Political News

‘అమ‌రావ‌తి’ని ఆప‌ద్దు: ఈసీ లేఖ‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించాల‌ని సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో గ‌త ఐదేళ్లుగా వ‌ర్షపు నీరు, వ‌ర‌ద నీట‌లో నానిన అమ‌రావ‌తి భ‌వ‌నాల నుంచి నీటిని తోడించింది. అనంత‌రం.. భ‌వ‌న నిర్మాణాల‌కు సంబంధించిన ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచేందుకు రెడీ అయింది. ఈ ప్ర‌క్రియ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. షెడ్యూల్ ప్ర‌కారం.. ఫిబ్ర‌వ‌రిలో టెండర్ల ప్ర‌క్రియ పూర్తి కావాల్సి ఉంది.

వ‌రుస‌గా నెల మొత్తం ఐకానిక్ భ‌వ‌నాలు స‌హా.. ఇత‌ర ప‌ర్మినెంట్ నిర్మాణాల‌కు కూడా టెండ‌ర్లు ఆహ్వానించేందుకు సీఆర్ డీఏ రెడీ అయింది. అయితే.. ఇంత‌లోనే.. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న క్ర‌మంలో కోడ్ అడ్డు వ‌చ్చింది. అమ‌రావ‌తి ప‌నులు నిలిపివేయాల్సి ఉంటుంద‌ని ఎన్నిక‌ల అధికారులు పేర్కొన్నారు. దీంతో స‌ర్కారుకు ఎటూ తోచ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలా ఆపుకొంటూ పోతే.. వ‌చ్చే మార్చి వ‌ర‌కు వెయిట్ చేయాల‌ని భావించింది.

ఇంత‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ రాసింది. ఈ విష‌యంలో వెసులుబాటు క‌ల్పించాల‌ని కోరింది. దీనిపై వెంట‌నే స్పందించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. “అమ‌రావ‌తిని ఆప‌ద్దు” అని పేర్కొంది. అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు ఎలాంటి కోడ్ అడ్డంకి కాద‌ని తెలిపింది. రాజధానిలో టెండ‌ర్లు పిలిచేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ.. టెండర్లు పిలిచేందుకు అనుమతించింది. అయితే, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే టెండర్లు ఖరారు చేయాలని స్ప‌ష్టం చేసింది.

కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ మార్చి 3వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. దీంతో ఇప్ప‌టికే కొన్ని కీల‌క ప‌నులను ప్ర‌భుత్వం నిలుపుద‌ల చేసుకుంది.

This post was last modified on February 6, 2025 7:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

15 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

52 minutes ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

1 hour ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago