Political News

లోకేశ్ తో వేగేశ్న భేటీ… విశాఖపై సిఫీ ఆసక్తి

కూటమి పాలనలో ఏపీకి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి గడచిన 7 నెలల్లోనే ఏపీకి రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో టాప్ టెక్ కంపెనీ ఏపీకి వచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఫార్చూన్ టాప్ 500 కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన సిఫీ టెక్ కంపెనీ.. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఈ మేరకు సిఫీ టెక్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు వేగేశ్న బుధవారం అమరావతికి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తో ఆయన భేటీ అయ్యారు.

ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై లోకేశ్, వేగేశ్నల మధ్య కీలక చర్చ జరిగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు… ఏపీలో టెక్నాలజీ రంగంలో సమృద్ధిగా ఉన్న మానవ వనరులు, ఏపీకి పెట్టని కోటగా ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం, విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై వేగేశ్నకు లోకేశ్ సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతేకాకుండా కొత్త రాష్ట్రంగా ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహం తదితరాలను కూడా ఆయనకు లోకేశ్ వివరించారు. సుదీర్ఘంగా సాగిన లోకేశ్ ప్రజెంటేషన్ పట్ల వేగేశ్న సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వేగేశ్న మాట్లాడుతూ… ఏపీలోని విశాఖలో తమ సంస్థకు చెందిన డేటా సెంటర్ ను ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తామని తెలిపారు. అంతేకాకుండా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు విశాఖ సరి అయిన ప్రదేశమన్న లోకేశ్ ప్రతిపాదనల పట్ల కూడా వేగేశ్న సానుకూలంగా స్పందించారు. విశాఖలో ఇప్పటికే టీసీఎస్ తన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా లోకేశ్ గుర్తు చేశారు. టీసీఎస్ తో పాటు త్వరలోనే విశాఖకు ప్రఖ్యాత ఐటీ కంపెనీలు కూడా రానున్న విషయాన్ని లోకేశ్ గుర్తు చేశారు. సిఫీ నుంచి కూడా భారీ పెట్టుబడులనే ఆశిస్తున్నట్లు లోకేశ్ చెప్పగా… అందుకు వేగేశ్న సానుకూలంగా స్పందించారు.

This post was last modified on February 12, 2025 9:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago