వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా… ఆరంటే ఆరు నిమిషాల్లోనే ఓ నిండు ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. అది కూడా ఎక్కడో రెండు, మూడు జిల్లాల ఆవల ఆ ప్రాణం ఆపదలో ఉంటే… అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుని ఏపీ పోలీసులు ఆ నిండు ప్రాణాన్ని కాపాడారు. ఈ ఘటనలో ఆత్మహత్యకు సిద్ధమైపోయిన ఓ వ్యక్తి… మరికాసేపు ఉంటే… ఓ లాడ్జిలోని గదిలో తిరుగుతున్న ఫ్యానుకు విగత జీవిగా వేలాడేవాడే.
అయితే ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ సమయస్ఫూర్తి, మరో సబ్ ఇన్ స్పెక్టర్ దూకుడు, ఓ కానిస్టేబుల్ వేగం.. ఆ వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టాయి. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ ఘటన కాకినాడ జిల్లాలోని అన్నవరంలో జరిగింది.
ఈ ఘటన వివరాల్లోకెళితే… ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన యువకుడు ఆర్థిక సమస్యలతో తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని అతడు తన కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసి… అన్నవరంలోని ఓ లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకునేందుకు సిద్ధపడ్డాడు. అప్పటికే అతడు ఉరేసుకునేందుకు ఫ్యానుకు తాడు కూడా సిద్ధం చేసుకున్నాడు.
అయితే ఆ యువకుడి కుటుంబం అతడి సెల్ఫీ వీడియో చూసి వెంటనే. పి.గన్నవరం సీఐ భీమరాజుకు సమాచారం ఇచ్చారు. ఈ వీడియోను చూసిన భీమరాజు.. ఎలాగైనా అతడిని కాపాడాల్సిందేనని తీర్మానించుకున్నారు. అనుకున్నదే తడవుగా… బాధితుడి సెల్ ఫోన్ సిగ్నల్ కోసం కానిస్టేబుల్ జాఫర్ ను రంగంలోకి దించారు.
సీఐ నుంచి వచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగిన టెక్నికల్ టీం సభ్యుడు జాఫర్.. బాధితుడు కాకినాడ జిల్లా అన్నవరంలో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అతడి మొబైల్ ఫోన్ చివరి లొకేషన్ ను కూడా సీఐకి చేరవేశారు. దీంతో అన్నవరం ఎస్సైగా ఉన్న శ్రీహరిని భీమరాజు అలెర్ట్ చేశారు. క్షణాల్లో రంగంలోకి దిగిపోయిన శ్రీహరి.. బాధితుడి లొకేషన్ ను తన సిబ్బందికి ఇచ్చి తాను కూడా లొకేషన్ కు వెళ్లారు.
ఆ లొకేషన్ లో లాడ్జీలు ఉండటం… వీడియోలో కూడా బ్యాక్ డ్రాప్ అంతా ఓ లాడ్జి రూం లాగా కనిపించడంతో లాడ్జీ ఓనర్ల గ్రూపులో సదరు వీడియోను అప్ లోడ్ చేసి వాకబు చేశారు. దీంతో సదరు లాడ్జి ఓనర్ వేగంగా స్పందించి… బాధితుడు ఉన్న గది తలుపులను బద్దలు కొట్టి అతడిని కాపాడారు. ఇదంతా కేవలం ఆరంటే ఆరు నిమిషాల్లో జరిగిపోయిందట.
This post was last modified on February 12, 2025 5:29 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…