Political News

‘అమ‌రావ‌తి’ని ఆప‌ద్దు: ఈసీ లేఖ‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించాల‌ని సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో గ‌త ఐదేళ్లుగా వ‌ర్షపు నీరు, వ‌ర‌ద నీట‌లో నానిన అమ‌రావ‌తి భ‌వ‌నాల నుంచి నీటిని తోడించింది. అనంత‌రం.. భ‌వ‌న నిర్మాణాల‌కు సంబంధించిన ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచేందుకు రెడీ అయింది. ఈ ప్ర‌క్రియ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. షెడ్యూల్ ప్ర‌కారం.. ఫిబ్ర‌వ‌రిలో టెండర్ల ప్ర‌క్రియ పూర్తి కావాల్సి ఉంది.

వ‌రుస‌గా నెల మొత్తం ఐకానిక్ భ‌వ‌నాలు స‌హా.. ఇత‌ర ప‌ర్మినెంట్ నిర్మాణాల‌కు కూడా టెండ‌ర్లు ఆహ్వానించేందుకు సీఆర్ డీఏ రెడీ అయింది. అయితే.. ఇంత‌లోనే.. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న క్ర‌మంలో కోడ్ అడ్డు వ‌చ్చింది. అమ‌రావ‌తి ప‌నులు నిలిపివేయాల్సి ఉంటుంద‌ని ఎన్నిక‌ల అధికారులు పేర్కొన్నారు. దీంతో స‌ర్కారుకు ఎటూ తోచ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలా ఆపుకొంటూ పోతే.. వ‌చ్చే మార్చి వ‌ర‌కు వెయిట్ చేయాల‌ని భావించింది.

ఇంత‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ రాసింది. ఈ విష‌యంలో వెసులుబాటు క‌ల్పించాల‌ని కోరింది. దీనిపై వెంట‌నే స్పందించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. “అమ‌రావ‌తిని ఆప‌ద్దు” అని పేర్కొంది. అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు ఎలాంటి కోడ్ అడ్డంకి కాద‌ని తెలిపింది. రాజధానిలో టెండ‌ర్లు పిలిచేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ.. టెండర్లు పిలిచేందుకు అనుమతించింది. అయితే, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే టెండర్లు ఖరారు చేయాలని స్ప‌ష్టం చేసింది.

కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ మార్చి 3వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. దీంతో ఇప్ప‌టికే కొన్ని కీల‌క ప‌నులను ప్ర‌భుత్వం నిలుపుద‌ల చేసుకుంది.

Satya

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

27 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

1 hour ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

9 hours ago