Political News

మంత్రి చెప్పినా విన‌లేదు.. వైసీపీ ప్రో క్రాంట్రాక్ట‌ర్‌కు కోట్లు ఇచ్చేశారు!

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో ఏం జ‌రుగుతోంది? అధికారులు.. మంత్రుల మాట విన‌డం లేద‌ని, వారికి న‌చ్చిన‌ట్టు చేస్తున్నార‌ని.. కొన్ని రోజులుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు కూడా ఒక‌టికి రెండు సార్లు అధికారుల‌ను హెచ్చ‌రించారు. మంత్రుల మాట విన‌క‌పోతే ఎలా? అని కూడా నిల‌దీశారు. ఇక నుంచి ఎలాంటి ఫిర్యాదులు వ‌చ్చినా సీరియ‌స్‌గా ఉంటుంద‌ని చెప్పారు.

కానీ, ఎందుకో.. అధికారులు మాత్రం మంత్రులు చెప్పిన మాట‌ను పూచిక పుల్ల మాదిరిగా తీసేస్తున్నారు. ఏదో చిన్నా చిత‌క శాఖ‌లో ఉన్న‌తాధికారులు మంత్రి చెప్పింది విన‌లేదంటే అర్ధం చేసుకోవ‌చ్చు. స‌రేన‌ని స‌రిపెట్టుకోవ‌చ్చు. కానీ, ముఖ్య‌మంత్రి త‌ర్వాత‌.. అంత‌టి స్థాయి, ప్రొటోకాల్ ఉన్న ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ చెపిన మాట‌ను కూడా అధికారులు విన‌లేదంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది! ఔనా? అని కూడా అనిపిస్తుంది.. కానీ.. ప‌క్కా నిజం! ఈవిష‌యాన్ని మంత్రి తాజాగా బ‌య‌ట పెట్టారు.

శ‌నివారం ఉద‌యం స‌చివాల‌యానికి వ‌చ్చిన మంత్రి ప‌య్యావుల‌.. త‌న శాఖ‌లో పెండింగులో ఉన్న బిల్లు ల‌పై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో గ‌తంలో త‌న దృష్టికి వ‌చ్చిన విశాఖ‌లోని రుషి కొండ భ‌వ‌నాల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ ఫైలు క‌నిపించ‌లేదు. అప్ప‌ట్లో జ‌గ‌న్‌.. రూ.500 కోట్ల ఖ‌ర్చుతో ఈ ఇంద్ర భ‌వ‌నాన్ని నిర్మించ‌డం.. త‌ర్వాత వివాదం కావ‌డం తెలిసిందే. అయితే.. స‌ర్కారు మార‌డంతో దీనికి సంబంధించిన బ‌కాయిలను ఇప్ప‌ట్లో చెల్లించ‌కూడద‌ని నిర్న‌యం తీసుకున్నారు.

ఇదే విష‌యాన్ని ప‌య్యావుల కూడా త‌న శాఖ అధికారుల‌ను ఆదేశించారు. కానీ, తాజాగా స‌ద‌రు పెండింగు ఫైలు ఆయ‌న‌కు క‌నిపించ‌లేదు. ఇదే విష‌యాన్ని ఆయ‌న ఉన్న‌తాధికారుల‌ను ప్ర‌శ్నించారు. అయితే.. వారు బిల్లులు క్లియ‌ర్ అయిపోయాన‌ని.. మెల్ల‌గా చెప్పారు. దీంతో అగ్గిమీద గుగ్గిలం అయిన‌.. ప‌య్యావుల‌.. “నేను వ‌ద్ద‌ని చెప్పిన త‌ర్వాత కూడా.. బిల్లులు ఎలా చెల్లిస్తారు? వైపీపీ అనుకూల కాంట్రాక్ట‌ర్ల బిల్లులు ఆపాల‌ని చెప్పాను క‌దా?“ అని నిప్పులు చెరిగారు. కానీ, అధికారులు మౌనం పాటించారు.

దీనిపై సీఎంచంద్ర‌బాబుకు ఫిర్యాదు చేయాల‌ని ప‌య్యావుల నిర్ణ‌యించుకున్నట్టు ఆర్థిక శాఖ వ‌ర్గాలు తెలిపాయి. అయితే.. ఇక్క‌డే మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. రుషి కొండ భ‌వ‌నాన్నినిర్మించిన కాంట్రాక్టర్‌కు కాకుండా.. అక్క‌డే వేరే ప‌నులు చేసిన వారికి పెండింగు బిల్లులు చెల్లించిన‌ట్టు తెలుస్తోంది. అయితే .. ఈ బిల్లులు కూడా చెల్లించ‌వ‌ద్ద‌ని గ‌తంలో మంత్రి ఆదేశించ‌డంగ‌మ‌నార్హం. ఎలా చూసుకున్నా.. అధికారుల తీరు వివాదంగా మారుతోంది.

This post was last modified on February 15, 2025 2:44 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రేక్షకులు మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

1 hour ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

2 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

3 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

4 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

6 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

6 hours ago