Political News

‘తాళం` తీసేవారు లేరు.. వైసీపీ ఏం చేస్తుంది?

ఔను.. నిజ‌మే! ఏపీలో వైనాట్ 175 నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ్లిన వైసీపీ.. కేవ‌లం 11 స్థానాల‌కే ప‌రిమితమైంది. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసింది. ఊహించ‌ని ప‌రాజ‌యం… పార్టీ అధినేత జ‌గ‌న్ వేసుకున్న లెక్క‌లు దారి త‌ప్ప‌డం తెలిసిందే. అయితే..ఈ ప్ర‌భావం.. పార్టీ నాయ‌కుల‌పై భారీగానే ప్ర‌భావం చూపించింది. ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకోవ‌డం లేదంటూ.. జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగిన నాయ‌కులు ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే అనేక మంది నాయ‌కులు పార్టీకి దూరంగా ఉన్నారు. మ‌రికొంద‌రు పార్టీ మారారు. ఇక‌, చాలా మంది పార్టీలోనే ఉన్నా.. కార్య‌క్ర‌మాల‌కు కూడా హాజ‌రు కావ‌డం లేదు. దీంతో సుమారు 50కి పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ కార్యాల‌యాల‌కు తాళాలు తీసేవారు కూడా క‌రువ‌య్యారు. పార్టీ అధికారంలో ఉండ‌గా.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్య‌లో పార్టీకి కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేసుకుంది. దీనికిగాను ప్రభుత్వ భూముల‌ను కూడా కేటాయించుకున్నారనే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఆయా కార్యాల‌యాల‌కు కేటాయించిన స్థ‌లాలు.. నిర్మాణాల్లో జ‌రిగిన అవినీతి.. వంటి వాటిపై కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత కేసులు కూడా పెట్టారు. కొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్న‌వాటిని నిలుపుద‌ల చేయించారు. అయితే.. వైసీపీ హుటాహుటిన కోర్టును ఆశ్ర‌యించి.. వాటిపై స్టే తెచ్చుకుంది. ఇది నాణేనికి ఒక‌వైపు. అయితే..ఇప్పుడు అస‌లు కార్యాల‌యాల‌కు ఉన్న తాళాలు కూడా తెరిచే వారు లేకుండా పోయారు. విజ‌య‌వాడ‌, గుంటూరు, ప‌ల్నాడు, శ్రీకాకుళం, తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, ఎన్టీఆర్ జిల్లా, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, ప‌శ్చిమ‌, తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఎక్క‌డా నాయ‌కులు.. పార్టీ కార్యాల‌యాల‌కు రావ‌డం లేదు. క‌నీసం కార్య‌క‌ర్త‌ల‌తోనూ భేటీ కావ‌డం లేదు. ఈ ప‌రిణామాలు.. కూట‌మి స‌ర్కారుకు ద‌న్నుగా మారాయి. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. మంత్రి డోలా బాల వీరాంజ‌నేయస్వామి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఆఫీసుల‌కు టూలెట్ బోర్డులు(అద్దెకు ఇవ్వ‌బ‌డు ను) వేలాడ‌దీసే రోజులు త్వ‌ర‌లోనే రానున్నాయి అని ఆయ‌న వ్యాఖ్యానించారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఇది వాస్త‌వ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా.. చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోని వైసీపీ ఆఫీసు ఇప్పుడు టిఫెన్ సెంట‌ర్‌గా మారిన విష‌యం తెలిసిందే.

This post was last modified on March 25, 2025 11:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గ‌ద్ద‌ర్ అవార్డుల్లో గందరగోళం.. ఏం జరిగింది?

గ‌త ఏడాది ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను మొద‌లుపెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఒకేసారి చాలా ఏళ్ల‌కు క‌లిపి అవార్డులు ప్ర‌క‌టించిన సంగ‌తి…

2 hours ago

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

5 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

9 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

9 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

9 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

10 hours ago