తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు సీఎం చంద్రబాబు కంటే.. ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఏపీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు కొన్ని రోజులు తెలంగాణ పై దృష్టి పెట్టారు. తెలంగాణలోనూ పార్టీని పుంజుకునేలా చేస్తామని చెప్పారు. వీకెండ్స్లో అక్కడకు వెళ్లి ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. దీంతో అంతో ఇంతో జోష్ వచ్చినట్టు అయింది. కానీ.. ఏపీలో పాలన పుంజుకోవడంతో బాబు బిజీ అయ్యారు.
దీంతో తెలంగాణ పై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టలేక పోయారు. కానీ, మరోవైపు.. పుంజుకునేందుకు అవకాశం ఉందన్న చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ హడావుడి చేస్తున్నా.. మాజీ సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారు. దీంతో కేటీఆర్, హరీష్ రావుల హడావుడి కనిపిస్తోంది. కానీ, ఇది జిల్లాల కేంద్రాలకు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ .. తిరిగి పుంజుకునేలోగానే టీడీపీని పరుగులు పెట్టించడం ద్వారా.. సక్సెస్ కావాలన్నది లోకేష్ వ్యూహం.
ఈ నేపథ్యంలో రాబిన్ శర్మ బృందానికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నా యి. మరోవైపు.. రాజకీయ వ్యూహకర్త, సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న ప్రశాంత్ కిశోర్తోనూ నారా లోకేష్ తాజాగా భేటీ అయ్యారు. ఈ పరిణామాలను గమనిస్తే.. అత్యంత వేగంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారన్నది వాస్తవమేనని తెలుస్తోంది. అయితే.. నారా లోకేష్ భావిస్తున్న ట్టు టీడీపీని విస్తరించాలంటే.. చాలా కష్టపడాల్సి ఉంటుంది.
పోయిన నేతలను తిరిగి తీసుకురావడంతోపాటు.. జీరో స్థాయి నుంచి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ఇదే సమయంలో ఏపీ-తెలంగాణ మధ్య వివాదంగా ఉన్న జల వనరుల విషయం, ఆస్తుల పంపకాలు.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విలీన మండలాల విషయం వంటివాటికి సమాధానం చెప్పాలి. అయితే.. ప్రయత్నిస్తే.. కొండైనా కరుగుతుందన్న సామెత మాదిరిగా..అసలు ప్రజల్లోకి వెళ్లడం అంటూ ప్రారంభమైతే.. టీడీపీకి జోష్ పెరుగుతుందనే ఆశాభావం పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక, పార్టీ తెలంగాణ అధ్యక్షుడి నియామకం కూడా వేచి ఉండడం గమనార్హం.
This post was last modified on February 9, 2025 4:35 pm
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…