ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఫిబ్రవరి 5న మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, సాయంత్రం వరకు ప్రచారానికి అవకాశం ఉండడంతో పార్టీలు చివరి క్షణం వరకు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. అధికారంలో కొనసాగాలని ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుండగా, బీజేపీ అధికారం చేజిక్కించుకోవాలని హోరాహోరీ ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ కూడా తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించింది.
ప్రచారంలో భాగంగా బీజేపీ ఒక్కరోజులోనే 22 రోడ్డు షోలు నిర్వహించడం విశేషం. ఢిల్లీ ఎన్నికలతో పాటు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కొన్ని కఠిన నిబంధనలు అమలు చేసింది. ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు ఎగ్జిట్ పోల్స్, ఇతర సర్వేలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎన్నికల సంఘం ప్రకటించిన నిబంధనల ప్రకారం, పోలింగ్ ముగిసే 48 గంటల ముందు నుంచి ఎలాంటి ఎన్నికల సర్వేలను ప్రచురించకూడదని స్పష్టం చేసింది. అదనంగా, ఒపీనియన్ పోల్స్, ఇతర విశ్లేషణలపై కూడా నిషేధం విధించింది. ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియకు భంగం కలగకుండా ఉండేందుకు తీసుకున్నవి. ఇకపోతే, ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్యే జరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన ఆప్, మరోసారి ప్రజాదరణను పొందుతుందా? లేక బీజేపీ గట్టిపోటీ ఇచ్చి ఢిల్లీ సింహాసనాన్ని అందుకుంటుందా? అనే ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో తన హోదాను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. పోలింగ్ ముగిసిన వెంటనే అన్ని పార్టీలు ఎగ్జిట్ పోల్స్పై దృష్టిపెట్టనున్నాయి. అయితే, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఎగ్జిట్ పోల్స్ తుది ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బయటకు రావు. ఇక ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికలు దేశ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
This post was last modified on February 4, 2025 10:35 am
డివైడ్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమాలు థియేటర్లలో బలంగా నిలబడ్డం అంటే చిన్న విషయం కాదు. చెన్నై లవ్ స్టోరీ…
ఒకప్పుడు యుఎస్లో తెలుగు సినిమాలు విడుదల కావడాన్నే గొప్పగా భావించేవాళ్లం. అలాంటిది అది తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్గా తయారైంది. మన…
మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…
టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…
వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భాగంగా ఇటీవల కాలంలో `రప్పా-రప్పా` డైలాగులు తరచుగా వినిపించేవి. రప్పా-రప్పా అని రాసున్న బ్యానర్లు,…
వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…