ విషయం గురించి పెద్దగా ప్రస్తావించలేదు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు తన పాటకు రాజకీయ ముద్ర ఆపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
తన పాటకు రాజకీయ ముద్రతో తాను చాలా అవకాశాలను కోల్పోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను కేవలం వైసీపీకి మాత్రమే పాటలు పాడలేదని…బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కూడా పాటలు పాడానని తెలిపింది. ఇప్పటికనా తన జీవనోపాధిని దెబ్బ తీసేలా… తన పాటకు రాజకీయ రంగు పులమొద్దని ఆమె వేడుకుంది.
This post was last modified on February 15, 2025 7:55 pm
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…