ఏపీ సీఎం చంద్రబాబు ఒక పని పెట్టుకున్నారంటే.. దాంతోనే సరిపుచ్చుకోరు. దానికి అనుబంధంగా ఉన్న ఇతర పనులను కూడా సర్దుకుని వస్తుంటారు. ఉన్న సమయాన్ని.. ఉన్న అవకాశాలను ఆయన ఎట్టి పరిస్థితిలోనూ వదులుకునే ప్రయత్నం చేయరు. అందుకే.. బాబు గ్రేట్ లీడర్ అనే టాక్ తెచ్చుకున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. ఆయన ఎందుకు వెళ్లారంటే.. కూటమిలో పెద్దన్నగా ఉన్న బీజేపీ తరఫున ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వెళ్లారనే సమాధానం వస్తుంది.
ఆయన ప్రచారం కూడా చేశారు. ఇంతటితో కథ ఎండ్. ఆ వెంటనే ఆయన ఓ పూట అక్కడే రెస్టు తీసుకుని.. ఫ్లైట్ ఎక్కేస్తే.. పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఎవరూ ఆయనను క్వశ్చన్ కూడా చేయరు. కానీ, అలా చేస్తే.. చంద్రబాబు ఎలా అవుతారు..? స్వామి కార్యంతోపాటు స్వకార్యం కూడా చూసుకున్నారు. అంటే.. ఎవరికోసం హస్తిన వెళ్లారో.. అక్కడ వారి తరఫున ప్రచారం చేసిన చంద్రబాబు అది ముగియగానే.. ఏపీ గురించిన అంశాలపై దృష్టి పెట్టారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రయోజనాలపై ఆయన కీలక నేతలతో భేటీ అయ్యారు.
16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియాతో తాజాగా చంద్రబాబు భేటీ అయ్యారు. వాస్తవానికి ఇది చంద్రబాబు షెడ్యూల్లో లేదు. అయినప్పటికీ.. ఆయన సమయం చిక్కగానే దానిని సద్వినియోగం చేసుకున్నారు. ఇక, పనగాడియాతో చంద్రబాబు భేటీ కూడా అనూహ్యమే. కేవలం 30 నిమిషాలని భావించిన ఈ సమావేశం.. ఏకంగా 2 గంటలపాటు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. గత ఐదేళ్ల పరిణామాలు, ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు టీడీపీ ఎంపీలు తెలిపారు.
ఇక, ఇదేసమయంలో పనగాడియాకు చంద్రబాబు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని ఎంపీలు పేర్కొన్నారు. నిజానికి పనగాడియా అంటే.. ప్రధాని తర్వాత.. అంతస్థాయి ఉన్న కీలక అధికారి. పైగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ కూడా! ఆయన చెప్పింది.. కేంద్రం చేసేందుకు మెజారిటీ అవకాశం ఉంది. ఈ నేపత్యంలోనే చంద్రబాబు ఒక కారణం కోసం ఢిల్లీకి వచ్చినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం.. అవకాశం చిక్కగానే దానిని సద్వినియోగం చేసుకుని స్వకార్యాన్ని కూడా చక్కగా పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు.
This post was last modified on February 4, 2025 9:51 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…