ఇప్పుడంతా కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మీదే చర్చ జరుగుతోంది. ఏఐ రంగం వైపు దాదాపుగా అన్ని దేశాలు పరుగులు పెడుతున్నాయి. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఏఐ జపాన్ని పఠిస్తున్నాయి. ఏపీ నూతన రాజధాని అమరావతిని ఏఐ కేపిటల్ గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చెబుతుంటే…
ఇప్పటికే ఐటీ పరంగా ఓ రేంజి అభివృద్ధి సాధించిన తెలంగాణ రాజధానిని ఇకపై ఏఐకి కేంద్రంగా మలుస్తామని ఆ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి చెబుతున్నారు. వెరసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏఐ ఆదారిత పరిశ్రమలు, పెట్టుబడులు భారీగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏఐ రంగంలో ఐటీ దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్ లు త్వరలోనే హైదరాబాద్ లో తమ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ రెండు సంస్థలు వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. గురువారం గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ తన నూతన క్యాంపస్ ను ప్రారంభించింది.
తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వచ్చిన రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ నూతన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగానే హైదరాబాద్ లో కొత్తగా ఏర్పాటు కానున్న ఏఐ సిటీలో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇందుకోసం రూ.15 వేల కోట్లను పెట్టుబడిగా ఫెట్టనున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ… ఆ మేరకు తెలంగాణ సర్కారుతో కీలక ఓప్పందాన్ని కుదుర్చుకుంది.
ఆ తర్వాత టీ హబ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా గూగుల్ ప్రతినిధులు వారితో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటు కానున్న ఏఐ సిటీలో గూగుల్ తరఫున ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.
అంతేకాకుండా అంతకుముందు జరిగిన చర్చల ఫలితంగా రూపొందిన ఒప్పంద పత్రాలపై గూగుల్ ప్రతినిధులు, తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి సంతకాలు చేశారు. వెరసి ఒకే రోజు అటు మక్రోసాఫ్ట్ తో పాటు ఇటు గూగుల్ తోనూ ఏఐ సిటీలో ఆయా సంస్థల కేంద్రాలు ఏర్పాటు అయ్యేలా తెలంగాణ సర్కారు రెండు కీలక ఒప్పందాలను చేసుకుంది. ఈ రెండు కేంద్రాలు కూడా వివిధ రంగాలకు చెందిన వారికి ఏఐలో శిక్షణను ఇవ్వనున్నాయి.
This post was last modified on February 13, 2025 4:57 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…