తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరగుతున్న దర్యాప్తు సంచలన పరిణామాలకు దారి తీయనుంది. అసలు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడనే లేదు అంటూ వైసీపీ నేతలు చెబుతున్నా… సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవలే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఈ నలుగురు కూడా మాములు వ్యక్తులు కాదు. తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థల యజమానులు. ప్రస్తుతం వీరి లింకులపై ద్రుష్టి సారించిన సిబిఐ అధికారులు.. ఆ లింకుల ఆధారంగా చర్యలకు సిద్ధం అవుతున్నారు.
సిబిఐ తీసుకునే తదుపరి చర్యల్లో భాగంగా టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పాలి. అదే సమయంలో టీటీడీలో ఏళ్ల తరబడి తిష్ట వేసి వైసీపీ నేతలు చెప్పినట్టుగా నడుచుకున్న టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అరెస్ట్ అయిన వారి కంపెనీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఇచ్చిన కారణంగా సుబ్బారెడ్డి, ధర్మా రెడ్డిలకు నోటీసులు జారీ కానున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే సుబ్బారెడ్డి, ధర్మా రెడ్డిలకు నోటీసులు ఇచ్చిన తర్వాత… సదరు నోటీసులకు వారిద్దరూ ఇచ్చే సమాధానాలను ఆధారం చేసుకుని తదుపరి చర్యలకు ఉపక్రమించాలి సిబిఐ యోచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా టీటీడీలో కీలక స్థానాల్లో పని చేస్తున్న ముగ్గురు అధికారుల అరెస్ట్ తప్పదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అరెస్టుల తర్వాత సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు అరెస్ట్ అయినా ఆశ్యర్యపోవాల్సిన పని లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…