Political News

వైసీపీలోకి శైలజానాథ్.. ఆ లారీ డ్రైవర్ కు కష్టమే

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో.. సామాన్యులకు కూడా టిక్కెట్లు ఇచ్చామంటూ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా చెప్పుకున్న సంగతి తెలిసిందే. తాను ఓ సామాన్య లారీ డ్రైవర్ కు అసెంబ్లీ సీటు ఇచ్చానని గొప్పలు చెప్పుకున్నారు. అయితే… ఇకపై అలాంటి సామాన్యులకు వైసీపీలో టికెట్లు దక్కే పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే… సదరు లారీ డ్రైవరుకు ఇచ్చిన సీటులోకి ఇప్పుడు ఓ బడా రాజకీయ నేత వచ్చి కూర్చున్నారు. జగన్ కూడా ఆ బడా రాజకీయ నేతను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగిన సాకే శైలజానాథ్ శుక్రవారం కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరిపోయారు. శుక్రవారం తాడేపల్లికి వచ్చిన శైలజానాథ్ ను జగన్ వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు,. వైసీపీ కండువా కప్పి ఆయనకు జగన్ పార్టీలోకి స్వాగతం పలికారు. కాంగ్రెస్ లో ఉండగా శైలజానాథ్ అనంతపురం జిల్లా శింగనమల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ దఫా మంత్రిగా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా కూడా పని చేశారు. ఆ తర్వాత ఎందుకనో గానీ ఆయన కనిపించకుండా పోయారు.

దివంగత సీఎం వై ఎస్ రాజశేఖర రెడ్డికి శైలజానాథ్ అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అంతేకాకుండా అనంత కు చెందిన మాజీ మంత్రి, ఏపీసీసీ చీఫ్ గా పనిచేసిన రఘువీరా రెడ్డికి కూడా ఆయన సన్నిహితులే. దళిత సామజిక వర్గానికి చెందిన శైలజానాథ్ కు మంచి పేరు అయితే ఉంది గాని… జనాన్ని మెప్పించగలిగే నేత అయితే మాత్రం కాదనే చెప్పాలి. మరి ఏ లెక్కన శైలజానాథ్ ను జగన్ పార్టీలోకి తీసుకున్నారన్న అంశంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో శింగనమల సీటునే జగన్ లారీ డ్రైవర్ కు ఇచ్చారు. ఇప్పుడు శైలజానాథ్ రాకతో ఆ సీటు శైలజానాథ్ కే ఇవ్వక తప్పదు. మరోమారు లారీ డ్రైవర్ కు ఆ సీటును జగన్ కేటాయించే అవకాశం లేదు.

This post was last modified on February 7, 2025 2:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago