యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మాదిరిగానే ఈ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఏకంగా 48 సీట్లల్లో గెలిచింది. వెరసి 27 ఏళ్ళ తర్వాత బీజేపీ ఢిల్లీ సీఎం పీఠాన్ని తిరిగి దక్కించుకుంది.
ఇదిలా ఉంటే… ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్టును పెట్టారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నట్టుగా కేటీఆర్ సెటైర్ సంధించారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పేరును ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ పోస్టును సంధించారు. బీజేపీని మరోమారు గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ సదరు పోస్టులో పేర్కొనడం గమనార్హం.
వాస్తవానికి దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆప్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. అయితే.. ఎందుకనో గాని ఢిల్లీలో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. ఈ పరిణామమే ఎన్నికల్లో బీజేపీ విక్టరీకి దోహదం చేసిందన్నది రాజకీయ విశ్లేషకుల అబ్భిప్రాయం. ఇదే వాదనను వినిపించిన కేటీఆర్.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విక్టరీకి రాహుల్ గాంధీ కారణమయ్యారని సెటైర్ సంధించారు. ఈ లెక్కన కేటీఆర్ సెటైరిక్ గా చెప్పినా అదే నిజమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 8, 2025 2:36 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…