Political News

లోకేశ్ తో వేగేశ్న భేటీ… విశాఖపై సిఫీ ఆసక్తి

కూటమి పాలనలో ఏపీకి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి గడచిన 7 నెలల్లోనే ఏపీకి రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో టాప్ టెక్ కంపెనీ ఏపీకి వచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఫార్చూన్ టాప్ 500 కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన సిఫీ టెక్ కంపెనీ.. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఈ మేరకు సిఫీ టెక్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు వేగేశ్న బుధవారం అమరావతికి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తో ఆయన భేటీ అయ్యారు.

ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై లోకేశ్, వేగేశ్నల మధ్య కీలక చర్చ జరిగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు… ఏపీలో టెక్నాలజీ రంగంలో సమృద్ధిగా ఉన్న మానవ వనరులు, ఏపీకి పెట్టని కోటగా ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం, విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై వేగేశ్నకు లోకేశ్ సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతేకాకుండా కొత్త రాష్ట్రంగా ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహం తదితరాలను కూడా ఆయనకు లోకేశ్ వివరించారు. సుదీర్ఘంగా సాగిన లోకేశ్ ప్రజెంటేషన్ పట్ల వేగేశ్న సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వేగేశ్న మాట్లాడుతూ… ఏపీలోని విశాఖలో తమ సంస్థకు చెందిన డేటా సెంటర్ ను ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తామని తెలిపారు. అంతేకాకుండా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు విశాఖ సరి అయిన ప్రదేశమన్న లోకేశ్ ప్రతిపాదనల పట్ల కూడా వేగేశ్న సానుకూలంగా స్పందించారు. విశాఖలో ఇప్పటికే టీసీఎస్ తన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా లోకేశ్ గుర్తు చేశారు. టీసీఎస్ తో పాటు త్వరలోనే విశాఖకు ప్రఖ్యాత ఐటీ కంపెనీలు కూడా రానున్న విషయాన్ని లోకేశ్ గుర్తు చేశారు. సిఫీ నుంచి కూడా భారీ పెట్టుబడులనే ఆశిస్తున్నట్లు లోకేశ్ చెప్పగా… అందుకు వేగేశ్న సానుకూలంగా స్పందించారు.

This post was last modified on February 12, 2025 9:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

34 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

8 hours ago