వైసీపీ నాయకులు కొందరు.. పార్టీ అధినేత జగన్ లేఖ సంధించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు పొక్కింది. పార్టీ తరఫున పోరాడేందుకు తమకు కొంత సమయం కావాలని.. ఇప్పటికిప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదని వారు కుండబద్దలు కొట్టి చెప్పినట్టు సమాచారం. ప్రజల మధ్యకు వెళ్లేందుకు చాలానే సమయం ఉందని.. ప్రస్తుతం ఇంకా కూటమి సర్కారుపై మనం అనుకుంటున్న స్థాయిలో వ్యతిరేకత పెల్లుబుకలేదని కూడా వారు పేర్కొన్నారట.
అయితే.. ఈ లేఖ ఏజిల్లాకు చెందిన నాయకులు రాశారనేది మాత్రం అత్యంత గోప్యంగా ఉంచుతున్నా రు. ఇటీవల లండన్ నుంచి వచ్చిన జగన్.. పలు జిల్లాలకు చెందిన నాయకులను పిలిచి.. సమావేశం పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రజల మద్యకు రావాలని.. ప్రజలతో కలవాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని.. దానిని మనకు అనుకూలంగా మార్చుకోవలని కూడా జగన్ దిశానిర్దేశం చేశారు.
అయితే.. తాను ప్రజల్లోకి వచ్చేందుకు సమయం పడుతుందని కూడా ఆ సమావేశాల్లోనే జగన్ వెల్లడించా రు. ఇక, మీడియాతోనూ జగన్ ఇదే చెప్పారు. తాను వచ్చేందుకు సమయం పడుతుందన్నారు. అయితే.. ఈ లోగా పార్టీతరఫున తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కానీ, ఈ విషయంలో పార్టీ నాయకుల అభిప్రాయం వేరేగా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగకుండా చేపట్టే ఏకార్యక్రమం కూడా.. ఫలితం ఇవ్వబోదని అంటున్నారు. అయితే.. ఈ విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి.
వ్యతిరేకత పెరిగిందని తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల వైసీపీ నాయకులు చెబుతున్నట్టు తెలిసింది. కానీ, ఇతర జిల్లాల వారు మాత్రం ఇంకా సమయం తీసుకుంటేనే బెటర్ అన్నారు. అయితే.. గత ఎన్నికల్లోనూ తూర్పు, పశ్చిమ, గుంటూరు నేతలు చెప్పిన మాటలే నమ్మారన్న.. వివాదం కూడా వినిపించింది. ఇదే పార్టీని ఓటమి దిశగా నడిపించిందని.. ఇతర జిల్లాల నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు వ్యతిరేతక లేనందున.. వచ్చినా ప్రయోజనం లేదని అంటున్నారు.
అందుకు బయటకు వచ్చేందుకు.. పోరాటాలు చేసేందుకు.. తమకు కొంతసమయం కావాలని కోరుతూ.. రెండు జిల్లాలకు చెందిన నాయకుల నుంచి నాలుగు ఉత్తరాలు చేరాయని వైసీపీ కార్యాలయంలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిని జగన్ ఏ కోణంలో చూస్తారో చూడాలి. దీనిని వ్యతిరేకతగా భావిస్తారో.. లేక.. సానుకూలంగా తీసుకుంటారో అనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on February 11, 2025 1:29 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…