బిహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నామినేషన్ ప్రక్రియ ఒక కొలిక్కి రావటమే కాదు.. ఏ పార్టీ నుంచి ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్నది చూసినప్పుడు షాకింగ్ గా మారింది. ఎందుకంటే.. తొలిదశలో బరిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన 1064 మంది అభ్యర్థుల్లో ఏకంగా 328 మంది మీద క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. అంతేకాదు.. వీరిలో 56 మంది మీద ఐదేళ్లు.. అంతకంటే ఎక్కువ జైలుశిక్ష్ పడే అవకాశం ఉన్న నాన్ బెయిలబుల్ కేసులు ఉండటం గమనార్హం.
నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లను మదింపు చేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఒక నివేదికను సిద్ధం చేసింది. ఇందులో బరిలో ఉన్న అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన అన్ని వివరాల్నిపొందుపర్చింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం అభ్యర్థుల్లో 29 మంది మీద మహిళల్ని వేధింపులకు గురి చేసిన కేసులు.. ముగ్గురుపై అత్యాచార కేసులు కూడా ఉండటం గమనార్హం.
ఇక.. హత్య నేర ఆరోపణలు ఉన్న వారు 21 మంది కాగా.. హత్యాయత్నం కేసులునమోదైన వారు 62 మంది ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. నేరస్తులకుటికెట్లు ఇవ్వకూడదన్న మాటను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. మైకుల ముందుకు వచ్చినప్పుడు నీతులు చెప్పే నేతలు కానీ వారి పార్టీలు కానీ గెలుపు అంశాల్ని మాత్రమే చూశాయే తప్పించి.. విలువల ఆధారంగా అభ్యర్థుల్నిఎంపిక చేయలేదన్న భావన కలుగక మానదు.
ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి నేరారోపణ ఉన్న అభ్యర్థుల లెక్కల్నిచూస్తే.. అందరికంటే ఎక్కువ కేసులున్న అభ్యర్థులు ఆర్జేడీలో ఉన్నారు. ఈ పార్టీతరఫున మొత్తం 52 మంది పోటీ చేస్తుంటే.. అందులో క్రిమినల్ కేసులు ఉన్న వారు 30 మంది.. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు 22 మంది ఉన్నారు.
ఆర్జేడీ తర్వాత ఆ తరహాలో నేర చరిత ఉన్న అభ్యర్థులు ఎల్జేపీ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 24 మందిపైక్రిమినల్ కేసులు.. 20 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. మూడో స్థానంలో బీజేపీ నిలిచింది.ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులు ఉంటే.. 13 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు ఉన్నారు. తర్వాతి స్థానంలో అధికార జేడీయూ అభ్యర్థులు ఉన్నారు. 25మందిక్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ కేసులు ఉన్నావారే. తర్వాతి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు నిలిచారు. మొత్తం 21 మంది క్రిమినల్స్ అభ్యర్థులుగా తేల్చారు. చివరిస్థానంలో బీఎస్పీ అభ్యర్థులు నిలిచారు. ప్రస్తుతం బరిలో ఉన్న వారిలో 13 మందిపై క్రిమినల్ రికార్డు ఉన్నట్లుగా గుర్తించారు.
This post was last modified on October 21, 2020 3:32 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…