Political News

ఢిల్లీ పొలిటికల్ ఫైట్.. ఎగ్జిట్ పోల్స్ నిషేధం!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఫిబ్రవరి 5న మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, సాయంత్రం వరకు ప్రచారానికి అవకాశం ఉండడంతో పార్టీలు చివరి క్షణం వరకు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. అధికారంలో కొనసాగాలని ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుండగా, బీజేపీ అధికారం చేజిక్కించుకోవాలని హోరాహోరీ ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ కూడా తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించింది.

ప్రచారంలో భాగంగా బీజేపీ ఒక్కరోజులోనే 22 రోడ్డు షోలు నిర్వహించడం విశేషం. ఢిల్లీ ఎన్నికలతో పాటు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కొన్ని కఠిన నిబంధనలు అమలు చేసింది. ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు ఎగ్జిట్ పోల్స్, ఇతర సర్వేలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎన్నికల సంఘం ప్రకటించిన నిబంధనల ప్రకారం, పోలింగ్ ముగిసే 48 గంటల ముందు నుంచి ఎలాంటి ఎన్నికల సర్వేలను ప్రచురించకూడదని స్పష్టం చేసింది. అదనంగా, ఒపీనియన్ పోల్స్, ఇతర విశ్లేషణలపై కూడా నిషేధం విధించింది. ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియకు భంగం కలగకుండా ఉండేందుకు తీసుకున్నవి. ఇకపోతే, ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్యే జరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన ఆప్, మరోసారి ప్రజాదరణను పొందుతుందా? లేక బీజేపీ గట్టిపోటీ ఇచ్చి ఢిల్లీ సింహాసనాన్ని అందుకుంటుందా? అనే ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో తన హోదాను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. పోలింగ్ ముగిసిన వెంటనే అన్ని పార్టీలు ఎగ్జిట్ పోల్స్‌పై దృష్టిపెట్టనున్నాయి. అయితే, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఎగ్జిట్ పోల్స్ తుది ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బయటకు రావు. ఇక ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికలు దేశ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

This post was last modified on February 4, 2025 10:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సాయిపల్లవి బరిలో ఉంటే అవార్డ్ ఇవ్వాల్సిందే

హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…

37 minutes ago

‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది

“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…

1 hour ago

విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…

1 hour ago

ఇటు వివాదం… అటు ముహూర్తం

జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…

1 hour ago

కమల్ హీరో… రజినీ విలన్?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…

2 hours ago

ప్రేమ పెళ్ళి.. తల్లిదండ్రులకు సమాచారం తప్పనిసరి

వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…

3 hours ago