యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మాదిరిగానే ఈ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఏకంగా 48 సీట్లల్లో గెలిచింది. వెరసి 27 ఏళ్ళ తర్వాత బీజేపీ ఢిల్లీ సీఎం పీఠాన్ని తిరిగి దక్కించుకుంది.
ఇదిలా ఉంటే… ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్టును పెట్టారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నట్టుగా కేటీఆర్ సెటైర్ సంధించారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పేరును ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ పోస్టును సంధించారు. బీజేపీని మరోమారు గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ సదరు పోస్టులో పేర్కొనడం గమనార్హం.
వాస్తవానికి దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆప్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. అయితే.. ఎందుకనో గాని ఢిల్లీలో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. ఈ పరిణామమే ఎన్నికల్లో బీజేపీ విక్టరీకి దోహదం చేసిందన్నది రాజకీయ విశ్లేషకుల అబ్భిప్రాయం. ఇదే వాదనను వినిపించిన కేటీఆర్.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విక్టరీకి రాహుల్ గాంధీ కారణమయ్యారని సెటైర్ సంధించారు. ఈ లెక్కన కేటీఆర్ సెటైరిక్ గా చెప్పినా అదే నిజమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 8, 2025 2:36 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల జల్లుకురిపించారు. దక్షిణాది సినీ రంగానికి చిరంజీవి ఐకాన్.. అని పేర్కొన్నారు.…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు మాట కు తెలుగు ఓటరు ఓటెత్తాడు.…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ…
అరవింద్ కేజ్రీవాల్... దేశ రాజకీయాల్లో రీసౌండ్ ఇచ్చిన పేరిది. ఇటు అధికార బీజేపీతో పాటుగా అటూ నాడు అధికారంలో ఉన్న…
అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో అమెరికన్ ఎయిర్లైన్స్ జెట్, ఆర్మీ హెలికాప్టర్…
రెండేళ్ల కిందట తమిళంలో లవ్ టుడే అనే చిన్న సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింద తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్…