Political News

‘తాళం` తీసేవారు లేరు.. వైసీపీ ఏం చేస్తుంది?

ఔను.. నిజ‌మే! ఏపీలో వైనాట్ 175 నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ్లిన వైసీపీ.. కేవ‌లం 11 స్థానాల‌కే ప‌రిమితమైంది. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసింది. ఊహించ‌ని ప‌రాజ‌యం… పార్టీ అధినేత జ‌గ‌న్ వేసుకున్న లెక్క‌లు దారి త‌ప్ప‌డం తెలిసిందే. అయితే..ఈ ప్ర‌భావం.. పార్టీ నాయ‌కుల‌పై భారీగానే ప్ర‌భావం చూపించింది. ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకోవ‌డం లేదంటూ.. జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగిన నాయ‌కులు ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే అనేక మంది నాయ‌కులు పార్టీకి దూరంగా ఉన్నారు. మ‌రికొంద‌రు పార్టీ మారారు. ఇక‌, చాలా మంది పార్టీలోనే ఉన్నా.. కార్య‌క్ర‌మాల‌కు కూడా హాజ‌రు కావ‌డం లేదు. దీంతో సుమారు 50కి పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ కార్యాల‌యాల‌కు తాళాలు తీసేవారు కూడా క‌రువ‌య్యారు. పార్టీ అధికారంలో ఉండ‌గా.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్య‌లో పార్టీకి కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేసుకుంది. దీనికిగాను ప్రభుత్వ భూముల‌ను కూడా కేటాయించుకున్నారనే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఆయా కార్యాల‌యాల‌కు కేటాయించిన స్థ‌లాలు.. నిర్మాణాల్లో జ‌రిగిన అవినీతి.. వంటి వాటిపై కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత కేసులు కూడా పెట్టారు. కొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్న‌వాటిని నిలుపుద‌ల చేయించారు. అయితే.. వైసీపీ హుటాహుటిన కోర్టును ఆశ్ర‌యించి.. వాటిపై స్టే తెచ్చుకుంది. ఇది నాణేనికి ఒక‌వైపు. అయితే..ఇప్పుడు అస‌లు కార్యాల‌యాల‌కు ఉన్న తాళాలు కూడా తెరిచే వారు లేకుండా పోయారు. విజ‌య‌వాడ‌, గుంటూరు, ప‌ల్నాడు, శ్రీకాకుళం, తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, ఎన్టీఆర్ జిల్లా, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, ప‌శ్చిమ‌, తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఎక్క‌డా నాయ‌కులు.. పార్టీ కార్యాల‌యాల‌కు రావ‌డం లేదు. క‌నీసం కార్య‌క‌ర్త‌ల‌తోనూ భేటీ కావ‌డం లేదు. ఈ ప‌రిణామాలు.. కూట‌మి స‌ర్కారుకు ద‌న్నుగా మారాయి. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. మంత్రి డోలా బాల వీరాంజ‌నేయస్వామి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఆఫీసుల‌కు టూలెట్ బోర్డులు(అద్దెకు ఇవ్వ‌బ‌డు ను) వేలాడ‌దీసే రోజులు త్వ‌ర‌లోనే రానున్నాయి అని ఆయ‌న వ్యాఖ్యానించారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఇది వాస్త‌వ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా.. చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోని వైసీపీ ఆఫీసు ఇప్పుడు టిఫెన్ సెంట‌ర్‌గా మారిన విష‌యం తెలిసిందే.

This post was last modified on March 25, 2025 11:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

4 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

6 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

6 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

7 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

8 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

9 hours ago