Political News

అసెంబ్లీకి రాకుంటే వేటు తప్పదు సారూ..!

తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీ అసెంబ్లీకి విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు. ఏదో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలి కాబట్టి తొలి రోజు సమావేశానికి వచ్చి ఆ 11 మంది మమ అనిపించారు.ఇక తెలంగాణలో అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యులంతా ఎంచక్కా సభకు వస్తున్నారు. అధికార పక్షానికి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. అయితే ప్రదాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం అసెంబ్లీ గడప తొక్కట్లేదు. ఇదేం పద్దతి అంటూ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ తెలంగాణ అనే ఓ రైతు సంస్థ ఆయనను నిలదీసింది.

కేసీఆర్ ను ఆ సంస్థ నిలదీయడంతోనే వదిలిపెట్టలేదండోయ్… ఏకంగా లీగల్ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడిప్పుడే కాస్తంత బయటకు వద్దామని భావిస్తున్న కేసీఆర్ కు ఈ పరిణామం ఊహించనిదేనని చెప్పక తప్పదు. రాష్ట్రానికి బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి… అసెంబ్లీకి వచ్చి… రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాల్సిన మీరు అసలు అసెంబ్లీ ముఖమే ఎందుకు చూడట్లేదని సదరు నోటీసుల్లో ఆ సంస్థ ప్రశ్నించింది. అసెంబ్లీకి రాకపోవడం అంటే… ప్రదాన ప్రతిపక్ష నేత బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైనట్టేనని కూడా ఆ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అక్కడితో సరిపెట్టని ఆ రైతుల సంస్థ… అసలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదన్న విషయాన్ని కేసీఆర్ నుంచి రాబట్టాలని స్పీకర్ కార్యాలయాన్ని డిమాండ్ చేసింది. ఇందుకోసం కేసీఆర్ కు సమన్లు జారీ చేయాలని కూడా కోరింది. కేసీఆర్ నుంచి ఆమోదించదగ్గ సమాధానం వస్తే సరేసరి.. లేదంటే ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా ఆ సంస్థ స్పీకర్ ను కోరింది. అసెంబ్లీ రాకుండా ఇప్పటికే కేసీఆర్ ఓ ఎమ్మెల్యేగా కొనసాగే అర్హతను కూడా కోల్పోయారని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి విజయపాల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సంస్థ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి… నోటీసులను మెయిల్, స్పీడ్ పోస్టుల ద్వారా కేసీఆర్ కు పంపారు.

This post was last modified on February 4, 2025 10:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

1 hour ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

4 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

4 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

4 hours ago

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

5 hours ago