ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత ఐదేళ్లుగా వర్షపు నీరు, వరద నీటలో నానిన అమరావతి భవనాల నుంచి నీటిని తోడించింది. అనంతరం.. భవన నిర్మాణాలకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచేందుకు రెడీ అయింది. ఈ ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరిలో టెండర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.
వరుసగా నెల మొత్తం ఐకానిక్ భవనాలు సహా.. ఇతర పర్మినెంట్ నిర్మాణాలకు కూడా టెండర్లు ఆహ్వానించేందుకు సీఆర్ డీఏ రెడీ అయింది. అయితే.. ఇంతలోనే.. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కోడ్ అడ్డు వచ్చింది. అమరావతి పనులు నిలిపివేయాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. దీంతో సర్కారుకు ఎటూ తోచని పరిస్థితి ఏర్పడింది. ఇలా ఆపుకొంటూ పోతే.. వచ్చే మార్చి వరకు వెయిట్ చేయాలని భావించింది.
ఇంతలో కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరింది. దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. “అమరావతిని ఆపద్దు” అని పేర్కొంది. అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు ఎలాంటి కోడ్ అడ్డంకి కాదని తెలిపింది. రాజధానిలో టెండర్లు పిలిచేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ.. టెండర్లు పిలిచేందుకు అనుమతించింది. అయితే, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే టెండర్లు ఖరారు చేయాలని స్పష్టం చేసింది.
కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ ఎన్నికల ప్రక్రియ మార్చి 3వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో ఇప్పటికే కొన్ని కీలక పనులను ప్రభుత్వం నిలుపుదల చేసుకుంది.
This post was last modified on February 6, 2025 7:01 pm
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…
అమెరికా ఇటీవల భారత్కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్…