Political News

నెక్స్ట్ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల వంతు!

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరగుతున్న దర్యాప్తు సంచలన పరిణామాలకు దారి తీయనుంది. అసలు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడనే లేదు అంటూ వైసీపీ నేతలు చెబుతున్నా… సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవలే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఈ నలుగురు కూడా మాములు వ్యక్తులు కాదు. తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థల యజమానులు. ప్రస్తుతం వీరి లింకులపై ద్రుష్టి సారించిన సిబిఐ అధికారులు.. ఆ లింకుల ఆధారంగా చర్యలకు సిద్ధం అవుతున్నారు.

సిబిఐ తీసుకునే తదుపరి చర్యల్లో భాగంగా టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పాలి. అదే సమయంలో టీటీడీలో ఏళ్ల తరబడి తిష్ట వేసి వైసీపీ నేతలు చెప్పినట్టుగా నడుచుకున్న టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అరెస్ట్ అయిన వారి కంపెనీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఇచ్చిన కారణంగా సుబ్బారెడ్డి, ధర్మా రెడ్డిలకు నోటీసులు జారీ కానున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే సుబ్బారెడ్డి, ధర్మా రెడ్డిలకు నోటీసులు ఇచ్చిన తర్వాత… సదరు నోటీసులకు వారిద్దరూ ఇచ్చే సమాధానాలను ఆధారం చేసుకుని తదుపరి చర్యలకు ఉపక్రమించాలి సిబిఐ యోచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా టీటీడీలో కీలక స్థానాల్లో పని చేస్తున్న ముగ్గురు అధికారుల అరెస్ట్ తప్పదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అరెస్టుల తర్వాత సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు అరెస్ట్ అయినా ఆశ్యర్యపోవాల్సిన పని లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Satya

Recent Posts

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

16 minutes ago

పుట్టినరోజు సంబరం… జన నాయకుడి మౌనం

ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…

28 minutes ago

రజినీకి నచ్చనిది కమల్‌కు నచ్చిందా?

తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…

1 hour ago

కాపులంటే వైసీపీలో ఉన్నొళ్లు మాత్రమేనా?

ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…

1 hour ago

సాయిపల్లవి చేసుంటే ఎలా ఉండేది

మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…

3 hours ago

తమిళ నటుడికి పిచ్చెక్కించేసిన కంచరపాలెం

స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్‌కు మంచి గుర్తింపే ఉంది.…

4 hours ago