వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైనప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి ఆ పార్టీలో కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు కొందరు కీలక నేతలు పార్టీని వీడితే… ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాభవం ఎదురైన తర్వాత మరింత మంది నేతలు పార్టీని వీడారు. తాజాగా ఇప్పుడు పార్టీకి మంచి పట్టు ఉన్న పల్నాడు జిల్లాలో కీలక నేతగా కొనసాగుతున్న మర్రి రాజశేఖర్ కూడా పార్టీని వీడే దిశగా సాగుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మర్రి రాజశేఖర్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి కూడా ఆయన సన్నిహితుడిగానే మెలిగారు. ఈ క్రమంలోనే వైసీపీని స్థాపించినంతనే కాంగ్రెస్ ను వీడిన మర్రి… జగన్ వెంట నడిచారు. అయితే ఆది నుంచి కూడా మర్రికి జగన్ పెద్దగా ప్రాదాన్యమే ఇవ్వలేదని చెప్పాలి. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు రావడం, మర్రి సొంతూరు అయిన చిలకలూరిపేట టికెట్ ను ఎగురవేసుకు పోవడం జరుగుతోంది. మాజీ మంత్రి విడదట రజిని కూడా మర్రిని ఓవర్ టేక్ చేసి చిలకలూరిపేట టికెట్ ను దక్కించుకున్నారు. అయినా కూడా మర్రి పార్టీని వీడలేదు. మొన్నటి ఎన్నికలకు ముందు మర్రికి జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
తాజాగా 2024 ఎన్నికల్లో రజినిని గుంటూరుకు షిప్ట్ చేసిన జగన్… ఎన్నికలు ముగియగానే.. తిరిగి ఆమెను చిలకలూరిపేటకు తీసుకొచ్చారు. ఈ సందర్బంగా మర్రికి మాట మాత్రంగా కూడా చెప్పలేదట. అంతేకాకుండా రజిని కూడా మర్రిని పెద్దగా పట్టించుకున్న పాపాన పోవడం లేదని సమాచారం. దీంతో ఇలాగైతే కుదరదని భావిస్తున్న మర్రి… పార్టీని వీడాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఈ కారణంగానే బుధవారం జగన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పార్టీ సమావేశానికి ఆయన డుమ్మా కొట్టేశారట. ఈ సమావేశానికి పల్నాడుతో పాటు గుంటూరు, బాపట్ల జిల్లాల నేతలంతా వచ్చినా కూడా మర్రి జాడ మాత్రం కనిపించలేదు. ఎన్నాళ్లు పార్టీలో ఉన్నా.. తనకు తగిన గుర్తింపు లభించడం లేదని భావిస్తున్న మర్రి… వైసీపీ వీడి టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన జగన్ భేటీకి డుమ్మా కొట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 12, 2025 10:03 pm
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…