Political News

నెక్స్ట్ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల వంతు!

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరగుతున్న దర్యాప్తు సంచలన పరిణామాలకు దారి తీయనుంది. అసలు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడనే లేదు అంటూ వైసీపీ నేతలు చెబుతున్నా… సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవలే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఈ నలుగురు కూడా మాములు వ్యక్తులు కాదు. తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థల యజమానులు. ప్రస్తుతం వీరి లింకులపై ద్రుష్టి సారించిన సిబిఐ అధికారులు.. ఆ లింకుల ఆధారంగా చర్యలకు సిద్ధం అవుతున్నారు.

సిబిఐ తీసుకునే తదుపరి చర్యల్లో భాగంగా టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పాలి. అదే సమయంలో టీటీడీలో ఏళ్ల తరబడి తిష్ట వేసి వైసీపీ నేతలు చెప్పినట్టుగా నడుచుకున్న టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అరెస్ట్ అయిన వారి కంపెనీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఇచ్చిన కారణంగా సుబ్బారెడ్డి, ధర్మా రెడ్డిలకు నోటీసులు జారీ కానున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే సుబ్బారెడ్డి, ధర్మా రెడ్డిలకు నోటీసులు ఇచ్చిన తర్వాత… సదరు నోటీసులకు వారిద్దరూ ఇచ్చే సమాధానాలను ఆధారం చేసుకుని తదుపరి చర్యలకు ఉపక్రమించాలి సిబిఐ యోచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా టీటీడీలో కీలక స్థానాల్లో పని చేస్తున్న ముగ్గురు అధికారుల అరెస్ట్ తప్పదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అరెస్టుల తర్వాత సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు అరెస్ట్ అయినా ఆశ్యర్యపోవాల్సిన పని లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on February 11, 2025 5:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

50 minutes ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

4 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

4 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

7 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

8 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

8 hours ago