Political News

ఓటు బ్యాంకు పైనే నితీష్ కన్ను

తొందరలో జరగబోయే బీహార్ ఎన్నికల్లో ఓటుబ్యాంకుపైనే నితీష్ కుమార్ ప్రధానంగా కన్నేశారు. ఎన్డీఏ కూటమి తరపున జేడీయూ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బాధ్యతలు చూస్తున్న నితీష్ 30 స్ధానాలను ముస్లింలు, యాదవులకే కేటాయించటం సంచలనంగా మారింది. ముస్లింలు, యాదవుల ఓట్లు షేర్ రాష్ట్రంలో సుమారు 30 శాతం ఉంది. పొత్తుల్లో భాగంగా 243 అసెంబ్లీ సీట్లలో జేడీయూ 115 సీట్లలో పోటి చేస్తోంది. తమ వాటాగా వచ్చిన సీట్లలో 19 చోట్ల యాదవులకు, 11 చోట్ల ముస్లింలకు టికెట్లు ఇస్తున్నట్లు నితీష్ ప్రకటించారు.

దాదాపు మూడు దశాబ్దాలుగా ముస్లింలు, యాదవుల్లో మెజారిటి సెక్షన్లు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తోనే ఉన్నారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో కూడా పై వర్గాలకు ఆర్జేడీ మంచి ప్రాధాన్యతే ఇచ్చింది. 58 మంది యాదవులకు, 17 మంది ముస్లింలకు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీ యాదవ్ టికెట్లు ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు పార్టీలు కూడా యాదవులు, ముస్లింలకు ఏదో టికెట్లిచ్చాం అన్నట్లు కాకుండా బలమైన అభ్యర్ధులనే రంగంలోకి దింపుతున్నాయి.

ఎప్పుడైతే రెండు పార్టీల నుండి బలమైన అభ్యర్ధులు పోటిలోకి దిగుతున్నారో అప్పటి నుండే ఉద్రిక్తతలు మొదలైపోయాయి. 2015లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 61 మంది యాదవ ఎంఎల్ఏలు గెలిచారు. వీరిలో 42 మంది ఆర్జేడీ నుండి విజయంసాధిస్తే మిగిలిన 11 మంది జేడీయూ నుండి గెలిచారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ కలిసి ఓ కూటమిగా పోటి చేశాయి కాబట్టే అంతటి ఘన విజయం సాధ్యమైంది.

సరే ఎన్నికలన్నాక ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవటం, విమర్శలు సంధించటం మామూలే. కాబట్టి ఇపుడు కూడా నితీష్-తేజస్వీ యాదవ్ అదే పని చేస్తున్నారు. ఇక జేడీయూ భాగస్వమి పార్టీ బీజేపీ, ఆర్జేడీ భాగస్వమ్యమైన కాంగ్రెస్ కేవలం సహాయంగా మాత్రమే నిలుస్తున్నాయి. ఎందుకంటే ఏ కూటమి గెలిచినా నితీష్, తేజస్వీలను చూసి ఓట్లేయాల్సిందే అన్నట్లుగా తయారైంది పరిస్ధితి. పనిలో పనిగా వీళ్ళతో పాటు ఇంకా చాలా పార్టీలే రంగంలో ఉన్నాయి. కాబట్టి కచ్చితంగా గెలుపు తమదే అని ధైర్యంగా ఏ కూటమి కూడా చెప్పలేకపోతోంది.

This post was last modified on October 20, 2020 4:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

55 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago