Political News

జ‌గ‌న్‌ను మ‌రోసారి ఏకేసిన‌ ష‌ర్మిల

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్.. లండ‌న్ నుంచి ఇలా వ‌చ్చారో లేదో.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు, ఆయ‌న సోద‌రి ష‌ర్మిల‌.. ఇలా ఏకేయ‌డం ప్రారంభించారు. తాజాగా మంగ‌ళ‌వారం.. ష‌ర్మిల విజ‌య‌వాడ‌లో మాట్లాడుతూ.. జ‌గ‌న్‌పై విమర్శ‌ల జ‌ల్లు కురిపించారు. బీజేపీ ద‌త్త‌పుత్రుడు.. ఆ పార్టీ క‌నుస‌న్న‌ల్లో న‌డిచాడు అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు.. ఈ విష‌యంలో టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని కూడా ఆమె సూచించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. విష‌యం ఏదైనా జ‌గ‌న్‌ను ఏకేయ‌డం కామ‌న్ అన్న‌ట్టుగా ష‌ర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించ‌డం గ‌మ‌నార్హం.

విష‌యం ఇదీ..

తెలంగాణలోని రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం తాజాగా కుల‌గ‌ణ‌న రిపోర్డును వెల్ల‌డించింది. అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టి.. దీనిపై చ‌ర్చిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడిన ష‌ర్మిల‌.. తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన కుల‌గ‌ణ‌నను అద్భుత‌మ‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ మేర‌కు స‌మాజంలో వెనుక బ‌డిన వ‌ర్గాల‌ను గుర్తించి, వారికి సంక్షేమ‌, అభివృద్ధి ఫ‌లాలు అందించాల‌న్న ఏకైక ఉద్దేశంతోనే కుల‌గ‌ణ‌ను చేప‌ట్టింద‌ని.. తెలంగాణ‌లోనే ఇది ఒక చ‌రిత్ర‌ను సృష్టిస్తుంద‌ని ఆమె కొనియాడారు. దీనికి తెలంగాణ స‌ర్కారు ఎంతో క‌ష్ట‌ప‌డింద‌న్నారు.

మ‌రోవైపు.. ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ముఖ్యంగా చంద్ర‌బాబు కూడా.. కుల గ‌ణ‌న చేప‌ట్టాల‌ని ష‌ర్మిల కోరారు. రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వెనుక బ‌డిన వ‌ర్గాల‌కు వారి వాటా వారికి దక్కాల్సి ఉందని అన్నారు. జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉందని తెలిపారు కానీ, ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వాలు మారుతున్నా ఆయా సామాజిక వ‌ర్గాల ప‌రిస్థితి మార‌డం లేదన్నారు. తెలంగాణ చేసిన కుల‌గ‌ణ‌న మోడ‌ల్ బాగుంద‌ని, దీనిని ఏపీ కూడా అందిపుచ్చుకోవాల‌ని ష‌ర్మిల సూచించారు.

అయితే.. గ‌తంలో ఎన్నిక‌లకుముందు వైసీపీ ప్ర‌భుత్వం కూడా కుల గ‌ణ‌న పేరుతో హ‌డావుడి చేసింద‌ని.. ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేసింద‌ని ష‌ర్మిల దుయ్య‌బ‌ట్టారు. అయితే.. బీజేపీ ద‌త్త‌పుత్రుడుగా వ్య‌వ‌హ‌రించిన ఆనాటి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. ఈ కుల గ‌ణ‌న స‌ర్వేను తొక్కిపెట్టార‌ని.. కనీసం దీనిపై ప‌న్నెత్తు మాట కూడా మాట్లాడ‌లేద‌ని విమ‌ర్శించారు. బీజేపీ క‌నుస‌న్నల్లో ఆ పార్టీ చెప్పింద‌న్న కార‌ణంగానే కుల‌ గ‌ణ‌న పూర్తయినా.. జ‌గ‌న్ వెల్ల‌డించ‌లేద‌న్నారు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబు బీజేపీ వ‌ల‌లో చిక్కుకోకుండా.. కుల‌ గ‌ణ‌న చేయాల‌ని ష‌ర్మిల సూచించారు. కుల గ‌ణ‌న చేయ‌డం ద్వారా.. వెనుక‌బ‌డిన వ‌ర్గాలు మేలు చేసిన‌ట్టు అవుతుంద‌న్నారు.

This post was last modified on February 4, 2025 9:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

10 hours ago