Political News

అచ్చెన్నకు కుడి, ఎడమల చెక్ పెట్టినట్లేనా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున గెలిచిన వారిలో మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చాలా దూకుడు మీదుండే వ్యక్తి. దశాబ్దాల పాటు కింజరాపు కుటుంబానికి శ్రీకాకుళం జిల్లాలో ఎదురులేకపోవటం వల్లే అచ్చెన్నకు జిల్లా వ్యాప్తంగా పట్టువచ్చింది. టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా కింజరాపు కుటుంబానికైతే ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. కానీ అదంతా చరిత్రగా మిగిలిపోయట్లుందిపుడు.

ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత అచ్చెన్న గెలిచిన టెక్కలి నియోజకవర్గంలో దువ్వాల శ్రీనివాస్ ఇన్చార్జిగా ఉన్నారు. దువ్వాడ మొన్నటి ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపిగా పోటిచేసి ఓడిపోయారు. ఎప్పుడైతే వైసీపీ అఖండ మెజారిటితో గెలిచిందో అప్పటి నుండో దువ్వాడ హవా కూడా మొదలైది. అసలే జగన్మోహన్ రెడ్డికి దువ్వాడ చాలా సన్నిహితుడు. దానికితోడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక దువ్వాడకు తిరుగేముంటుంది ? అందుకనే టెక్కలిలో ఎంఎల్ఏ హోదాలో దువ్వాడే చక్రం తిప్పేస్తున్నారట.

నియోజకవర్గంలోని సమస్త పనులు దువ్వాడ పేరుమీద జరుగుతున్నాయని సమాచారం. టెక్కలిలో అధికారుల సమీక్షలు కూడా దువ్వాడ చూసుకుంటున్నారట. దాంతో అచ్చెన్న పేరుకు మాత్రమే ఎంఎల్ఏగా మిగిలిపోయారు. అచ్చెన్న సమీక్షలకు పిలుస్తున్నా అధికారులు పెద్దగా హాజరుకావటం లేదట. ఎందుకంటే ఈ పద్దతిని మొదలుపెట్టిందే టీడీపీ. 2014-19లో జిల్లాలో గెలిచిన వైసీపీ ఎంఎల్ఏలను అచ్చెన్న పూచికపుల్లలుగా చూశారట. టెక్కలిలో మాత్రమే కాదులేండి రాష్ట్రంలో అన్నీ చోట్లా ఇలాగే జరిగింది. ఎంఎల్ఏలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా చంద్రబాబు ఓడిపోయిన నేతల పేర్లతోనే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.

సరే దువ్వాడ విషయమే ఇలాగుంటే అచ్చెన్నపైన మరో పిడుగు పడినట్లయ్యింది. అదేమిటంటే పోయిన ఎన్నికల్లో అచ్చెన్న మీద పోటి చేసిన ఓడిపోయిన పేరాడ తిలక్ ను కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు. పేరాడ కూడా జగన్ కు బాగా సన్నిహితుడనే చెప్పాలి. అంటే ఒకే నియోజకవర్గంలో జగన్ కు బాగా సన్నిహితులైన దువ్వాడ, పేరాడలకు ప్రమోషన్ వచ్చినట్లే అయ్యింది. దాంతో దువ్వాడ ఒక్కరితోనే వేగలేక నానా అవస్తలు పడుతున్న అచ్చెన్నకు తాజాగా పేరాడ కూడా జత కలిసినట్లయ్యింది. పైగా జిల్లాలో ప్రముఖ సామాజికవర్గమైన కళింగ కార్పొరేషన్ కు క్యాబినెట్ ర్యాంకుతో ఛైర్మన్ గా నియమించటమంటే చాలా ప్రాధాన్యత దక్కినట్లే పేరాడకు. మరి మిగిలిన మూడున్నరేళ్ళు వీళ్ళద్దరితో అచ్చెన్న ఎలా నెట్టుకొస్తారో చూడాల్సిందే.

This post was last modified on October 20, 2020 4:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

7 minutes ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

11 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

11 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

12 hours ago