హీరో రామ్ చరణ్, నిర్మాత నాగబాబు కెరీర్లలో అత్యంత పెద్ద ఫ్లాప్ ఏదంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఆరెంజ్. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఇంత ఓవర్ లవ్ స్టోరీలో మెగా పవర్ స్టార్ ని ప్రేక్షకులు చూడలేకపోయారు. కానీ హరీష్ జైరాజ్ అందించిన పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి.
కమర్షియల్ గా అప్పట్లో ఫెయిల్యూర్ కావొచ్చు కానీ ఆడియో పరంగా మాత్రం క్యాసెట్లు, సిడిలు భారీగా అమ్ముడుపోయాయి. క్రమంగా ఆరెంజ్ జనాలకు అర్థం కావడం మొదలయ్యింది. అప్పట్లో థియేటర్ ఎక్స్ పీరియన్స్ మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. గత ఏడాది రీ రిలీజ్ కి ఇది కనిపించింది.
తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఆరెంజ్ మళ్ళీ రీ రిలీజయ్యింది. మొదటి షో పడక ముందే సుమారు 40 వేలకు పైగా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ లో అమ్ముడుపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఉదయం ఏడెనిమిది గంటల ఆటకే యూత్ పోటెత్తున్న వైనం కనిపిస్తోంది.
ఇది ఈ ఒక్క రోజుకే పరిమితం కావొచ్చు లేదా కంటిన్యూ అవ్వొచ్చు. అది కాదు అసలు మ్యాటర్. ఏడాది తిరక్కుండానే మళ్ళీ రీ రిలీజ్ చేస్తే ఇప్పుడున్న టికెట్ రేట్లకే ఇంకోసారి చూసేందుకు ఫ్యాన్స్ పరుగులు పెట్టడం. విచిత్రంగా లైలా, బ్రహ్మ ఆనందం కన్నా ఆరెంజ్ అమ్మకాలే బాగుండటం ట్రేడ్ ని నివ్వెరపరుస్తున్న అంశం.
చూస్తుంటే ప్రతి సంవత్సరం ఆరెంజ్ ఏదో ఒక సందర్భంలో రిపీట్ రన్ కు వచ్చేలా ఉంది. నాగబాబు మాత్రం ఈ పరిణామాలు చూస్తూ షాక్ అవుతూ ఉంటారు. ఆ మధ్య ఓసారి దీని గురించి అడిగితే ఇలా చూసేదేదో అప్పుడే చేసి ఉంటే తనకు నష్టాలు తప్పేవని నవ్వుతు చెప్పడం అభిమానులకు గుర్తే.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఆరెంజ్ లో జెనీలియా హీరోయిన్ గా నటించింది. గత నెల గేమ్ ఛేంజర్ గాయాన్ని బాగా ఫీలైన మెగా ఫాన్స్ ఇప్పుడీ ఆరెంజ్ రూపంలో కొంత స్వాంతన పొందుతున్నారనుకోవాలి. అందరికంటే ఎక్కువ క్రెడిట్ ముందు అద్భుతమైన పాటలు ఇచ్చినందుకు హరీష్ జైరాజ్ కే ఇవ్వాలి.
This post was last modified on February 14, 2025 12:47 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…