Political News

ర్యాంకులపై వైసీపీ రచ్చ..చంద్రబాబు కౌంటర్

సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు ఒక ఉద్దేశ్యంతో చెప్పిన విషయంలో నానార్థాలు తీసి..చిలవలు పలవలుగా చేసి ఆయన ఇమేజ్ కు డ్యామేజ్ చేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని వారు ఆరోపిస్తుంటారు. ఈ కోవలోనే తాజాగా మంత్రులకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులపై కూడా వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ల ర్యాంకులపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆ కామెంట్లకు చంద్రబాబు తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఫైళ్ళ క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చామని, ఎవరినీ ఎక్కువ, తక్కువ చేయడానికి కాదని చెప్పారు. మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేసి వేగవంతమైన పాలన అందిస్తారన్న ఉద్దేశ్యంతో చేసిన చిన్న ప్రయత్నమే ఇదని వివరించారు. గ్రామ స్థాయిలో చిరుద్యోగి మొదలు ముఖ్యమంత్రి వరకు సమిష్టిగా పనిచేస్తేనే ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలమని చెప్పారు.

కూటమి నేతలపై అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో ప్రజలు చరిత్రాత్మక తీర్పును, విజయాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. కాబట్టి అధికారం చేపట్టిన తొలి గంట నుంచి వారి ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. వైసీపీ విధ్వంసం వల్ల నాశనమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నామని చెప్పారు.

పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేతలంతా కష్టపడాలని, టీమ్ వర్క్‌ ఉంటేనే ఉత్తమ ఫలితాలు సాధించగలమని అన్నారు. అసాధారణ, వేగవంతమైన పనితీరుతోనే రాష్ట్ర పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేమని చెప్పారపు అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్ తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్న ఉద్దేశ్యంతోనే ర్యాంకులు విడుదల చేశామని క్లారిటీనిచ్చారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

2 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

4 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

6 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

7 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

7 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

7 hours ago