Political News

‘తాళం` తీసేవారు లేరు.. వైసీపీ ఏం చేస్తుంది?

ఔను.. నిజ‌మే! ఏపీలో వైనాట్ 175 నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ్లిన వైసీపీ.. కేవ‌లం 11 స్థానాల‌కే ప‌రిమితమైంది. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసింది. ఊహించ‌ని ప‌రాజ‌యం… పార్టీ అధినేత జ‌గ‌న్ వేసుకున్న లెక్క‌లు దారి త‌ప్ప‌డం తెలిసిందే. అయితే..ఈ ప్ర‌భావం.. పార్టీ నాయ‌కుల‌పై భారీగానే ప్ర‌భావం చూపించింది. ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకోవ‌డం లేదంటూ.. జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగిన నాయ‌కులు ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే అనేక మంది నాయ‌కులు పార్టీకి దూరంగా ఉన్నారు. మ‌రికొంద‌రు పార్టీ మారారు. ఇక‌, చాలా మంది పార్టీలోనే ఉన్నా.. కార్య‌క్ర‌మాల‌కు కూడా హాజ‌రు కావ‌డం లేదు. దీంతో సుమారు 50కి పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ కార్యాల‌యాల‌కు తాళాలు తీసేవారు కూడా క‌రువ‌య్యారు. పార్టీ అధికారంలో ఉండ‌గా.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్య‌లో పార్టీకి కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేసుకుంది. దీనికిగాను ప్రభుత్వ భూముల‌ను కూడా కేటాయించుకున్నారనే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఆయా కార్యాల‌యాల‌కు కేటాయించిన స్థ‌లాలు.. నిర్మాణాల్లో జ‌రిగిన అవినీతి.. వంటి వాటిపై కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత కేసులు కూడా పెట్టారు. కొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్న‌వాటిని నిలుపుద‌ల చేయించారు. అయితే.. వైసీపీ హుటాహుటిన కోర్టును ఆశ్ర‌యించి.. వాటిపై స్టే తెచ్చుకుంది. ఇది నాణేనికి ఒక‌వైపు. అయితే..ఇప్పుడు అస‌లు కార్యాల‌యాల‌కు ఉన్న తాళాలు కూడా తెరిచే వారు లేకుండా పోయారు. విజ‌య‌వాడ‌, గుంటూరు, ప‌ల్నాడు, శ్రీకాకుళం, తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, ఎన్టీఆర్ జిల్లా, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, ప‌శ్చిమ‌, తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఎక్క‌డా నాయ‌కులు.. పార్టీ కార్యాల‌యాల‌కు రావ‌డం లేదు. క‌నీసం కార్య‌క‌ర్త‌ల‌తోనూ భేటీ కావ‌డం లేదు. ఈ ప‌రిణామాలు.. కూట‌మి స‌ర్కారుకు ద‌న్నుగా మారాయి. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. మంత్రి డోలా బాల వీరాంజ‌నేయస్వామి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఆఫీసుల‌కు టూలెట్ బోర్డులు(అద్దెకు ఇవ్వ‌బ‌డు ను) వేలాడ‌దీసే రోజులు త్వ‌ర‌లోనే రానున్నాయి అని ఆయ‌న వ్యాఖ్యానించారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఇది వాస్త‌వ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా.. చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోని వైసీపీ ఆఫీసు ఇప్పుడు టిఫెన్ సెంట‌ర్‌గా మారిన విష‌యం తెలిసిందే.

This post was last modified on March 25, 2025 11:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

1 hour ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

1 hour ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

5 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

6 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

7 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

7 hours ago