యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మాదిరిగానే ఈ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఏకంగా 48 సీట్లల్లో గెలిచింది. వెరసి 27 ఏళ్ళ తర్వాత బీజేపీ ఢిల్లీ సీఎం పీఠాన్ని తిరిగి దక్కించుకుంది.
ఇదిలా ఉంటే… ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్టును పెట్టారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నట్టుగా కేటీఆర్ సెటైర్ సంధించారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పేరును ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ పోస్టును సంధించారు. బీజేపీని మరోమారు గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ సదరు పోస్టులో పేర్కొనడం గమనార్హం.
వాస్తవానికి దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆప్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. అయితే.. ఎందుకనో గాని ఢిల్లీలో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. ఈ పరిణామమే ఎన్నికల్లో బీజేపీ విక్టరీకి దోహదం చేసిందన్నది రాజకీయ విశ్లేషకుల అబ్భిప్రాయం. ఇదే వాదనను వినిపించిన కేటీఆర్.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విక్టరీకి రాహుల్ గాంధీ కారణమయ్యారని సెటైర్ సంధించారు. ఈ లెక్కన కేటీఆర్ సెటైరిక్ గా చెప్పినా అదే నిజమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 8, 2025 2:36 pm
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…