ఏపీ సీఎం చంద్రబాబు పాలన మధ్యతరగతికి పరిమితం అవుతోందా? ఆయన చేపడుతున్న కార్యక్రమాలు అన్నీ మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేలానే ఉన్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. కృత్రిమ మేథ(ఏఐ) నుంచి వాట్సాప్ పాలన వరకు, డిజిటల్ అక్షరాస్యత నుంచి డేటా వరకు.. ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా.. మధ్య తరగతి ప్రజలను ఉద్దేశించే చంద్రబాబు అడుగులు వేస్తున్నట్టు కనిపి స్తోందన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఎందుకిలా..?
ప్రస్తుతం రాష్ట్రంలో మధ్యతరగతి వర్గం.. 45 శాతానికి పైగానే ఉంది. మధ్యతరగతి అంటే.. నెలకు 25-50 వేల రూపాయల వేతనం.. ఆపైన మరో 20 నుంచి 40 వేల మధ్య అందుకునే వారంతామధ్యతరగతి వర్గా లే. వీరంతా అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. అదేసమయంలో పాలనను కూడా డిజిటలీకరణను కోరుకుంటున్నారు. ఇంట్లో కూర్చునో.. ఆఫీసుల్లో కూర్చునో సొంత పనులు చక్కబెట్టుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. వీరిని చంద్రబాబు టార్గెట్ చేశారు.
అంతేకాదు.. వచ్చే రెండేళ్లలో వేతనాలు మరింత పెరగనున్నాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాల్లో వేతనాలు సుమారు రూ.లక్ష వరకు చేరే అవకాశం ఉంది. ఇక, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు అయితే.. అది ప్రైవేటు కావొచ్చు.. ప్రభుత్వం కావొచ్చు.. వారి ఆదాయాలు మరింత పెరుగుతాయి. దీంతో వీరి సంఖ్య కూడా.. పెరుగుతుంది. అప్పుడు ఏకంగా మధ్యతరగతి ప్రజలు 60 శాతానికి పైగా చేరే అవకాశం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.
ఈ పరిణామాలను ముందుగానే అంచనా వేసిన చంద్రబాబు మధ్యతరగతిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫలితంగా ఉచితాల కన్నా.. కూడా అభివృద్ధిపై ఎక్కువగా ఫోకస్ పెట్టినా.. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం సులువు అవుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే విజన్ 2047, డిజిటల్ పాలన, వాట్సాప్ పాలన, డ్రోన్లు, ఏఐ అంటూ.. డిజిటలీకరణ దిశగా ఆయన అడుగులు అడుగులు వేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
This post was last modified on February 11, 2025 1:35 pm
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…