జనసేన నేత కిరణ్ రాయల్ పై రేగిన వివాదంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటూ ఉండటంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి నగరానికి చెందిన ఓ వివాహితతో రాయల్ వివాహేతర బంధం నెరపారని, ఆమె నుంచి భారీ ఎత్తున డబ్బు, నగలు తీసుకున్నారని ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారంలో తానే బాధితురాలిని అంటూ స్వయంగా లక్ష్మి అనే మహిళ మీడియా ముందుకు వచ్చి… రాయల్ ను వివాదంలోకి లాగేసింది. దీంతో రాయల్ ను కొంతకాలం పాటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ జనసేన అదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కిరణ్ రాయల్ పై వైసీపీ ఓ రేంజిలో విరుచుకుపడుతూ ఉంటే.. మంగళవారం లక్ష్మీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు. రాజస్థాన్ లోని జైపూర్ నుంచి వచ్చిన పోలీసులు ఓ కేసులో నిందితురాలిగా ఉన్నారని, ఆ కేసులో ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా తిరుపతి ప్రెస్ క్లబ్ సమీపంలోనే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను జైపూర్ తరలించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎప్పుడో 2021లో నమోదైన కేసులో లక్ష్మి నిందితురాలిగా ఉన్నారని, అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియరాలేదని, తాజాగా మీడియాలో ఆమె కనిపించడంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు వచ్చినట్టు జైపూర్ పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే… బుధవారం సాయంత్రం జైపూర్ కోర్టు లక్ష్మికి బెయిల్ మంజూరు చేసింది. ఓ చెక్ బౌన్స్ కు సంబంధించిన కేసు కావడంతో లక్ష్మి ఇలా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగానే… దానిపై విచారణ చేపట్టిన కోర్టు… అలా బెయిల్ మంజూరు చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం సబ్ జైలులో ఉన్న ఆమె… కోర్టు ఉత్తర్వులు అందగానే… ఆ ఉత్తర్వుల ప్రకారం న్యాయమూర్తి నిర్దేశించిన షరతుల మేర జామీను సమర్పించి జైలు నుంచి విడుదల కానున్నారు. అంటే… లక్ష్మి ఈ కేసులో ఒక్క రోజు కూడా పూర్తిగా జైలులో ఉండలేదన్న మాట. అయినా ఈ వ్యవహారం మాదిరే లక్ష్మి అరెస్ట్, బెయిల్ కూడా వెంటవెంటనే జరిగిపోవడం గమనార్హం.
This post was last modified on February 12, 2025 6:13 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…