జనసేన నేత కిరణ్ రాయల్ పై రేగిన వివాదంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటూ ఉండటంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి నగరానికి చెందిన ఓ వివాహితతో రాయల్ వివాహేతర బంధం నెరపారని, ఆమె నుంచి భారీ ఎత్తున డబ్బు, నగలు తీసుకున్నారని ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారంలో తానే బాధితురాలిని అంటూ స్వయంగా లక్ష్మి అనే మహిళ మీడియా ముందుకు వచ్చి… రాయల్ ను వివాదంలోకి లాగేసింది. దీంతో రాయల్ ను కొంతకాలం పాటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ జనసేన అదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కిరణ్ రాయల్ పై వైసీపీ ఓ రేంజిలో విరుచుకుపడుతూ ఉంటే.. మంగళవారం లక్ష్మీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు. రాజస్థాన్ లోని జైపూర్ నుంచి వచ్చిన పోలీసులు ఓ కేసులో నిందితురాలిగా ఉన్నారని, ఆ కేసులో ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా తిరుపతి ప్రెస్ క్లబ్ సమీపంలోనే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను జైపూర్ తరలించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎప్పుడో 2021లో నమోదైన కేసులో లక్ష్మి నిందితురాలిగా ఉన్నారని, అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియరాలేదని, తాజాగా మీడియాలో ఆమె కనిపించడంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు వచ్చినట్టు జైపూర్ పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే… బుధవారం సాయంత్రం జైపూర్ కోర్టు లక్ష్మికి బెయిల్ మంజూరు చేసింది. ఓ చెక్ బౌన్స్ కు సంబంధించిన కేసు కావడంతో లక్ష్మి ఇలా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగానే… దానిపై విచారణ చేపట్టిన కోర్టు… అలా బెయిల్ మంజూరు చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం సబ్ జైలులో ఉన్న ఆమె… కోర్టు ఉత్తర్వులు అందగానే… ఆ ఉత్తర్వుల ప్రకారం న్యాయమూర్తి నిర్దేశించిన షరతుల మేర జామీను సమర్పించి జైలు నుంచి విడుదల కానున్నారు. అంటే… లక్ష్మి ఈ కేసులో ఒక్క రోజు కూడా పూర్తిగా జైలులో ఉండలేదన్న మాట. అయినా ఈ వ్యవహారం మాదిరే లక్ష్మి అరెస్ట్, బెయిల్ కూడా వెంటవెంటనే జరిగిపోవడం గమనార్హం.
This post was last modified on February 12, 2025 6:13 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…