Political News

తమిళనాడు ప్రభుత్వానికి అందిన అమ్మ ఆస్తుల లెక్క

ఆస్తులు కూడబెట్టే విషయంలో మనిషికి ఉండే ఆశ అంతా ఇంతా కాదు. తినటం.. తాగటం లాంటి విషయాలు ఒక మోతాదు దాటిన తర్వాత ఆగాల్సిందే. కానీ.. ఆస్తుల్ని కూడబెట్టే విషయంలో మాత్రం అంతుపొంతూ ఉండదు. ఎంత సంపాదించినా.. సంపద పోగేయాలన్న ఆశ చావదు. ఆ దాహం తీరనిది. అలా అని.. అంత సంపద పోగేసిన తర్వాత వెంట ఏమైనా తీసుకెళతారా? అంటే పైసా వెంట పెట్టుకు వెళ్లలేరు.

ఈ మాత్రం దానికి కిందా మీదా పడాలా? అంటే.. పడకుండా ఉండలేని నైజం ఎక్కువ మంది మనుషుల్లో కనిపిస్తూ ఉంటుంది. తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఆస్తుల్ని తమిళనాడుకు కట్టబెట్టేస్తూ కోర్టు నిర్ణయాన్ని ప్రకటించటమే కాదు.. అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ‘అమ్మ’ ఆస్తుల లెక్క మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

ప్రముఖ నటిగా.. అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటమే కాదు సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని సొంతం చేసుకున్న జయలలిత అత్యున్నత పదవుల్ని సొంతం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల్ని ఎదుర్కోవటమే కాదు.. ఆ కేసులో జైలుకు వెళ్లారు. నేరం నిరూపితమై దోషిగా నిలిచారు. ఆమె మరణం నేపథ్యంలో ఆమె సంపాదించిన ఆస్తులకు ఎవరు హక్కుదారు అన్న అంశంపై బెంగళూరు కోర్టులో వాదనలు జరిగాయి. చివరకు వాటిని తమిళనాడుకు అప్పగించేందుకు న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

ఇంతకాలం బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో దాచిన జయలలిత ఆస్తుల్ని.. తాజాగా తమిళనాడుకు అప్పగించారు. ఈ క్రమంలో ఆమె ఆస్తుల లెక్క మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 10 వేల చీరలు.. 750 జతల చెప్పులు.. 27 కేజీల బంగారం.. వజ్రాభరణాలు.. రత్నాలు.. 601 కేజీల వెండి వస్తువులు.. 1672 ఎకరాల వ్యవసాయ భూములకు చెందిన పత్రాలు.. ఇళ్లకు సంబంధించిన దస్తావేజులు.. 8376 పుస్తకాలతో పాటు ఇతర వస్తువుల్ని తమిళనాడు అధికారులకు అప్పజెప్పారు.

ఇందుకోసం భారీ భద్రతను కల్పించారు. న్యాయమూర్తి హెచ్ ఎన్ మోహన్ సమక్షంలో తమిళనాడు అధికారులకు అప్పజెప్పారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జప్తు చేసిన జయలలిత సంపదను 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకు తీసుకొచ్చి ఈ జైలులో భద్రపరిచారు. జయలలిత మరణం తర్వాత ఆమె ఆస్తులకు తాము వారసులమని.. ఆస్తుల్ని తమకు అప్పగించాలని దీపక్.. దీపలు దాఖలు చేసుకున్న అర్జీలను హైకోర్టు కొట్టేయటం తెలిసిందే.

అనంతరం సుప్రీంను ఆశ్రయించినా అక్కడా చుక్కెదురైంది.అప్పట్లో జయలలిత నుంచి జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.913.14 కోట్లుగా మదింపు వేయగా.. అదిప్పుడు రూ.4వేల కోట్లకు పైనే ఉంటుందని లెక్కలు కడుతున్నారు. సంపద కోసం అతిగా ఆశపడే వారికి.. జయలలిత ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుందని మాత్రం చెప్పక తప్పదు.

This post was last modified on February 15, 2025 11:33 am

Share

Recent Posts

‘ఇరుముడి’లో చరణ్… రూమర్‌ను నిజం చేద్దామని

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…

38 minutes ago

కన్నడిగుల ఆక్రోశం అర్థరహితం

సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…

43 minutes ago

బోయపాటికి ఎస్ చెప్పే హీరో ఎవరు

అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…

2 hours ago

పిఠాపురం ఆడ‌ప‌డుచుల‌కు ప‌వ‌న్ రాఖీలు!

తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేక అనుబంధాన్ని…

2 hours ago

సుమంత్ సరైన దారిలో వెళ్తున్నట్టే

ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…

2 hours ago

దారిన ప‌డుతున్న నేత‌లు… `వైసీపీకి నో ఛాన్స్‌!`

స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీల మ‌ధ్య చిరాకులు, ప‌రాకుల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌మ‌కు అది మేలు చేస్తుంద‌ని భావిస్తున్న వైసీపీకి…

3 hours ago