Political News

ఇప్ప‌ట్లో బ‌య‌ట‌కు రాలేం.. వైసీపీ నేత‌ల సంచ‌ల‌న లేఖ‌.. !

వైసీపీ నాయ‌కులు కొంద‌రు.. పార్టీ అధినేత జ‌గ‌న్ లేఖ సంధించిన‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా బ‌య‌ట‌కు పొక్కింది. పార్టీ త‌ర‌ఫున పోరాడేందుకు త‌మ‌కు కొంత స‌మ‌యం కావాల‌ని.. ఇప్ప‌టికిప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని వారు కుండ‌బ‌ద్ద‌లు కొట్టి చెప్పిన‌ట్టు స‌మాచారం. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లేందుకు చాలానే స‌మ‌యం ఉంద‌ని.. ప్ర‌స్తుతం ఇంకా కూట‌మి స‌ర్కారుపై మ‌నం అనుకుంటున్న స్థాయిలో వ్య‌తిరేక‌త పెల్లుబుక‌లేద‌ని కూడా వారు పేర్కొన్నార‌ట‌.

అయితే.. ఈ లేఖ ఏజిల్లాకు చెందిన నాయ‌కులు రాశార‌నేది మాత్రం అత్యంత గోప్యంగా ఉంచుతున్నా రు. ఇటీవ‌ల లండ‌న్ నుంచి వ‌చ్చిన జ‌గ‌న్‌.. ప‌లు జిల్లాలకు చెందిన నాయ‌కుల‌ను పిలిచి.. స‌మావేశం పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ద్య‌కు రావాల‌ని.. ప్ర‌జ‌ల‌తో క‌ల‌వాల‌ని నాయకుల‌కు దిశానిర్దేశం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత పెరిగిపోయింద‌ని.. దానిని మ‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌ల‌ని కూడా జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.

అయితే.. తాను ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని కూడా ఆ స‌మావేశాల్లోనే జ‌గ‌న్‌ వెల్ల‌డించా రు. ఇక‌, మీడియాతోనూ జ‌గ‌న్ ఇదే చెప్పారు. తాను వ‌చ్చేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. అయితే.. ఈ లోగా పార్టీత‌ర‌ఫున త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌న్నారు. కానీ, ఈ విష‌యంలో పార్టీ నాయ‌కుల అభిప్రాయం వేరేగా ఉంది. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెర‌గ‌కుండా చేప‌ట్టే ఏకార్య‌క్ర‌మం కూడా.. ఫ‌లితం ఇవ్వ‌బోద‌ని అంటున్నారు. అయితే.. ఈ విష‌యంలో కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి.

వ్య‌తిరేక‌త పెరిగిందని తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి, గుంటూరు జిల్లాల వైసీపీ నాయ‌కులు చెబుతున్న‌ట్టు తెలిసింది. కానీ, ఇత‌ర జిల్లాల వారు మాత్రం ఇంకా స‌మ‌యం తీసుకుంటేనే బెట‌ర్ అన్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లోనూ తూర్పు, ప‌శ్చిమ‌, గుంటూరు నేత‌లు చెప్పిన మాట‌లే న‌మ్మార‌న్న‌.. వివాదం కూడా వినిపించింది. ఇదే పార్టీని ఓట‌మి దిశ‌గా న‌డిపించింద‌ని.. ఇత‌ర జిల్లాల నాయ‌కులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు వ్య‌తిరేత‌క లేనందున‌.. వ‌చ్చినా ప్ర‌యోజ‌నం లేద‌ని అంటున్నారు.

అందుకు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు.. పోరాటాలు చేసేందుకు.. త‌మ‌కు కొంత‌స‌మ‌యం కావాల‌ని కోరుతూ.. రెండు జిల్లాలకు చెందిన నాయ‌కుల నుంచి నాలుగు ఉత్త‌రాలు చేరాయ‌ని వైసీపీ కార్యాల‌యంలోని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి దీనిని జ‌గ‌న్ ఏ కోణంలో చూస్తారో చూడాలి. దీనిని వ్య‌తిరేక‌త‌గా భావిస్తారో.. లేక‌.. సానుకూలంగా తీసుకుంటారో అనేది ఆస‌క్తిగా మారింది.

This post was last modified on February 11, 2025 1:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

3 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

8 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

9 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

9 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

9 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

10 hours ago