ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ కార్యాలయం గాంధీ భవన్ వేదికగా బీసీ జన గణన, ఎస్సీ వర్గీకరణపై జరిగిన సమావేశంలో మాట్లాడిన సందర్బంగా మోదీ కులాన్ని ప్రస్తావించిన రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా మోదీపై ఏ ఒక్కరు చేయనంత స్థాయిలో రేవంత్ విమర్శలు గుప్పించిన తీరు కలకలం రేపుతోంది. అంతేకాకుండా రేవంత్ వ్యాఖ్యలతో రానున్న కొద్ది రోజుల పాటు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం ఓ రేంజీలో నడిచే అవకాశాలు ఉన్నాయని చెప్పక తప్పదు.
అయినా ప్రధాని మోదీ గురించి రేవంత్ ఎమన్నారన్న విషయానికి వస్తే… ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను బీసీ అని చెప్పుకుంటారని రేవంత్ అన్నారు. అయితే వాస్తవానికి మోదీ నిజమైన బీసీ కాదని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ”నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదు. మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు మోదీ ఉన్నత వర్గాలకు చెందిన వారే. గుజరాత్ సీఎం అయ్యాక మోదీ తన కులాన్ని బీసీల్లో కలుపుకున్నారు. మోదీకి బీసీ సర్టిఫికెట్ ఉండొచ్చు గానీ… మోదీ మనస్తత్వం మాత్రం బీసీలకు వ్యతిరేకం” అని రేవంత్ వ్యాఖ్యానించారు.
మోదీని నేరుగానే టార్గెట్ చేసిన రేవంత్.. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..,. మోదీ నిజమైన బీసీనే అయితే 2021లో దేశంలో జనాభా లెక్కలు ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. దేశంలో బీసీల లెక్క ఎందుకు తేల్చలేదని కూడా రేవంత్ నిలదీశారు. మోదీని అగ్రవర్ణాలకు చెందిన నేతగానే తేల్చేసిన రేవంత్…మోదీ పాలనలో బీసీలకు న్యాయమేమీ జరగడం లేదని ఆరోపించారు. మోదీ లాంటి నేతలు ఉన్నంత కాలం కూడా బీసీలకు న్యాయం దక్కదని కూడా రేవంత్ సెటైరికల్ పంచ్ లు సంధించారు. రేవంత్ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పెను కలకలమే రేపనున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on February 15, 2025 6:17 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…