ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. దీనికి సంబంధించిన క్రతువు పూర్తయిందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏయే ప్రాజెక్టులకు ఎంతెంత కేటాయించాలి? సూపర్ సిక్స్లో ఏయే పథకాలకు ఎంత ఇవ్వాలన్న విషయాలపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులు, మంత్రితోనూ భేటీ అయ్యారు.
వాస్తవానికి ముందస్తుగా నిర్ణయం తీసుకున్న ప్రకారం అయితే..ఈ ఏడాది కూడా సూపర్ సిక్స్ గురించి పెద్దగా ప్రస్తావించే అవకాశం లేదు. కానీ, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తీసుకున్న తర్వాత.. గట్టిగా మూడు పథకాలపై ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా మాతృవందనం పథకాన్ని మహిళలు ఎక్కువగా కోరుతున్నారు. ఆ వెంటనే రెండోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మూడో రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ పథకం.
ఈ మూడు పథకాలకు తోడు.. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెల నెలా ఇస్తామన్న రూ.1500 ఆడబిడ్డ నిధి. ఈ నాలుగు పథకాలు కూడా.. ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నారు. సర్వేలు.. ప్రజల అభిప్రాయాలను సంపూర్ణంగా తెలుసుకున్నాక.. ఈ నాలుగు పథకాల్లో రెండింటినైనా తాజా బడ్జెట్లో ప్రవేశ పెట్టకపోతే.. ఇబ్బంది తప్పదని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయా పథకాల్లో భారీ భారం పడని.. ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలిసింది.
అదేవిధంగా రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవను కూడా బడ్జెట్లో ప్రస్తావించనున్నారు.ఇది కొంత వరకు భారమే అయినా.. కేంద్రం సాయం చేస్తున్న 6 వేల రూపాయలను దీనిలో కలిపి ఇవ్వను న్నారు. దీంతో కొంత వరకు ఆర్థిక భారం నుంచి తప్పించుకునే వెసులు బాటు ఉండనుంది. ఇక, ఆర్టీసీ బస్సుల కోసం.. నెలకు రూ.180-200 కోట్ల వరకు భరించేందుకు కూడా.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీంతో ఈ రెండు పథకాలకు కూడా.. బడ్జెట్లో చోటు దక్కే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on February 6, 2025 5:54 pm
లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…
ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…
బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతున్న సంగతి తెలిసిందే. లండన్కు…
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం…
మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్…