Political News

15 మందితో లిస్ట్… 9 మందితో షార్ట్ లిజ్ట్.. లక్కీ లీడర్ ఎవరో??

దాదాపుగా 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకుంది. ఇటీవల ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 5ననే వెలువడ్డాయి. అయితే ఇంకా అక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. అటే కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకే చోట నుంచి కార్యకలాపాలు సాగించే ఢిల్లీలో రెండు ప్రభుత్వాలు కూడా ఒకే పార్టీకి దక్కిన నేపథ్యంలో క్షణాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందని అంతా ఆశించారు. అయితే ఢిల్లీ సీఎం పోస్టుకు పెద్ద సంఖ్యలో నేతలు క్యూ కట్టడంతో బీజేపీ అధిష్ఠానం తుది నిర్ణయం కోసం కొంత సమయాన్ని తీసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నేటి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. మోదీ ఆదేశాల మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ సీఎం, మంత్రి మండలి, అసెంబ్లీ స్పీకర్ గా ఎవరు ఉండాలన్న దానిపై ఓ కసరత్తు అయితే చేసిందట. సీఎం పోస్టుకు మొత్తంగా 15 మంది అభ్యర్థులతో ఓ జాబితాను సిద్ధం చేసిన షా, నడ్డాలు… దానిని 9 మంది పేర్లతో కూడిన షార్ట్ లిస్ట్ రెడీ చేశారట. ఈ 9 మందిలోనే డిల్లీ సీఎం పోస్టును అదిరోహించే లక్కీలీడర్ తో పాటుగా అసెంబ్లీ స్పీకర్, ఇద్దరు డిప్యూటీ సీఎంలు, కేబినెట్ లో కీలక పోర్ట్ ఫోలియోల మంత్రులను ఖరారు చేస్తారట.

మోదీ శుక్రవారం రాత్రికి ఢిల్లీకి చేరుకోగానే… శనివారం ఉదయమే ఢిల్లీ సర్కారు కూర్పుపై అంతిమ కసరత్తు మొదలు కానున్నట్లు సమాచారం. అంతేకాకుండా శనివారమే తుది కసరత్తు పూర్తి చేసి… ఈ నెల 17, 18 తేదీల్లో బీజేఎల్పీ సమావేశాన్ని నిర్వహించాలని అథిష్టానం దాదాపుగా నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ నెల 19 లేదంటే… 20న ఢిల్లీ సీఎం చేత ప్రమాణ స్వీకారం చేయించాలని కూడా నిర్ణయించారట. మరి ఆ 9 మందిలోని లక్కీ లీడర్ ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on February 14, 2025 4:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

32 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

8 hours ago