యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మాదిరిగానే ఈ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఏకంగా 48 సీట్లల్లో గెలిచింది. వెరసి 27 ఏళ్ళ తర్వాత బీజేపీ ఢిల్లీ సీఎం పీఠాన్ని తిరిగి దక్కించుకుంది.
ఇదిలా ఉంటే… ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్టును పెట్టారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నట్టుగా కేటీఆర్ సెటైర్ సంధించారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పేరును ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ పోస్టును సంధించారు. బీజేపీని మరోమారు గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ సదరు పోస్టులో పేర్కొనడం గమనార్హం.
వాస్తవానికి దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆప్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. అయితే.. ఎందుకనో గాని ఢిల్లీలో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. ఈ పరిణామమే ఎన్నికల్లో బీజేపీ విక్టరీకి దోహదం చేసిందన్నది రాజకీయ విశ్లేషకుల అబ్భిప్రాయం. ఇదే వాదనను వినిపించిన కేటీఆర్.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విక్టరీకి రాహుల్ గాంధీ కారణమయ్యారని సెటైర్ సంధించారు. ఈ లెక్కన కేటీఆర్ సెటైరిక్ గా చెప్పినా అదే నిజమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 8, 2025 2:36 pm
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…