ఏపీ నూతన రాజధాని అమరావతికి ఇక నిధుల కొరత అన్న మాట వినిపించదు. ఎందుకంటే… కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కేవలం 7 నెలల్లోనే.. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్లో ఏకంగా రూ.26 వేల కోట్లు అందివచ్చాయి. పలు ఆర్ధిక సంస్థల నుంచి నిధుల విడుదలకు ఆమోదం లభించిన వెంటనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజధాని పనులను ప్రారంభించేశారు. ప్రస్తుతం రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో మరింతగా వేగం పెరిగేలా మంగళవారం రాత్రి ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.
కూటమి సర్కారు అధికారం చేపట్టినంతనే.. సీఎం చంద్రబాబు తన పలుకుబడిని వినియోగించి కేంద్రం నుంచి రాజధానికి నిధులు వచ్చే దిశగా అడుగులు వేశారు. చంద్రబాబు యత్నాలు ఆదిలోనే మంచి ఫలితాలను ఇచ్చాయి. గత బడ్జెట్ లోనే కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల మేర ఋణం ఇప్పించే దిశగా ఓ కీలక ప్రకటన చేసింది. కేంద్రం గ్యారెంటీ ఇచ్చే ఈ నిధులను ఏపీకి ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అంతేకాకుండా… తనతో పాటుగా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో జతకట్టి వరల్డ్ బ్యాంకు రూ.15 వేల కోట్లను ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నిధులు ఇప్పటికే విడతల వారీగా విడుదల అయిపోతున్నాయి కూడా.
ఓ పక్క వరల్డ్ బ్యాంకు ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హడ్కో)తోనూ చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించి… రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.11 వేల కోట్ల ఋణం ఇచ్చేందుకు హడ్కో సమ్మతి తెలిపింది. ఈ రుణానికి సంబంధించిన మంజూరు పత్రాలు మంగళవారం ఏపీకి అందాయి. మంగళవారం అమరావతి వచ్చిన హడ్కో ప్రతినిధులు ఎస్.ఎం. శ్రీనివాస్, కె. విజయ్ కుమార్ రుణ మంజూరు పత్రాలను సీఆర్డీఏ కమీషనర్ కన్నబాబుకు అందజేశారు. అంటే… ఇప్పటిదాకా అమరావతి నిర్మాణం కోసం మంజూరు అయిన మొత్తం రూ.26 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందినట్టేనన్న మాట.
This post was last modified on February 12, 2025 2:05 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…