Political News

నేత‌ల కొర‌త తీర్చేలా.. జన‌సేన అడుగులు ..!

జ‌న‌సేన‌లో నాయ‌కుల కొర‌త తీవ్రంగానే ఉంది. పైకి క‌నిపిస్తున్న వారంతా ప‌నిచేయ‌డానికి త‌క్కువ‌.. వివాదాలు సృష్టించేందుకు ఎక్కువ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో జ‌న‌సేన‌లో క్షేత్ర‌స్థాయి నాయ‌కుల బ‌లం త‌క్కువ‌గా ఉంది. ఇక‌, కార్య‌క‌ర్త‌ల విషయానికి వ‌స్తే.. సినీ మెగా అభిమానులే మెజారిటీ కార్య‌క‌ర్తలుగా ఉన్నారు. దీంతో జ‌న‌సేన‌కు నాయ‌కుల కొర‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ ప‌రిస్థితి.. ఇప్ప‌టికిప్పుడు రాజ‌కీయంగా ఇబ్బందులు లేక‌పోయినా.. మున్ముందు స‌మ‌స్య‌గా మారే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ జ‌న‌సేన గెలిచేందుకు పార్టీ అధినేత ప‌వ‌న్ ఇమేజ్ ప‌నిచేసింది. దీనిలో ఎలంటి సందేహం లేదు. అయితే.. సినీ గ్లామ‌ర్ ఉన్నంత వ‌ర‌కు బాగానే ఉంటుంది. అది కూడా యువ‌త వ‌ర‌కు ఓకే.. కానీ.. మున్ముందు.. ఇదే గ్లామ‌ర్‌తో మొత్తం పార్టీని న‌డిపించ‌డం ఇబ్బందే. ఒక‌ప్పుడు అన్న ఎన్టీఆర్ కూడా సినీ గ్లామ‌ర్‌తోనే నెట్టుకొచ్చారు. తొలిసారి అధికారంలోకి రావ‌డానికి ఆయ‌న సినీ ఇమేజ్ ప‌నిచేసింది.

కానీ, త‌ర్వాత త‌ర్వాత‌.. పాల‌న‌పై అంచ‌నాకు వ‌చ్చిన ప్ర‌జ‌లు దూరం జ‌రుగుతూ వ‌చ్చారు. అప్పుడు కూడా.. అన్న‌గారు ఒక‌వైపు పాలిస్తూనే మ‌రోవైపు సినిమాలు చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఓట‌మిని చ‌వి చూసిన విష‌యం తెలిసిందే. ఇక‌, త‌మిళ‌నాడులో కూడా సినీ గ్లామ‌ర్ కొంత వ‌ర‌కే ప‌నిచేసింది. క‌మ‌ల్ హాస‌న్ వంటి విశ్వ‌న‌టులు పార్టీ పెట్టినా.. ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ఇది అంద‌రు న‌టుల‌కు వ‌ర్తించేదే. ఈ ప్రాతిప‌దిక‌న తీసుకుంటే.. ఇప్పుడు కాక‌పోయినా.. వ‌చ్చే ప‌దేళ్ల‌కు జ‌న‌సేన కు కార్య‌క‌ర్త‌ల బ‌లం చాలా అవ‌స‌రం.

దీనిపై తాజాగా అధ్య‌య‌నం కూడా జ‌రిగింది. క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌లాబ‌లాల‌ పై అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. పైకి నాయ‌కులు క‌నిపిస్తున్నా.. క్షేత్ర‌స్థాయిలో బ‌లం త‌క్కువ‌గా ఉంద‌ని.. పార్టీ వాయిస్ వినిపించేవారు త‌క్కువ సంఖ్య‌లో ఉన్నార‌ని ఆయ‌న గ్ర‌హించారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఆరు మాసాల్లో మెరిక‌ల్లాంటి యువ‌త‌ను ఎంపిక చేసి.. వారికి రాజ‌కీయ శిక్ష‌ణ త‌ర‌గతులు నిర్వ‌హించ‌డం ద్వారా..బ‌ల‌మైన నాయ‌క‌త్వాన్ని త‌యారు చేయాల‌ని యోచిస్తున్న‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి.

This post was last modified on March 25, 2025 11:31 am

Share
Show comments
Published by
Satya
Tags: Janasena

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

42 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago