Political News

అమరావతికి రూ.26 వేల కోట్లు వచ్చేసినట్టే!

ఏపీ నూతన రాజధాని అమరావతికి ఇక నిధుల కొరత అన్న మాట వినిపించదు. ఎందుకంటే… కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కేవలం 7 నెలల్లోనే.. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్లో ఏకంగా రూ.26 వేల కోట్లు అందివచ్చాయి. పలు ఆర్ధిక సంస్థల నుంచి నిధుల విడుదలకు ఆమోదం లభించిన వెంటనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజధాని పనులను ప్రారంభించేశారు. ప్రస్తుతం రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో మరింతగా వేగం పెరిగేలా మంగళవారం రాత్రి ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.

కూటమి సర్కారు అధికారం చేపట్టినంతనే.. సీఎం చంద్రబాబు తన పలుకుబడిని వినియోగించి కేంద్రం నుంచి రాజధానికి నిధులు వచ్చే దిశగా అడుగులు వేశారు. చంద్రబాబు యత్నాలు ఆదిలోనే మంచి ఫలితాలను ఇచ్చాయి. గత బడ్జెట్ లోనే కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల మేర ఋణం ఇప్పించే దిశగా ఓ కీలక ప్రకటన చేసింది. కేంద్రం గ్యారెంటీ ఇచ్చే ఈ నిధులను ఏపీకి ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అంతేకాకుండా… తనతో పాటుగా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో జతకట్టి వరల్డ్ బ్యాంకు రూ.15 వేల కోట్లను ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నిధులు ఇప్పటికే విడతల వారీగా విడుదల అయిపోతున్నాయి కూడా.

ఓ పక్క వరల్డ్ బ్యాంకు ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హడ్కో)తోనూ చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించి… రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.11 వేల కోట్ల ఋణం ఇచ్చేందుకు హడ్కో సమ్మతి తెలిపింది. ఈ రుణానికి సంబంధించిన మంజూరు పత్రాలు మంగళవారం ఏపీకి అందాయి. మంగళవారం అమరావతి వచ్చిన హడ్కో ప్రతినిధులు ఎస్.ఎం. శ్రీనివాస్, కె. విజయ్ కుమార్ రుణ మంజూరు పత్రాలను సీఆర్డీఏ కమీషనర్ కన్నబాబుకు అందజేశారు. అంటే… ఇప్పటిదాకా అమరావతి నిర్మాణం కోసం మంజూరు అయిన మొత్తం రూ.26 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందినట్టేనన్న మాట.

This post was last modified on February 12, 2025 2:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీఆర్ఎస్ తో పొత్తు.. మౌనం వీడిన బీజేపీ

బీఆర్ఎస్ తో బీజేపీకి చీకటి పొత్తు ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే, బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుందని…

9 minutes ago

పెద్దావిడ ఖాతాలో 50 కోట్ల బ్లాక్ బస్టర్

కాదేది కంటెంట్ కు అనర్హం అంటారు సినీ పెద్దలు. ఇది అక్షరాలా నిజం. డిజిటల్ యుగంలో కేవలం స్టార్ ఎలివేషన్లతోనే…

50 minutes ago

సడన్ ఎంట్రీ ఇవ్వనున్న జన నాయకుడు ?

సెన్సార్ వివాదం వల్ల మూడు నెలలుగా వాయిదా పర్వంలో నలిగిపోతున్న జన నాయకుడు విడుదల కోసం నిర్మాత శతవిధాలా ప్రయత్నాలు…

1 hour ago

ప్రపంచకప్.. భారత్ ఖాతాలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు!

అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ…

2 hours ago

పెద్ది బిజినెస్ టార్గెట్ అంత భారీగానా

ఏప్రిల్ 30 విడుదల కాబోతున్న పెద్ది బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. రెండు పాటలు ఛార్ట్ బస్టర్ కావడం, టీజర్ సంచలనం…

8 hours ago

ఆ దర్శకుడికి ఛాన్సిచ్చేదెవరు?

అనుదీప్ కేవీ.. ఐదేళ్ల ముందు ఈ పేరు ఒక సంచలనం. కొవిడ్ వల్ల కళ తప్పిన థియేటర్లలో సందడి తీసుకొచ్చి,…

11 hours ago