టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన నిధుల విడుదల, ప్రత్యేక రైల్వే జోన్ పనుల వేగవంతం తదితరాలపై ఆయన కేంద్ర మంత్రితో చర్చించినట్లుగా సమాచారం. అంతేకాకుండా తాజాగా రైల్వే బడ్జెట్ లో ఏపీకి భారీ కేటాయింపులనూ ప్రస్తావించిన లోకేశ్.. రైౌల్వే మినిస్టర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
రైల్వే ప్రాజెక్టులే కాకుండా ఇతరత్రా విషయాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినా…ఓ విషయం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. అశ్వినీ వైష్ణవ్ తో భేటీ కోసం ఆయన అధికారిక నివాసానికి చేరుకున్న సందర్భంగా ఆయనను లోకేశ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శాలువాను వైష్ణవ్ కు కప్పిన లోకేశ్.. తిరుమల వెంకన్న విగ్రహాన్ని కూడా అందజేశారు. ఆ తర్వాత అరకు కాఫీ అంటూ ఓ సుందరమైన ప్యాకింగ్ ను లోకేశ్… వైష్ణవ్ చేతిలో పెట్టారు. ఈ సందర్భంగా సర్ అరకు కాఫీ అంటూ ఆ ప్యాకేజీని అందించగా…వావ్ ఇట్స్ వండర్ ఫుల్ అంటూ వ్యాఖ్యానించిన వైష్ణవ్ దానిని స్వీకరించారు.
అయినా ఈ అరకు కాఫీ గోలేంటీ? అంటారా.? ఏపీలోని విశాఖ, అరకు ప్రాంతాల్లో గిరిజనులు పండిస్తున్న కాఫీకి మంచి గిరాకీ ఉంది. సుమధురమైన ఈ కాఫీని ఏపీ ప్రభుత్వం అరకు కాఫీ పేరిట ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అరకు కాఫీకి వరల్డ్ క్లాస్ బ్రాండ్ ఇమేజీ దక్కేలా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి దావోస్ టూర్ లో ఏపీ పెవిలియన్ లో ఏకంగా అరకు కాఫీ మిషన్ పెట్టిన చంద్రబాబు అక్కడికి వచ్చిన వారికి ఆ రుచిని పరిచయం చేశారు. తాను కలిసే ప్రతి అతిథికీ అరకు కాఫీ ప్యాకేజీ ఇస్తూ వస్తున్నారు. తన తండ్రిని చూసిన లోకేశ్… తాను కూడా అరకు కాఫీని ఎందుకు ప్రమోట్ చేచయకూడదని అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… తాను కూడా అరకు కాఫీ ప్యాకేజీలను ప్రముఖులకు బహూకరిస్తూ సాగుతున్ానరు. ఈ లెక్కన అరకు కాఫీకి వరల్డ్ క్లాస్ బ్రాండ్ ఇమేజీ అతి త్వరలోనే దక్కనుందని చెప్పొచ్చు.
This post was last modified on February 4, 2025 9:38 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…