గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వంశీ అరెస్టు సమయంలో ఎంత హై డ్రామా నడిచిందో…ఆ తర్వాత ఆయనను విజయవాడకు తరలించిన తర్వాత కూడా అంతకు మించిన హై డ్రామా నడిచింది.
వంశీని తరలిస్తున్న పోలీసు వాహనాన్ని వంశీ భార్య పంకజశ్రీ అనుసరించడంతో నందిగామ వద్ద ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని, తమను ఫాలో చేయవవద్దని చెప్పినా ఆమె వినలేదు. దీంతో, సమీపంలోని ఓ డ్రైవింగ్ స్కూల్ లో ఆమెను ఉంచి, ఆమె ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక, ముందుగా వంశీని భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించి..
అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపు 2 గంటల నుంచి ఆయనను పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు.
ఇక, వంశీ తరపు లాయర్లు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదయ్యాయి. అందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి.
వంశీ విచారణ నేపథ్యంలో కృష్ణలంక పీఎస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. వంశీపై ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ ను వంశీ అనుచరులు కిడ్నాప్ చేశారని, కేసు విత్ డ్రా చేసుకోవాలని సత్యవర్థన్ ను వంశీ బెదిరించారని ఫిర్యాదు రావడంతో పోలీసులు వంశీని అరెస్టు చేశారు. ఆయన అనుచరులపై కూడా కేసు నమోదైంది.
మరోవైపు, వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్-30 అమలులో ఉందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎటువంటి ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వంశీ అరెస్టు నేపథ్యంలో వైసీపీ నేతలు అల్లర్లు సృష్టించే అవకాశమున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.
This post was last modified on February 13, 2025 5:13 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…