ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ చేసిన 22-ఏ భూముల వ్యవహారంతో పాటు పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. దీంతోపాటు, సూపర్ సిక్స్ పథకాల అమలుపై కూడా మంత్రివర్గ సహచరులతో చంద్రబాబు చర్చించనున్నారు. అయితే, ఈ కేబినెట్ భేటీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కాలేకపోవచ్చని డిప్యూటీ సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ వల్ల ఇబ్బంది పడుతున్నారని, వైద్యుల సూచన ప్రకారం విశ్రాంతి తెలిపింది.
రేపటి నుంచి మొదలుకాబోతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ లో కూడా పవన్ పాల్గొనే చాన్స్ లేదని తెలుస్తోంది. మరోవైపు, రేపటి కేబినెట్ భేటీలో విశాఖ పంచగ్రామాల సమస్యపై కూడా చర్చ జరపబోతున్నారని తెలుస్తోంది. స్థానికులకు అంతే విలువ కలిగిన భూముల కేటాయించే విషయంపై చర్చించబోతున్నారట. అంతేకాదు, ఎస్ఐపీబీలో ఆమోదించిన రూ.44.776 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చాన్స్ ఉంది.
ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 20 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ నెల చివరి వారంలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై కూడా మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు. ఏపీలో నోటిఫికేషన్ వెలువడిన రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రిపరేషన్ పై మంత్రివర్గం చర్చ జరపనుంది. ఉన్నత విద్యామండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుతోపాటు పలు అంశాలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది.
This post was last modified on February 6, 2025 10:11 am
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…