టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన నిధుల విడుదల, ప్రత్యేక రైల్వే జోన్ పనుల వేగవంతం తదితరాలపై ఆయన కేంద్ర మంత్రితో చర్చించినట్లుగా సమాచారం. అంతేకాకుండా తాజాగా రైల్వే బడ్జెట్ లో ఏపీకి భారీ కేటాయింపులనూ ప్రస్తావించిన లోకేశ్.. రైౌల్వే మినిస్టర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
రైల్వే ప్రాజెక్టులే కాకుండా ఇతరత్రా విషయాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినా…ఓ విషయం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. అశ్వినీ వైష్ణవ్ తో భేటీ కోసం ఆయన అధికారిక నివాసానికి చేరుకున్న సందర్భంగా ఆయనను లోకేశ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శాలువాను వైష్ణవ్ కు కప్పిన లోకేశ్.. తిరుమల వెంకన్న విగ్రహాన్ని కూడా అందజేశారు. ఆ తర్వాత అరకు కాఫీ అంటూ ఓ సుందరమైన ప్యాకింగ్ ను లోకేశ్… వైష్ణవ్ చేతిలో పెట్టారు. ఈ సందర్భంగా సర్ అరకు కాఫీ అంటూ ఆ ప్యాకేజీని అందించగా…వావ్ ఇట్స్ వండర్ ఫుల్ అంటూ వ్యాఖ్యానించిన వైష్ణవ్ దానిని స్వీకరించారు.
అయినా ఈ అరకు కాఫీ గోలేంటీ? అంటారా.? ఏపీలోని విశాఖ, అరకు ప్రాంతాల్లో గిరిజనులు పండిస్తున్న కాఫీకి మంచి గిరాకీ ఉంది. సుమధురమైన ఈ కాఫీని ఏపీ ప్రభుత్వం అరకు కాఫీ పేరిట ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అరకు కాఫీకి వరల్డ్ క్లాస్ బ్రాండ్ ఇమేజీ దక్కేలా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి దావోస్ టూర్ లో ఏపీ పెవిలియన్ లో ఏకంగా అరకు కాఫీ మిషన్ పెట్టిన చంద్రబాబు అక్కడికి వచ్చిన వారికి ఆ రుచిని పరిచయం చేశారు. తాను కలిసే ప్రతి అతిథికీ అరకు కాఫీ ప్యాకేజీ ఇస్తూ వస్తున్నారు. తన తండ్రిని చూసిన లోకేశ్… తాను కూడా అరకు కాఫీని ఎందుకు ప్రమోట్ చేచయకూడదని అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… తాను కూడా అరకు కాఫీ ప్యాకేజీలను ప్రముఖులకు బహూకరిస్తూ సాగుతున్ానరు. ఈ లెక్కన అరకు కాఫీకి వరల్డ్ క్లాస్ బ్రాండ్ ఇమేజీ అతి త్వరలోనే దక్కనుందని చెప్పొచ్చు.
This post was last modified on February 4, 2025 9:38 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…