హీరో రామ్ చరణ్, నిర్మాత నాగబాబు కెరీర్లలో అత్యంత పెద్ద ఫ్లాప్ ఏదంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఆరెంజ్. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఇంత ఓవర్ లవ్ స్టోరీలో మెగా పవర్ స్టార్ ని ప్రేక్షకులు చూడలేకపోయారు. కానీ హరీష్ జైరాజ్ అందించిన పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి.
కమర్షియల్ గా అప్పట్లో ఫెయిల్యూర్ కావొచ్చు కానీ ఆడియో పరంగా మాత్రం క్యాసెట్లు, సిడిలు భారీగా అమ్ముడుపోయాయి. క్రమంగా ఆరెంజ్ జనాలకు అర్థం కావడం మొదలయ్యింది. అప్పట్లో థియేటర్ ఎక్స్ పీరియన్స్ మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. గత ఏడాది రీ రిలీజ్ కి ఇది కనిపించింది.
తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఆరెంజ్ మళ్ళీ రీ రిలీజయ్యింది. మొదటి షో పడక ముందే సుమారు 40 వేలకు పైగా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ లో అమ్ముడుపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఉదయం ఏడెనిమిది గంటల ఆటకే యూత్ పోటెత్తున్న వైనం కనిపిస్తోంది.
ఇది ఈ ఒక్క రోజుకే పరిమితం కావొచ్చు లేదా కంటిన్యూ అవ్వొచ్చు. అది కాదు అసలు మ్యాటర్. ఏడాది తిరక్కుండానే మళ్ళీ రీ రిలీజ్ చేస్తే ఇప్పుడున్న టికెట్ రేట్లకే ఇంకోసారి చూసేందుకు ఫ్యాన్స్ పరుగులు పెట్టడం. విచిత్రంగా లైలా, బ్రహ్మ ఆనందం కన్నా ఆరెంజ్ అమ్మకాలే బాగుండటం ట్రేడ్ ని నివ్వెరపరుస్తున్న అంశం.
చూస్తుంటే ప్రతి సంవత్సరం ఆరెంజ్ ఏదో ఒక సందర్భంలో రిపీట్ రన్ కు వచ్చేలా ఉంది. నాగబాబు మాత్రం ఈ పరిణామాలు చూస్తూ షాక్ అవుతూ ఉంటారు. ఆ మధ్య ఓసారి దీని గురించి అడిగితే ఇలా చూసేదేదో అప్పుడే చేసి ఉంటే తనకు నష్టాలు తప్పేవని నవ్వుతు చెప్పడం అభిమానులకు గుర్తే.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఆరెంజ్ లో జెనీలియా హీరోయిన్ గా నటించింది. గత నెల గేమ్ ఛేంజర్ గాయాన్ని బాగా ఫీలైన మెగా ఫాన్స్ ఇప్పుడీ ఆరెంజ్ రూపంలో కొంత స్వాంతన పొందుతున్నారనుకోవాలి. అందరికంటే ఎక్కువ క్రెడిట్ ముందు అద్భుతమైన పాటలు ఇచ్చినందుకు హరీష్ జైరాజ్ కే ఇవ్వాలి.
This post was last modified on February 14, 2025 12:47 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…