ఏపీలోని కూటమి సర్కారులో ఏం జరుగుతోంది? అధికారులు.. మంత్రుల మాట వినడం లేదని, వారికి నచ్చినట్టు చేస్తున్నారని.. కొన్ని రోజులుగా విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు కూడా ఒకటికి రెండు సార్లు అధికారులను హెచ్చరించారు. మంత్రుల మాట వినకపోతే ఎలా? అని కూడా నిలదీశారు. ఇక నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా సీరియస్గా ఉంటుందని చెప్పారు.
కానీ, ఎందుకో.. అధికారులు మాత్రం మంత్రులు చెప్పిన మాటను పూచిక పుల్ల మాదిరిగా తీసేస్తున్నారు. ఏదో చిన్నా చితక శాఖలో ఉన్నతాధికారులు మంత్రి చెప్పింది వినలేదంటే అర్ధం చేసుకోవచ్చు. సరేనని సరిపెట్టుకోవచ్చు. కానీ, ముఖ్యమంత్రి తర్వాత.. అంతటి స్థాయి, ప్రొటోకాల్ ఉన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెపిన మాటను కూడా అధికారులు వినలేదంటే ఆశ్చర్యం వేస్తుంది! ఔనా? అని కూడా అనిపిస్తుంది.. కానీ.. పక్కా నిజం! ఈవిషయాన్ని మంత్రి తాజాగా బయట పెట్టారు.
శనివారం ఉదయం సచివాలయానికి వచ్చిన మంత్రి పయ్యావుల.. తన శాఖలో పెండింగులో ఉన్న బిల్లు లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గతంలో తన దృష్టికి వచ్చిన విశాఖలోని రుషి కొండ భవనాల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ ఫైలు కనిపించలేదు. అప్పట్లో జగన్.. రూ.500 కోట్ల ఖర్చుతో ఈ ఇంద్ర భవనాన్ని నిర్మించడం.. తర్వాత వివాదం కావడం తెలిసిందే. అయితే.. సర్కారు మారడంతో దీనికి సంబంధించిన బకాయిలను ఇప్పట్లో చెల్లించకూడదని నిర్నయం తీసుకున్నారు.
ఇదే విషయాన్ని పయ్యావుల కూడా తన శాఖ అధికారులను ఆదేశించారు. కానీ, తాజాగా సదరు పెండింగు ఫైలు ఆయనకు కనిపించలేదు. ఇదే విషయాన్ని ఆయన ఉన్నతాధికారులను ప్రశ్నించారు. అయితే.. వారు బిల్లులు క్లియర్ అయిపోయానని.. మెల్లగా చెప్పారు. దీంతో అగ్గిమీద గుగ్గిలం అయిన.. పయ్యావుల.. “నేను వద్దని చెప్పిన తర్వాత కూడా.. బిల్లులు ఎలా చెల్లిస్తారు? వైపీపీ అనుకూల కాంట్రాక్టర్ల బిల్లులు ఆపాలని చెప్పాను కదా?“ అని నిప్పులు చెరిగారు. కానీ, అధికారులు మౌనం పాటించారు.
దీనిపై సీఎంచంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని పయ్యావుల నిర్ణయించుకున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. అయితే.. ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తోంది. రుషి కొండ భవనాన్నినిర్మించిన కాంట్రాక్టర్కు కాకుండా.. అక్కడే వేరే పనులు చేసిన వారికి పెండింగు బిల్లులు చెల్లించినట్టు తెలుస్తోంది. అయితే .. ఈ బిల్లులు కూడా చెల్లించవద్దని గతంలో మంత్రి ఆదేశించడంగమనార్హం. ఎలా చూసుకున్నా.. అధికారుల తీరు వివాదంగా మారుతోంది.
This post was last modified on February 15, 2025 2:44 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…