Political News

ఎన్డీయే చైర్మన్ పదవిని చంద్రబాబు కోరారా..?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి గురువారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ కీలక అంశం ప్రస్తావనకు వచ్చింది. పార్లమెంట్లోని పెద్దల సభ అయిన రాజ్యసభలో బాబు అంశాన్ని మాజీ ప్రధాని, జేడీయూ అధ్యక్షుడు దేవెగౌడ ప్రస్తావించారు. బాబు గురుంచి గౌడ చేసిన ప్రస్తావనపై బీజేపీ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. వాస్తవాలు తెలుసుకోకుండా సభలో కీలక అంశాలపై ప్రస్తావించడం సరి కాదని బీజేపీ హితవాబు చెప్పింది.

అయినా… రాజ్యసభలో సభ్యుడు కాని చంద్రబాబుపై దేవెగౌడ ఏమన్నారన్న విషయానికి వస్తే… ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామి గా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్డీయేలో అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న పార్టీల్లో బీజేపీ తర్వాత స్తానం టీడీపీదే. ఈ క్రమంలో ఎన్డీయే చైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని చంద్రబాబు కోరినట్టుగా గౌడ వ్యాఖ్యానించారు. అందుకు ప్రధాని మోడీ ససేమిరా అనడంతో… కనీసం వైస్ చైర్మన్ పదవి అయినా ఇవ్వాలని చంద్రబాబు కోరారని ఆయన తెలిపారు. ఈ ప్రతిపాదనకు కూడా మోడీ ససేమిరా అన్నారని గౌడ చెప్పారు. ఈ వ్యాఖ్యలు అక్కడికక్కడే కలకలం రేపాయి.

దేవెగౌడ ప్రసంగం సమయంలో సభలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెనువెంటనే స్పందించారు. చంద్రబాబు పదవులు ఆశించారంటూ దేవెగౌడ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్డీయేలో అసలు ఈ విషయాలే ప్రస్తావనకు రాలేదని కూడా నడ్డా తెలిపారు. చర్చకు రాని అంశాలు చర్చకు వచ్చినట్టుగా గౌడ చెప్పడం తనను ఆశ్యర్యానికి గురి చేసిందని అన్నారు.. అయినా చంద్రబాబు ఏపీ సీఎంగా ఉండటానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విషయాన్నీ నడ్డా మరోమారు గుర్తుచేశారు. గతంలో ఎన్డీయేకు చంద్రబాబు కన్వీనర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

This post was last modified on February 7, 2025 1:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

1 hour ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

7 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

8 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago