వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైనప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి ఆ పార్టీలో కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు కొందరు కీలక నేతలు పార్టీని వీడితే… ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాభవం ఎదురైన తర్వాత మరింత మంది నేతలు పార్టీని వీడారు. తాజాగా ఇప్పుడు పార్టీకి మంచి పట్టు ఉన్న పల్నాడు జిల్లాలో కీలక నేతగా కొనసాగుతున్న మర్రి రాజశేఖర్ కూడా పార్టీని వీడే దిశగా సాగుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మర్రి రాజశేఖర్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి కూడా ఆయన సన్నిహితుడిగానే మెలిగారు. ఈ క్రమంలోనే వైసీపీని స్థాపించినంతనే కాంగ్రెస్ ను వీడిన మర్రి… జగన్ వెంట నడిచారు. అయితే ఆది నుంచి కూడా మర్రికి జగన్ పెద్దగా ప్రాదాన్యమే ఇవ్వలేదని చెప్పాలి. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు రావడం, మర్రి సొంతూరు అయిన చిలకలూరిపేట టికెట్ ను ఎగురవేసుకు పోవడం జరుగుతోంది. మాజీ మంత్రి విడదట రజిని కూడా మర్రిని ఓవర్ టేక్ చేసి చిలకలూరిపేట టికెట్ ను దక్కించుకున్నారు. అయినా కూడా మర్రి పార్టీని వీడలేదు. మొన్నటి ఎన్నికలకు ముందు మర్రికి జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
తాజాగా 2024 ఎన్నికల్లో రజినిని గుంటూరుకు షిప్ట్ చేసిన జగన్… ఎన్నికలు ముగియగానే.. తిరిగి ఆమెను చిలకలూరిపేటకు తీసుకొచ్చారు. ఈ సందర్బంగా మర్రికి మాట మాత్రంగా కూడా చెప్పలేదట. అంతేకాకుండా రజిని కూడా మర్రిని పెద్దగా పట్టించుకున్న పాపాన పోవడం లేదని సమాచారం. దీంతో ఇలాగైతే కుదరదని భావిస్తున్న మర్రి… పార్టీని వీడాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఈ కారణంగానే బుధవారం జగన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పార్టీ సమావేశానికి ఆయన డుమ్మా కొట్టేశారట. ఈ సమావేశానికి పల్నాడుతో పాటు గుంటూరు, బాపట్ల జిల్లాల నేతలంతా వచ్చినా కూడా మర్రి జాడ మాత్రం కనిపించలేదు. ఎన్నాళ్లు పార్టీలో ఉన్నా.. తనకు తగిన గుర్తింపు లభించడం లేదని భావిస్తున్న మర్రి… వైసీపీ వీడి టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన జగన్ భేటీకి డుమ్మా కొట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 12, 2025 10:03 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…