Political News

ఢిల్లీ పొలిటికల్ ఫైట్.. ఎగ్జిట్ పోల్స్ నిషేధం!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఫిబ్రవరి 5న మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, సాయంత్రం వరకు ప్రచారానికి అవకాశం ఉండడంతో పార్టీలు చివరి క్షణం వరకు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. అధికారంలో కొనసాగాలని ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుండగా, బీజేపీ అధికారం చేజిక్కించుకోవాలని హోరాహోరీ ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ కూడా తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించింది.

ప్రచారంలో భాగంగా బీజేపీ ఒక్కరోజులోనే 22 రోడ్డు షోలు నిర్వహించడం విశేషం. ఢిల్లీ ఎన్నికలతో పాటు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కొన్ని కఠిన నిబంధనలు అమలు చేసింది. ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు ఎగ్జిట్ పోల్స్, ఇతర సర్వేలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎన్నికల సంఘం ప్రకటించిన నిబంధనల ప్రకారం, పోలింగ్ ముగిసే 48 గంటల ముందు నుంచి ఎలాంటి ఎన్నికల సర్వేలను ప్రచురించకూడదని స్పష్టం చేసింది. అదనంగా, ఒపీనియన్ పోల్స్, ఇతర విశ్లేషణలపై కూడా నిషేధం విధించింది. ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియకు భంగం కలగకుండా ఉండేందుకు తీసుకున్నవి. ఇకపోతే, ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్యే జరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన ఆప్, మరోసారి ప్రజాదరణను పొందుతుందా? లేక బీజేపీ గట్టిపోటీ ఇచ్చి ఢిల్లీ సింహాసనాన్ని అందుకుంటుందా? అనే ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో తన హోదాను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. పోలింగ్ ముగిసిన వెంటనే అన్ని పార్టీలు ఎగ్జిట్ పోల్స్‌పై దృష్టిపెట్టనున్నాయి. అయితే, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఎగ్జిట్ పోల్స్ తుది ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బయటకు రావు. ఇక ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికలు దేశ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

This post was last modified on February 4, 2025 10:35 am

Share

Recent Posts

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…

1 hour ago

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

7 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

9 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

11 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

11 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

11 hours ago