Political News

ఢిల్లీ పొలిటికల్ ఫైట్.. ఎగ్జిట్ పోల్స్ నిషేధం!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఫిబ్రవరి 5న మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, సాయంత్రం వరకు ప్రచారానికి అవకాశం ఉండడంతో పార్టీలు చివరి క్షణం వరకు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. అధికారంలో కొనసాగాలని ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుండగా, బీజేపీ అధికారం చేజిక్కించుకోవాలని హోరాహోరీ ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ కూడా తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించింది.

ప్రచారంలో భాగంగా బీజేపీ ఒక్కరోజులోనే 22 రోడ్డు షోలు నిర్వహించడం విశేషం. ఢిల్లీ ఎన్నికలతో పాటు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కొన్ని కఠిన నిబంధనలు అమలు చేసింది. ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు ఎగ్జిట్ పోల్స్, ఇతర సర్వేలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎన్నికల సంఘం ప్రకటించిన నిబంధనల ప్రకారం, పోలింగ్ ముగిసే 48 గంటల ముందు నుంచి ఎలాంటి ఎన్నికల సర్వేలను ప్రచురించకూడదని స్పష్టం చేసింది. అదనంగా, ఒపీనియన్ పోల్స్, ఇతర విశ్లేషణలపై కూడా నిషేధం విధించింది. ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియకు భంగం కలగకుండా ఉండేందుకు తీసుకున్నవి. ఇకపోతే, ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్యే జరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన ఆప్, మరోసారి ప్రజాదరణను పొందుతుందా? లేక బీజేపీ గట్టిపోటీ ఇచ్చి ఢిల్లీ సింహాసనాన్ని అందుకుంటుందా? అనే ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో తన హోదాను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. పోలింగ్ ముగిసిన వెంటనే అన్ని పార్టీలు ఎగ్జిట్ పోల్స్‌పై దృష్టిపెట్టనున్నాయి. అయితే, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఎగ్జిట్ పోల్స్ తుది ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బయటకు రావు. ఇక ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికలు దేశ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

This post was last modified on February 4, 2025 10:35 am

Share

Recent Posts

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కన్నుమూత

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని (57) కన్నుమూశారు. నానికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను…

9 minutes ago

రెండు కిక్ ఇచ్చాయి… ఒకటి షాక్ కొట్టింది

నిర్మాత నాగవంశీ ఈ మధ్య మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అఖిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లెనిన్…

42 minutes ago

బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఫలితం దక్కలేదు

మొన్న గురువారం విడుదలైన సినిమాల్లో మారెమ్మ కూడా ఉంది. మాములుగా అయితే స్టార్ కాస్టింగ్ లేని ఇలాంటి మూవీని జనం…

2 hours ago

పీడకలగా మారుతున్న పార్ట్ 2 ఫలితాలు

ఒక హిట్ మూవీకి కొనసాగింపు ఉండాలనుకోవడం మంచిదే. కథ డిమాండ్ చేసినప్పుడు, దానికి అనుగుణంగా దర్శకులు తమ క్రియేటివిటీని జోడించి,…

3 hours ago

స్థానిక ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ముచ్చెమటలు

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడింది. బీజేపీ కంచుకోటల్లో…

4 hours ago

కాకా ఎప్పుడు వస్తే బాగుంటుంది

2027 సంక్రాంతికి విశ్వంభర విడుదల దాదాపు ఖాయమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ చిరంజీవి అంగీకారం…

4 hours ago