తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు సీఎం చంద్రబాబు కంటే.. ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఏపీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు కొన్ని రోజులు తెలంగాణ పై దృష్టి పెట్టారు. తెలంగాణలోనూ పార్టీని పుంజుకునేలా చేస్తామని చెప్పారు. వీకెండ్స్లో అక్కడకు వెళ్లి ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. దీంతో అంతో ఇంతో జోష్ వచ్చినట్టు అయింది. కానీ.. ఏపీలో పాలన పుంజుకోవడంతో బాబు బిజీ అయ్యారు.
దీంతో తెలంగాణ పై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టలేక పోయారు. కానీ, మరోవైపు.. పుంజుకునేందుకు అవకాశం ఉందన్న చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ హడావుడి చేస్తున్నా.. మాజీ సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారు. దీంతో కేటీఆర్, హరీష్ రావుల హడావుడి కనిపిస్తోంది. కానీ, ఇది జిల్లాల కేంద్రాలకు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ .. తిరిగి పుంజుకునేలోగానే టీడీపీని పరుగులు పెట్టించడం ద్వారా.. సక్సెస్ కావాలన్నది లోకేష్ వ్యూహం.
ఈ నేపథ్యంలో రాబిన్ శర్మ బృందానికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నా యి. మరోవైపు.. రాజకీయ వ్యూహకర్త, సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న ప్రశాంత్ కిశోర్తోనూ నారా లోకేష్ తాజాగా భేటీ అయ్యారు. ఈ పరిణామాలను గమనిస్తే.. అత్యంత వేగంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారన్నది వాస్తవమేనని తెలుస్తోంది. అయితే.. నారా లోకేష్ భావిస్తున్న ట్టు టీడీపీని విస్తరించాలంటే.. చాలా కష్టపడాల్సి ఉంటుంది.
పోయిన నేతలను తిరిగి తీసుకురావడంతోపాటు.. జీరో స్థాయి నుంచి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ఇదే సమయంలో ఏపీ-తెలంగాణ మధ్య వివాదంగా ఉన్న జల వనరుల విషయం, ఆస్తుల పంపకాలు.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విలీన మండలాల విషయం వంటివాటికి సమాధానం చెప్పాలి. అయితే.. ప్రయత్నిస్తే.. కొండైనా కరుగుతుందన్న సామెత మాదిరిగా..అసలు ప్రజల్లోకి వెళ్లడం అంటూ ప్రారంభమైతే.. టీడీపీకి జోష్ పెరుగుతుందనే ఆశాభావం పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక, పార్టీ తెలంగాణ అధ్యక్షుడి నియామకం కూడా వేచి ఉండడం గమనార్హం.
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…