Political News

తెలంగాణలో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ సెంటర్లు

ఇప్పుడంతా కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మీదే చర్చ జరుగుతోంది. ఏఐ రంగం వైపు దాదాపుగా అన్ని దేశాలు పరుగులు పెడుతున్నాయి. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఏఐ జపాన్ని పఠిస్తున్నాయి. ఏపీ నూతన రాజధాని అమరావతిని ఏఐ కేపిటల్ గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చెబుతుంటే…

ఇప్పటికే ఐటీ పరంగా ఓ రేంజి అభివృద్ధి సాధించిన తెలంగాణ రాజధానిని ఇకపై ఏఐకి కేంద్రంగా మలుస్తామని ఆ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి చెబుతున్నారు. వెరసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏఐ ఆదారిత పరిశ్రమలు, పెట్టుబడులు భారీగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏఐ రంగంలో ఐటీ దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్ లు త్వరలోనే హైదరాబాద్ లో తమ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ రెండు సంస్థలు వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. గురువారం గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ తన నూతన క్యాంపస్ ను ప్రారంభించింది.

తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వచ్చిన రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ నూతన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగానే హైదరాబాద్ లో కొత్తగా ఏర్పాటు కానున్న ఏఐ సిటీలో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇందుకోసం రూ.15 వేల కోట్లను పెట్టుబడిగా ఫెట్టనున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ… ఆ మేరకు తెలంగాణ సర్కారుతో కీలక ఓప్పందాన్ని కుదుర్చుకుంది.

ఆ తర్వాత టీ హబ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా గూగుల్ ప్రతినిధులు వారితో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటు కానున్న ఏఐ సిటీలో గూగుల్ తరఫున ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.

అంతేకాకుండా అంతకుముందు జరిగిన చర్చల ఫలితంగా రూపొందిన ఒప్పంద పత్రాలపై గూగుల్ ప్రతినిధులు, తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి సంతకాలు చేశారు. వెరసి ఒకే రోజు అటు మక్రోసాఫ్ట్ తో పాటు ఇటు గూగుల్ తోనూ ఏఐ సిటీలో ఆయా సంస్థల కేంద్రాలు ఏర్పాటు అయ్యేలా తెలంగాణ సర్కారు రెండు కీలక ఒప్పందాలను చేసుకుంది. ఈ రెండు కేంద్రాలు కూడా వివిధ రంగాలకు చెందిన వారికి ఏఐలో శిక్షణను ఇవ్వనున్నాయి.

This post was last modified on February 13, 2025 4:57 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మే 1 కోసం కొత్త సినిమాల కొట్లాట

ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…

18 minutes ago

అమ‌రావ‌తి బిల్లు… తెర‌వెనుక యోధులు ఎవరు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. వాస్త‌వానికి ఇప్ప‌టికే చాలా బిల్లులు పెండింగులో ఉండ‌గా..…

1 hour ago

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

2 hours ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

2 hours ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

4 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

5 hours ago