Political News

చంద్ర‌బాబు ‘ర్యాంకులు’.. కూట‌మి హ్యాపీయేనా.. ?

కూట‌మి స‌ర్కారు మంత్రి వ‌ర్గ ప‌నితీరుపై సీఎం చంద్ర‌బాబు మార్కులు వేసేశారు. మంత్రుల‌కు ర్యాంకు లు కూడా ప్ర‌క‌టించారు. అయితే.. ఈ ర్యాంకుల వ్య‌వ‌హారంకొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌చ్చినా.. ఊహించిన దానికి భిన్నంగా ఉండ‌డంతో అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌నే చెప్పాలి. వాస్త‌వానికి మంత్రి నారా లోకేష్‌, సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రులు నాదెండ్ల మ‌నోహ‌ర్‌, సత్య‌కుమార్‌, సంజీవ‌రెడ్డిగారి స‌విత, వంగ‌ల‌పూడి అనిత‌ వంటివారు ప్ర‌జ‌ల్లో దూకుడుగాఉన్నారు.

నిరంత‌రం ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. వారి వారి శాఖ‌ల విష‌యంలోనూ అప్ర‌మ‌త్తంగా ఉంటున్నా రు. లోకేష్ అయితే.. ప్ర‌జా ద‌ర్బార్ ద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అయ్యారు. ప్ర‌స్తుతం టీడీపీ నిర్వ‌హి స్తున్న ప్ర‌జాద‌ర్బార్‌కు ఆయ‌నే ఆలంబ‌న‌. తొలుత త‌న నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ ప్ర‌జ‌ల నుంచి అర్జీలు తీసుకునే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఆ త‌ర్వాతే.. పార్టీ ప్రారంభించింది. అనంత రం.. బీజేపీ దీనిని అందిపుచ్చుకుంది. ఇక‌, జ‌న‌సేన కూడా అప్ప‌ట్లోనే జ‌న వాణి పేరుతో కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది.

ఇక‌, ప్ర‌జ‌లు ఎలాంటి స‌మ‌స్య‌ను ఎప్పుడు త‌న దృష్టికి తెచ్చినా.. నారా లోకేష్ వెంట‌నే స్పందించ‌డం కూడా తెలిసిందే. గ‌ల్ఫ్‌లో చిక్కుకుపోయిన వారిని తీసుకురావ‌డంలోనూ.. విద్యార్థుల ఫీజులు, ప‌రీక్ష‌ల విష‌యంలో వెంట‌నే రియాక్ట్ కావ‌డంలోనూ ముందున్నారు. ప‌వ‌న్ కూడా అలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. అనూహ్య‌మైన రీతిలో వీరు వెనుక‌బ‌డ్డారు. నారా లోకేష్ 8వ ర్యాంకుతోను, ప‌వ‌న్ క‌ల్యాణ్ 10వ ర్యాంకు, చంద్ర‌బాబు 6వ ర్యాంకుతోనూ స‌రిపుచ్చుకున్నారు.

అయితే.. ఈ ర్యాంకుల కేటాయింపుపై వ్య‌క్తిగ‌తంగా నాయ‌కుల మ‌న‌సులో ఎలా ఉన్నా పార్టీల ప‌రంగా మాత్రం హ్యాపీగానే ఉన్నారు. పైగా.. జ‌న‌సేన నాయ‌కుడు, ప‌ర్యాట‌క మంత్రి కందుల దుర్గేష్‌కు ఫ‌స్ట్ ర్యాంకు రావ‌డంతో ఆ పార్టీ వ‌ర్గాలు హ్యాపీగానే ఫీల‌వుతున్నాయి. ఒకే ఒక్క మంత్రి ఉన్న బీజేపీ కూడా.. పెద‌వి విరిచేందుకు అవ‌కాశం లేదు. స‌త్య‌కుమార్ యాద‌వ్ ప‌నితీరుకు త‌గిన ర్యాంకే వ‌చ్చింద‌న్న అభిప్రాయం ఆ పార్టీ వ‌ర్గాల్లోనూ క‌నిపిస్తోంది. మొత్తంగా అనేక కూర్పులు, చేర్పులు అయితే.. ఈ ర్యాంకుల్లో స్ప‌ష్టంగా క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

13 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

40 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

40 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

1 hour ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

1 hour ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago