Political News

‘అమ‌రావ‌తి’ని ఆప‌ద్దు: ఈసీ లేఖ‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించాల‌ని సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో గ‌త ఐదేళ్లుగా వ‌ర్షపు నీరు, వ‌ర‌ద నీట‌లో నానిన అమ‌రావ‌తి భ‌వ‌నాల నుంచి నీటిని తోడించింది. అనంత‌రం.. భ‌వ‌న నిర్మాణాల‌కు సంబంధించిన ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచేందుకు రెడీ అయింది. ఈ ప్ర‌క్రియ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. షెడ్యూల్ ప్ర‌కారం.. ఫిబ్ర‌వ‌రిలో టెండర్ల ప్ర‌క్రియ పూర్తి కావాల్సి ఉంది.

వ‌రుస‌గా నెల మొత్తం ఐకానిక్ భ‌వ‌నాలు స‌హా.. ఇత‌ర ప‌ర్మినెంట్ నిర్మాణాల‌కు కూడా టెండ‌ర్లు ఆహ్వానించేందుకు సీఆర్ డీఏ రెడీ అయింది. అయితే.. ఇంత‌లోనే.. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న క్ర‌మంలో కోడ్ అడ్డు వ‌చ్చింది. అమ‌రావ‌తి ప‌నులు నిలిపివేయాల్సి ఉంటుంద‌ని ఎన్నిక‌ల అధికారులు పేర్కొన్నారు. దీంతో స‌ర్కారుకు ఎటూ తోచ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలా ఆపుకొంటూ పోతే.. వ‌చ్చే మార్చి వ‌ర‌కు వెయిట్ చేయాల‌ని భావించింది.

ఇంత‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ రాసింది. ఈ విష‌యంలో వెసులుబాటు క‌ల్పించాల‌ని కోరింది. దీనిపై వెంట‌నే స్పందించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. “అమ‌రావ‌తిని ఆప‌ద్దు” అని పేర్కొంది. అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు ఎలాంటి కోడ్ అడ్డంకి కాద‌ని తెలిపింది. రాజధానిలో టెండ‌ర్లు పిలిచేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ.. టెండర్లు పిలిచేందుకు అనుమతించింది. అయితే, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే టెండర్లు ఖరారు చేయాలని స్ప‌ష్టం చేసింది.

కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ మార్చి 3వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. దీంతో ఇప్ప‌టికే కొన్ని కీల‌క ప‌నులను ప్ర‌భుత్వం నిలుపుద‌ల చేసుకుంది.

This post was last modified on February 6, 2025 7:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

27 minutes ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

4 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

5 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

5 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

5 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

6 hours ago