Political News

తెల్లవారుజున అరెస్ట్.. అర్థ రాత్రి జైలుకు తరలింపు

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ జైలుకు వెళ్లారు. వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచగా… న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. వంశీ అరెస్ట్, ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు గురువారం ఉదయం నుంచి రాత్రి దాకా ఏపీలో పెను ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు జరిపిన దాడికి సంబంధించిన కేసును మాఫీ చేయించుకునే క్రమంలో.. ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న టీడీపీ ఆపీస్ కంప్యూటర్ ఆపరేటర్ ముదునూరి సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసిన వంశీ.. ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై పోలీసులు కొత్త కేసు పెట్టారు. ఈ కేసులోనే వంశీని గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన విజయవాడ పటమట పోలీసులు ఆ తర్వాత విజయవాడ తరలించారు.

గురువారం మధ్యాహ్నం సమయానికంతా విజయవాడకు తీసుకొచ్చిన వంశీని తొలుత భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు… ఆ తర్వాత కృష్ణలంక పీఎస్ కు తరలించారు. అక్కడే దాదాపుగా 9 గంటల పాటు వంశీని విచారించిన పోలీసులు ఆయన నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ సమయంలో వంశీని కలిసేందుకు ఆయన సతీమణి పీఎస్ కు వచ్చినా పోలీసులు ఆమెను అనుమతించలేదు. కేవలం లాయర్లను మాత్రమే పోలీసులు అనుమతించగా… 9 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం విజయవాడ జీజీహెచ్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడ ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి వద్దకు తరలించారు. వంశీతో పాటుగా ఈ కేసుతో సంబంధముందని భావిస్తున్న శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిలను కూడా పోలీుసులు న్యాయమూర్తి ఎధుట హాజరుపరిచారు.

ఈ సందర్భంగా నిందితుడిగా వంశీని జడ్జీ ముందు ప్రవేశపెట్టిన పోలీసులు…ఆ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును మాత్రం సమయానికి జడ్జీకి అందించలేకపోయారు. దీంతో పోలీసుల తీరుపై జడ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని మాత్రమే తీసుకుని వస్తే… రిమాండ్ రిపోర్ట్ లేకుండా తానేం చేయాలని ఆయన వారిపై ఫైర్ అయ్యారు. ఆ తర్వాత చాలా సేపటికి రిమాండ్ రిపోర్టు రాగా… దానిని జడ్జీకి అందజేసిన పోలీసులు… వంశీకి రిమాండ్ విధించాలని కోరారు. అయితే ఈ కేసులో తన ప్రమేయమేమీ లేదని వాదిస్తూ వంశీ తరఫు న్యాయవాదులు,… ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్ రిపోర్ట్, బెయిల్ పిటిషన్లను పరిశీలించిన జడ్జీ… వంశీకి రిమాండ్ విధించారు. దీంతో రాత్రి 2.30 గంటల సమయంలో వంశీని పోలీసులు జైలుకు తరలించారు.

This post was last modified on February 14, 2025 12:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కల్తీ పాల మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం

రాజమండ్రిలోని స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్ లో కల్తీ పాలు తాగి పలువురు తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా…

60 minutes ago

బలవంత్ బిజినెస్ వర్కౌట్ అయ్యిందా

మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ప్రమోషన్ల పరంగా బాగా హడావిడి చేసింది హే బలవంత్ ఒక్కటే. మిగిలినవి కూడా పబ్లిసిటీ…

1 hour ago

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన…

3 hours ago

‘పోటీ’లో పవన్ దారిలోనే విజయ్

తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన…

4 hours ago

ఉస్తాద్ ఆరా పాట ఔరా అనిపించలేదా

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…

5 hours ago

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

9 hours ago