Political News

ర్యాంకులపై వైసీపీ రచ్చ..చంద్రబాబు కౌంటర్

సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు ఒక ఉద్దేశ్యంతో చెప్పిన విషయంలో నానార్థాలు తీసి..చిలవలు పలవలుగా చేసి ఆయన ఇమేజ్ కు డ్యామేజ్ చేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని వారు ఆరోపిస్తుంటారు. ఈ కోవలోనే తాజాగా మంత్రులకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులపై కూడా వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ల ర్యాంకులపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆ కామెంట్లకు చంద్రబాబు తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఫైళ్ళ క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చామని, ఎవరినీ ఎక్కువ, తక్కువ చేయడానికి కాదని చెప్పారు. మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేసి వేగవంతమైన పాలన అందిస్తారన్న ఉద్దేశ్యంతో చేసిన చిన్న ప్రయత్నమే ఇదని వివరించారు. గ్రామ స్థాయిలో చిరుద్యోగి మొదలు ముఖ్యమంత్రి వరకు సమిష్టిగా పనిచేస్తేనే ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలమని చెప్పారు.

కూటమి నేతలపై అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో ప్రజలు చరిత్రాత్మక తీర్పును, విజయాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. కాబట్టి అధికారం చేపట్టిన తొలి గంట నుంచి వారి ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. వైసీపీ విధ్వంసం వల్ల నాశనమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నామని చెప్పారు.

పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేతలంతా కష్టపడాలని, టీమ్ వర్క్‌ ఉంటేనే ఉత్తమ ఫలితాలు సాధించగలమని అన్నారు. అసాధారణ, వేగవంతమైన పనితీరుతోనే రాష్ట్ర పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేమని చెప్పారపు అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్ తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్న ఉద్దేశ్యంతోనే ర్యాంకులు విడుదల చేశామని క్లారిటీనిచ్చారు.

This post was last modified on February 7, 2025 6:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

23 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

32 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

1 hour ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…

5 hours ago