ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత కొన్నేళ్లలో సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులను టార్గెట్ చేయడం తెలిసిన సంగతే. ఇలా ఒక పార్టీ మద్దతుదారులను టార్గెట్ చేయడం కరెక్టా.. ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఎలా అంటూ దీన్ని తప్పుబడుతున్న వాళ్లు లేకపోలేదు.
కానీ వైసీపీ అధికారంలో ఉండగా సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన పోస్టులతో ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ వారిని ఊరికే వదిలేయడం కూడా కరెక్ట్ కాదనే వాదనను తప్పుబట్టలేం. రామ్ గోపాల్ వర్మ లాంటి లెజెండరీ డైరెక్టర్ సైతం వైసీపీకి భజన చేసే క్రమంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను కించపరిచేలా పోస్టులు పెట్టి తన విలువను తగ్గించుకున్నారు. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలనే డిమాండ్ టీడీపీ, జనసేన మద్దతుదారుల గట్టిగానే వినిపించింది.
ఈ నేపథ్యంలోనే వర్మ మీద కేసులు నమోదయ్యాయి. కానీ ఆయన్ని విచారణకు రప్పించడానికి పోలీసులు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోయింది. ఏపీ పోలీసులు మళ్లీ మళ్లీ నోటీసులు ఇచ్చినా.. వర్మ ఏదో ఒక కారణం చెప్పి విచారణకు గైర్హాజరవుతూనే ఉన్నారు. కోర్టు ద్వారా కూడా పోలీసుల ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఐతే ఇప్పటిదాకా ఎలాగోలా నెట్టుకొచ్చాడు కానీ.. ఇక వర్మ వల్ల కాని పరిస్థితుల్లో ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యాడు.
ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చిన వర్మను ఆ స్టేషన్ సీఐ విచారిస్తున్నారు. విచారణకు హాజరు కావడానికి ముందు వర్మ.. వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలవడం విశేషం. ఆయనతో మాట్లాడాక విచారణకు వెళ్లాడు. సంబంధిత కేసును కొట్టివేయాలంటూ వర్మ క్వాష్ పిటిషన్ వేయగా.. ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం లేకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. విచారణకు మాత్రం హాజరు కావాలని స్పష్టం చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వర్మ ఒంగోలు పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.
This post was last modified on February 7, 2025 3:14 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…