పట్టలేనంత కోపం ఉండొచ్చు. హద్దులు దాటే ఆగ్రహం రావొచ్చు. అయితే.. మాత్రం నోటిని అదుపులో ఉంచుకోకపోతే అంతకు మించిన ఇబ్బంది మరింకేమీ ఉండదు. తాజాగా అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్. అత్యున్నత స్థానంలో ఉన్న ఆయన.. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల వేళ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటకు అవాక్కు అవుతున్నారు.
ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన ఒక సీనియర్ నేత నోట ఇలాంటి దారుణమైన మాటలు రావటమా? అన్నదిప్పుడు చర్చగా మారింది.
ఇంతకూ జరిగిందేమన్నది చూస్తే.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు జంప్ కావటం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో కమల్ నాథ్ సర్కారు కూలిపోయి.. బీజేపీ ప్రభుత్వం కొలువు తీరటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో భాగంగా తాజాగా ఆ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిపోయిన ఒక మహిళా అభ్యర్థి ఉన్నారు. ఆమె పేరు.. ఇమర్తీ దేవి. గ్వాలియర్ లోని డాబ్రా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలో ఉన్నారు.
28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్నఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన మాజీ సీఎం కమల్ నాథ్.. ఆగ్రహంతో నోరు పారేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సాధారణమైన వారని.. ఆమెలా ఐటెం కాదని ఆయన నోరు జారారు. దీంతో.. ఇదో సంచలనంగా మారటంతో పాటు.. ఆయన మాట విన్న వారంతా తీవ్ర ఆగ్రహానికి గురి కావటంతో పాటు.. ఇదేం పాడు మాట అంటూ తిట్టిపోస్తున్నారు.
కమల్ నాథ్ నోటి నుంచి వచ్చిన మాట ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి తాము లేఖ రాస్తామని.. దళిత మహిళను కించపరిచినందుకు కాంగ్రెస్ హైకమాండ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కీలకమైన ఎన్నికల వేళ.. మాజీ సీఎం నోటి నుంచి వచ్చిన ఐటెం మాట.. ఇప్పుడో తలనొప్పిగా మారింది. కమలనాథ్ మాటలతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
This post was last modified on October 20, 2020 1:05 pm
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…