Political News

15 మందితో లిస్ట్… 9 మందితో షార్ట్ లిజ్ట్.. లక్కీ లీడర్ ఎవరో??

దాదాపుగా 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకుంది. ఇటీవల ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 5ననే వెలువడ్డాయి. అయితే ఇంకా అక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. అటే కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకే చోట నుంచి కార్యకలాపాలు సాగించే ఢిల్లీలో రెండు ప్రభుత్వాలు కూడా ఒకే పార్టీకి దక్కిన నేపథ్యంలో క్షణాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందని అంతా ఆశించారు. అయితే ఢిల్లీ సీఎం పోస్టుకు పెద్ద సంఖ్యలో నేతలు క్యూ కట్టడంతో బీజేపీ అధిష్ఠానం తుది నిర్ణయం కోసం కొంత సమయాన్ని తీసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నేటి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. మోదీ ఆదేశాల మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ సీఎం, మంత్రి మండలి, అసెంబ్లీ స్పీకర్ గా ఎవరు ఉండాలన్న దానిపై ఓ కసరత్తు అయితే చేసిందట. సీఎం పోస్టుకు మొత్తంగా 15 మంది అభ్యర్థులతో ఓ జాబితాను సిద్ధం చేసిన షా, నడ్డాలు… దానిని 9 మంది పేర్లతో కూడిన షార్ట్ లిస్ట్ రెడీ చేశారట. ఈ 9 మందిలోనే డిల్లీ సీఎం పోస్టును అదిరోహించే లక్కీలీడర్ తో పాటుగా అసెంబ్లీ స్పీకర్, ఇద్దరు డిప్యూటీ సీఎంలు, కేబినెట్ లో కీలక పోర్ట్ ఫోలియోల మంత్రులను ఖరారు చేస్తారట.

మోదీ శుక్రవారం రాత్రికి ఢిల్లీకి చేరుకోగానే… శనివారం ఉదయమే ఢిల్లీ సర్కారు కూర్పుపై అంతిమ కసరత్తు మొదలు కానున్నట్లు సమాచారం. అంతేకాకుండా శనివారమే తుది కసరత్తు పూర్తి చేసి… ఈ నెల 17, 18 తేదీల్లో బీజేఎల్పీ సమావేశాన్ని నిర్వహించాలని అథిష్టానం దాదాపుగా నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ నెల 19 లేదంటే… 20న ఢిల్లీ సీఎం చేత ప్రమాణ స్వీకారం చేయించాలని కూడా నిర్ణయించారట. మరి ఆ 9 మందిలోని లక్కీ లీడర్ ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి.

Satya

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

1 minute ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

44 minutes ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

8 hours ago