పట్టలేనంత కోపం ఉండొచ్చు. హద్దులు దాటే ఆగ్రహం రావొచ్చు. అయితే.. మాత్రం నోటిని అదుపులో ఉంచుకోకపోతే అంతకు మించిన ఇబ్బంది మరింకేమీ ఉండదు. తాజాగా అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్. అత్యున్నత స్థానంలో ఉన్న ఆయన.. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల వేళ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటకు అవాక్కు అవుతున్నారు.
ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన ఒక సీనియర్ నేత నోట ఇలాంటి దారుణమైన మాటలు రావటమా? అన్నదిప్పుడు చర్చగా మారింది.
ఇంతకూ జరిగిందేమన్నది చూస్తే.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు జంప్ కావటం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో కమల్ నాథ్ సర్కారు కూలిపోయి.. బీజేపీ ప్రభుత్వం కొలువు తీరటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో భాగంగా తాజాగా ఆ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిపోయిన ఒక మహిళా అభ్యర్థి ఉన్నారు. ఆమె పేరు.. ఇమర్తీ దేవి. గ్వాలియర్ లోని డాబ్రా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలో ఉన్నారు.
28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్నఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన మాజీ సీఎం కమల్ నాథ్.. ఆగ్రహంతో నోరు పారేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సాధారణమైన వారని.. ఆమెలా ఐటెం కాదని ఆయన నోరు జారారు. దీంతో.. ఇదో సంచలనంగా మారటంతో పాటు.. ఆయన మాట విన్న వారంతా తీవ్ర ఆగ్రహానికి గురి కావటంతో పాటు.. ఇదేం పాడు మాట అంటూ తిట్టిపోస్తున్నారు.
కమల్ నాథ్ నోటి నుంచి వచ్చిన మాట ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి తాము లేఖ రాస్తామని.. దళిత మహిళను కించపరిచినందుకు కాంగ్రెస్ హైకమాండ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కీలకమైన ఎన్నికల వేళ.. మాజీ సీఎం నోటి నుంచి వచ్చిన ఐటెం మాట.. ఇప్పుడో తలనొప్పిగా మారింది. కమలనాథ్ మాటలతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…
ఈ రోజుల్లో సోషల్ మీడియా నెగెటివిటీ సినిమాలకు ఎంత నష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…
ఐపీఎల్లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే…
ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు…