Political News

ఢిల్లీ పొలిటికల్ ఫైట్.. ఎగ్జిట్ పోల్స్ నిషేధం!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఫిబ్రవరి 5న మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, సాయంత్రం వరకు ప్రచారానికి అవకాశం ఉండడంతో పార్టీలు చివరి క్షణం వరకు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. అధికారంలో కొనసాగాలని ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుండగా, బీజేపీ అధికారం చేజిక్కించుకోవాలని హోరాహోరీ ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ కూడా తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించింది.

ప్రచారంలో భాగంగా బీజేపీ ఒక్కరోజులోనే 22 రోడ్డు షోలు నిర్వహించడం విశేషం. ఢిల్లీ ఎన్నికలతో పాటు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కొన్ని కఠిన నిబంధనలు అమలు చేసింది. ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు ఎగ్జిట్ పోల్స్, ఇతర సర్వేలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎన్నికల సంఘం ప్రకటించిన నిబంధనల ప్రకారం, పోలింగ్ ముగిసే 48 గంటల ముందు నుంచి ఎలాంటి ఎన్నికల సర్వేలను ప్రచురించకూడదని స్పష్టం చేసింది. అదనంగా, ఒపీనియన్ పోల్స్, ఇతర విశ్లేషణలపై కూడా నిషేధం విధించింది. ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియకు భంగం కలగకుండా ఉండేందుకు తీసుకున్నవి. ఇకపోతే, ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్యే జరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన ఆప్, మరోసారి ప్రజాదరణను పొందుతుందా? లేక బీజేపీ గట్టిపోటీ ఇచ్చి ఢిల్లీ సింహాసనాన్ని అందుకుంటుందా? అనే ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో తన హోదాను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. పోలింగ్ ముగిసిన వెంటనే అన్ని పార్టీలు ఎగ్జిట్ పోల్స్‌పై దృష్టిపెట్టనున్నాయి. అయితే, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఎగ్జిట్ పోల్స్ తుది ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బయటకు రావు. ఇక ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికలు దేశ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

This post was last modified on February 4, 2025 10:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యార్ల‌గ‌డ్డ స‌త్తా చాటుకున్నారే

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. స‌త్తా చాటుకున్నారు. సాధార‌ణ అభివృద్ధి ప‌నుల‌తో పాటు.. ఎవ‌రూ ఊహించ‌ని…

5 minutes ago

శర్వానంద్ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారా

నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…

23 minutes ago

ఓపెనింగ్ టాక్…. డామినేషన్ ఎవరిది?

నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…

42 minutes ago

మహిళా కమిషన్ నుండి ఎమ్మెల్యే టికెట్ వైపు?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ ప‌ర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…

2 hours ago

సునీల్ వ‌ర్సెస్ RRR.. మ‌రింత ముదిరిందిగా!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న సునీల్‌కు రఘురామకు…

6 hours ago

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

9 hours ago