Political News

బాబు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి మంత్రం.. 2029 అప్పుడే టార్గెట్ ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌న మ‌ధ్య‌త‌ర‌గ‌తికి ప‌రిమితం అవుతోందా? ఆయ‌న చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు అన్నీ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేలానే ఉన్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కృత్రిమ మేథ‌(ఏఐ) నుంచి వాట్సాప్ పాల‌న వ‌ర‌కు, డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త నుంచి డేటా వ‌ర‌కు.. ఇలా ఏ విష‌యాన్ని తీసుకున్నా.. మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించే చంద్ర‌బాబు అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపి స్తోంద‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ఎందుకిలా..?
ప్ర‌స్తుతం రాష్ట్రంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం.. 45 శాతానికి పైగానే ఉంది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి అంటే.. నెల‌కు 25-50 వేల రూపాయ‌ల వేతనం.. ఆపైన మరో 20 నుంచి 40 వేల మ‌ధ్య‌ అందుకునే వారంతామ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గా లే. వీరంతా అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. అదేస‌మ‌యంలో పాల‌న‌ను కూడా డిజిట‌లీక‌ర‌ణ‌ను కోరుకుంటున్నారు. ఇంట్లో కూర్చునో.. ఆఫీసుల్లో కూర్చునో సొంత‌ ప‌నులు చ‌క్క‌బెట్టుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. వీరిని చంద్ర‌బాబు టార్గెట్ చేశారు.

అంతేకాదు.. వ‌చ్చే రెండేళ్ల‌లో వేత‌నాలు మ‌రింత పెర‌గ‌నున్నాయి. దీంతో మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల్లో వేత‌నాలు సుమారు రూ.ల‌క్ష వ‌ర‌కు చేరే అవ‌కాశం ఉంది. ఇక‌, భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ ఉద్యోగులు అయితే.. అది ప్రైవేటు కావొచ్చు.. ప్ర‌భుత్వం కావొచ్చు.. వారి ఆదాయాలు మ‌రింత పెరుగుతాయి. దీంతో వీరి సంఖ్య కూడా.. పెరుగుతుంది. అప్పుడు ఏకంగా మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌లు 60 శాతానికి పైగా చేరే అవ‌కాశం ఉంటుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

ఈ పరిణామాల‌ను ముందుగానే అంచ‌నా వేసిన చంద్ర‌బాబు మ‌ధ్య‌త‌ర‌గ‌తిని మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఫ‌లితంగా ఉచితాల క‌న్నా.. కూడా అభివృద్ధిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం సులువు అవుతుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే విజ‌న్ 2047, డిజిట‌ల్ పాల‌న‌, వాట్సాప్ పాల‌న‌, డ్రోన్లు, ఏఐ అంటూ.. డిజిటలీక‌ర‌ణ దిశ‌గా ఆయ‌న అడుగులు అడుగులు వేస్తున్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

This post was last modified on February 11, 2025 1:35 pm

Share

Recent Posts

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

44 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

52 minutes ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

3 hours ago