దాదాపుగా 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకుంది. ఇటీవల ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 5ననే వెలువడ్డాయి. అయితే ఇంకా అక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. అటే కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకే చోట నుంచి కార్యకలాపాలు సాగించే ఢిల్లీలో రెండు ప్రభుత్వాలు కూడా ఒకే పార్టీకి దక్కిన నేపథ్యంలో క్షణాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందని అంతా ఆశించారు. అయితే ఢిల్లీ సీఎం పోస్టుకు పెద్ద సంఖ్యలో నేతలు క్యూ కట్టడంతో బీజేపీ అధిష్ఠానం తుది నిర్ణయం కోసం కొంత సమయాన్ని తీసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నేటి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. మోదీ ఆదేశాల మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ సీఎం, మంత్రి మండలి, అసెంబ్లీ స్పీకర్ గా ఎవరు ఉండాలన్న దానిపై ఓ కసరత్తు అయితే చేసిందట. సీఎం పోస్టుకు మొత్తంగా 15 మంది అభ్యర్థులతో ఓ జాబితాను సిద్ధం చేసిన షా, నడ్డాలు… దానిని 9 మంది పేర్లతో కూడిన షార్ట్ లిస్ట్ రెడీ చేశారట. ఈ 9 మందిలోనే డిల్లీ సీఎం పోస్టును అదిరోహించే లక్కీలీడర్ తో పాటుగా అసెంబ్లీ స్పీకర్, ఇద్దరు డిప్యూటీ సీఎంలు, కేబినెట్ లో కీలక పోర్ట్ ఫోలియోల మంత్రులను ఖరారు చేస్తారట.
మోదీ శుక్రవారం రాత్రికి ఢిల్లీకి చేరుకోగానే… శనివారం ఉదయమే ఢిల్లీ సర్కారు కూర్పుపై అంతిమ కసరత్తు మొదలు కానున్నట్లు సమాచారం. అంతేకాకుండా శనివారమే తుది కసరత్తు పూర్తి చేసి… ఈ నెల 17, 18 తేదీల్లో బీజేఎల్పీ సమావేశాన్ని నిర్వహించాలని అథిష్టానం దాదాపుగా నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ నెల 19 లేదంటే… 20న ఢిల్లీ సీఎం చేత ప్రమాణ స్వీకారం చేయించాలని కూడా నిర్ణయించారట. మరి ఆ 9 మందిలోని లక్కీ లీడర్ ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on February 14, 2025 4:18 pm
తెలుగులో ఒకప్పట్లా ఇబ్బడిముబ్బడిగా కమెడియన్లు లేరిప్పుడు. ఉన్న వాళ్లలో కూడా నిలకడగా నవ్వించేవాళ్లు తక్కువ. కొంచెం లేటుగా ఊపందుకుని.. వెన్నెల…
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు…
మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ప్లస్ వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న…
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన స్టార్ హీరో దళపతి విజయ్… ప్రతి అడుగులోనూ తనదైన శైలి ప్రత్యేకతను చాటుతున్నారు.…
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజవడం ఆయన అభిమానులకు అరుదైన…